Just In
- 13 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 15 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 17 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 20 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో పోస్ట్.. అదేంటో చూసారా ?
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా చురుకుగా ఉంటారు. దేశంలో మరియు విదేశాలలో జరుగుతున్న ఆసక్తికరమైన విషయాలు వారి ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటాడు. ఇటీవల ఆనంద్ మహీంద్రా భారత వైమానిక దళం హెలికాప్టర్ ఫోటోని ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ ఫొటోలో వైమానిక దళం హెలికాప్టర్ మహీంద్రా ట్రాక్టర్ ఎత్తడం చూడవచ్చు.
మహీంద్రా ట్రాక్టర్కు మాత్రమే 11,000 అడుగుల ఎత్తులో ప్రయాణించే శక్తి ఉందని ఆనంద్ మహీంద్రా రాశారు. ఆనంద్ మహీంద్రా రాసిన ఈ పోస్ట్కు ఇప్పటివరకు 100 కి పైగా రీట్వీట్లు, 2.5 వేలకు పైగా లైక్లు వచ్చాయి. లడఖ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ నుండి వేలాది అడుగుల దూరం ప్రయాణించడానికి భారత వైమానిక దళం హెలికాప్టర్లను ఉపయోగిస్తుంది.
ఈ ప్రదేశాలలో, భారీ వస్తువులను రవాణా చేయడానికి వైమానిక దళం ట్రాక్టర్లను ఉపయోగిస్తుంది. మహీంద్రా భారత సైన్యం కోసం సాయుధ వాహనాలను కూడా ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:భారత మార్కెట్లో డుకాటీ మల్టీస్ట్రాడా 950 ఎస్ బిఎస్ 6 బైక్ లాంచ్ : ధర & ఇతర వివరాలు
అదనంగా మహీంద్రా యాంటీ ల్యాండ్మైన్, క్యారేజ్ వెహికల్ మరియు మిలిటరీ కోసం అనేక తేలికపాటి మరియు భారీ వాహనాలను కూడా ఉత్పత్తి చేస్తుంది.
ఇటీవల, ఆనంద్ మహీంద్రా బీహార్ లో 3 కిలోమీటర్ల కాలువ తవ్విన లాంగ్ భూయాన్ అనే రైతుకు ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన సమాచాన్ని ఇదివరకటి కథనాన్లో తెలియజేయడం జరిగింది. లూంగ్ భూయాన్ తన గ్రామంలో వ్యవసాయానికి నీటి సమస్యను తగ్గించడానికి 30 సంవత్సరాల కృషితో 3 కిలోమీటర్ల పొడవైన కాలువను నిర్మించాడు.
MOST READ:ఎట్టకేలకు భారత్లో అడుగుపెట్టిన BMW X3 M ; ధర & ఇతర వివరాలు
అతను చేసిన ఈ కృషికి ఫలితంగా ప్రేరణపొందిన ఆనంద్ మహీంద్రా ట్రాక్టర్ బహుమతి ఇచ్చారు. ట్రాక్టర్ గిఫ్ట్ గా పొందిన ఆ వ్యక్తి ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆనంద్ మహీంద్రా ట్రాక్టర్ గిఫ్ట్ గా ఇవ్వడం గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అంతే కాకుండా ఇటీవల ఆనంద్ మహీంద్రా లైబ్రరీగా మార్చబడిన బొలెరో ఫోటోని కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆనంద్ మహీంద్రా ఇండియన్ ఆటోమొబైల్ లో తమకంటూ ఉన్న ప్రత్యేకతను ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కువగా అదరణపొందుతున్న వాహనాల జాబితాలో మహీంద్రా వాహనాలు ఎక్కువగా ఉన్నాయి.