Car Accident హై స్పీడ్లో రెండు కార్లు ఢీ, చెలరేగిన మంటలు.. సీసీటీవీలో రికార్డయిన యాక్సిడెంట్ దృశ్యాలు
నిత్యం రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను తరచుగా వార్తల్లో చూస్తునే ఉంటాం. డ్రైవర్ అవగాహనా లోపం, అతి వేగం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం తదితర కారణాల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణపై ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట అవి నిత్యకృత్యమవుతున్నాయి.
తాజాగా శనివారం అర్ధరాత్రి మహారాష్ట్రలో జరిగిన ఓ ప్రమాదం భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రమాదానికి గురైన రెండు వాహనాల్లో ఒకటి అతివేగంతో రావడమే ఇందుకు కారణం. జంక్షన్లో టర్నింగ్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిఘా కెమెరాల కారణంగా ప్రమాదం జరిగిన తీరు స్పష్టంగా మనకు తెలుస్తోంది.

మహారాష్ట్రలోని థానేలో శనివారం అర్ధరాత్రి ఖాళీగా ఉన్న రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కియా సెల్టోస్ కారు జంక్షన్ వద్ద మలుపు తిరిగిన వెంటనే నెమ్మదిగా ముందుకు సాగుతోంది. అదే సమయంలో క్షణకాలంలో అతివేగంగా వస్తున్న హ్యుందాయ్ క్రెటా కారు జంక్షన్ వద్ద సెల్టోస్ను ఢీకొంది. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడటం మరియు రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి బాధ్యతారహితమైన డ్రైవింగ్ ఇందుకు కారణాలవుతున్నాయి.
వేగంగా వస్తున్న హ్యుందాయ్ క్రెటా సెల్టోస్ను ఢీకొన్న వెంటనే కియా సెల్టోస్ కారు అదుపు తప్పి వలయాకారంలో తిరిగి ముందుకు దూసుకెళ్లింది. అనంతరం కియా కారులో మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ రెండు కార్లు డివైడర్ను కానీ మరే దాన్ని ఢీకొట్టకపోవడంతో డ్రైవర్లు మరియు అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఏదేమైనా ఈ ప్రమాదం వారి నిర్లక్ష్యపు డ్రైవింగ్కు అద్దం పడుతోంది.

ఈ ప్రమాదంలో సీసీ దృశ్యాలను పరిశీలించినట్లయితే హ్యుందాయ్ డ్రైవర్ వేగాన్ని సెల్టోస్ డ్రైవర్ తప్పుగా అంచనా వేసినట్లు భావించవచ్చు. అందుకే ఆ డ్రైవర్ నెమ్మదిగా మలుపు తిరడానికి కారణంగా అర్థమవుతోంది. కానీ అది గమనించని హ్యుందాయ్ డ్రైవర్ వేగాన్ని తగ్గించకుండా అదే స్పీడ్తో రావడంతో ప్రమాదం వాటిల్లింది.
దేశంలోని రహదారులపై సరైన మార్గంలో వెళ్లాలి అనే భావనను తరచుగా వాహనదారులు విస్మరిస్తున్నారు. రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి కూడళ్లను చేరుకునేటప్పుడు జాగ్రత్త వహించడం మరియు వేగాన్ని తగ్గించడం చాలా కీలకం. అదేవిధంగా, హైవేలపై ప్రయాణించేటప్పుడు, పట్టణాలు మరియు గ్రామాల వంటి జనావాస ప్రాంతాల గుండా వెళుతున్నప్పుడు వేగం తగ్గించడం ఉత్తమం.
పాదచారుల క్రాసింగ్లు ఉన్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు సమయాన్ని ఆదా చేసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు హైవేని దాటడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రాంతాల్లో అర్ధరాత్రులు విచ్చలవిడి జంతువులు, పశువులను సంచరించడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. రహదారులపై జంతువుల కళేబరాలే ఈ ఘటనలకు ఉదాహరణలు. హైవేలపై సురక్షితమైన వేగాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం.
అధ్యయనాల ప్రకారం, తీవ్ర ప్రమాదాలు ప్రధానంగా పెద్ద మెట్రోపాలిటన్ నగరాల్లో సంభవిస్తాయి. అగ్రస్థానంలో న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. న్యూఢిల్లీలో అత్యధిక ప్రమాదాల రేటు 20.3% ఉండగా, ముంబై 18.8% ప్రమాద రేటుతో రెండవ స్థానంలో ఉంది. అతి తక్కువ ప్రమాదాలు జరిగే మెట్రోపాలిటన్ నగరం బెంగళూరు. నిరంతర ట్రాఫిక్ జామ్ కూడా తక్కువ ప్రమాదాలకు కారణం కావచ్చు.
డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








