Just In
- 3 min ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 13 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 15 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 16 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
Don't Miss
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజెన్ ట్యాంకర్స్ సరఫరా
భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. ఆక్సిజెన్ కొరత కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో, కరోనా రోగులు ఉన్న ఆసుపత్రులకు అత్యంత వేగంగా ఆక్సిజన్ సరఫరా చేయడానికి భారత వైమానిక దళం తమ యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది.
భారత వైమానిక దళానికి చెందిన గ్లోబ్ మాస్టర్ సి-17 మరియు ఇల్యూసిన్ ఐఎల్76 యుద్ధ విమానాలలో ఆక్సిజెన్ ట్యాంకర్ ట్రక్కులను రవాణా చేస్తున్నారు. ఈ ట్రక్కులను రోడ్డు మార్గం ద్వారా తీసుకువెళ్లడానికి ఆరు రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో, వీలైనంత త్వరగా వీటిని ఆస్పత్రులకు చేర్చేందుకు ఐఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా కరోనా రోగులకు చికిత్స అందించే ఆసుపత్రులలో ఇప్పుడు ఆక్సిజన్ కొరత ఒక ప్రధాన సమస్యగా మారింది. ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా రోగులు చనిపోతున్న సంఘటనలు అధికమవుతున్న నేపథ్యంలో, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ సరఫరాను వేగవంతం చేస్తున్నాయి.
MOST READ:డ్రోన్ సర్వీస్ ద్వారా కరోనా వ్యాక్సిన్ మరింత వేగవంతం; ఐసిఎంఆర్
తెలంగాణలో కోవిడ్ బాధితుల కోసం, యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదం తెలిపారు. యుద్ధ విమానాల్లో ఆక్సిజెన్ ట్యాంకర్ల ద్వారా రాష్ట్రానికి ఆక్సిజన్ను తీసుకువస్తున్నారు.
ఖాలీ ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్కు బయల్దేరాయి. భువనేశ్వర్ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి రానుంది.
MOST READ:అలెర్ట్.. అక్కడ కలర్ కోడెడ్ స్టిక్కర్ సిస్టమ్ బంద్; కొత్త సిస్టమ్ స్టార్ట్
మొత్తం 8 ఖాళీ ట్యాంకర్లతో కూడిన ట్రక్కులను హైదరాబాద్ నుంచి విమానాల్లో తీసుకెళ్లారు. ఈ విధానం ద్వారా అతి త్వరగా ఆక్సిజన్ ట్యాంకర్లు మన రాష్ట్రానికి చేరుకుంటాయి. ఆక్సిజన్ సరఫరా కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రయత్నం చేయడం విశేషం.
ఈ విషయంలో భారత వైమానిక దళం గ్లోబ్మాస్టర్ సి-17 మరియు ఇల్యూసిన్ ఐఎల్-76 మిలిటరీ కార్గో విమానాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. యుద్ధ సమయాల్లో కూడా ఈ విమానాలు సైనికులకు అవసరమైన సామాగ్రిని రవాణా చేయటంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
MOST READ:కరోనా టైమ్లో ఆటో సర్వీస్ ఫ్రీ.. కేవలం వారికి మాత్రమే.. ఎక్కడంటే
ఈ విమానాలు సాధారణంగా పెద్ద సైనిక ట్రక్కులు, సైనిక పరికరాలు, ఫిరంగులు, ఆయుధాలు మరియు సాయుధ దళాలను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఒక్కో విమానంలో నాలుగు ఆక్సిజన్ ట్యాంకర్ల చొప్పున మొత్తం ఎనిమిది భారీ ట్యాంకర్లను ఈ విమానంలో లోడ్ చేశారు.
రష్యాకు చెందిన ఇల్యూసిన్ ఐఎల్76 కార్గో విమానం సుమారు 40 టన్నుల బరువును మోయగలవు. ఈ విమానం 4 ఇంజన్లతో పనిచేస్తుంది మరియు గంటకు 850 కిమీ వేగంతో ప్రయాణించగలదు. భారత వైమానిక దళంలో 14 ప్రముఖ ఐఎల్76 విమానాలు ఉన్నాయి.
ఇక గ్లోబ్ మాస్టర్ సి-17 విషయానికి వస్తే, ఈ విమానాన్ని అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ రూపొందించింది. ఈ విమానంలో 80 టన్నుల సరుకును రవాణా చేయవచ్చు. ఈ విమానం కూడా 4 ఇంజన్లతో నడుస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 830 కిమీ వేగం ప్రయాణిస్తుంది.