డ్రోన్ సర్వీస్ ద్వారా కరోనా వ్యాక్సిన్ మరింత వేగవంతం; ఐసిఎంఆర్
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా, చాప కింద నీరులాగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మరి కారణంగా ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. కరోనా బాధితుల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూనే త్వరితగతిన కోవిడ్-19 వ్యాక్సిన్ కూడా అందిస్తోంది.

కోవిడ్-19 వ్యాక్సిన్ మరింత వేగవంతం చేయడానికి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ మరియు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఐఐటి కాన్పూర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ వంటివి కోవిడ్-19 వ్యాక్సిన్ ని డ్రోన్స్ ద్వారా సరఫరా చేయడానికి వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి.

ఈ వ్యూహాలన్నీ సక్రమంగా జరిగితే తప్పకుండా త్వరలో కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రోన్ల ద్వారా సరఫరా చేయబడుతుంది. ఈ విధానం ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ దేశంలోని డ్రోన్ల ద్వారా అవసరమైన వారికి అందజేయబడుతుంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక సంవత్సరం పాటు కొన్ని షరతులతో డ్రోన్లను ఉపయోగించడానికి అనుమతి ఇచ్చింది.

డెహ్రాడూన్, హల్ద్వానీ, హరిద్వార్ మరియు రుద్రపూర్ మునిసిపల్ కార్పొరేషన్లు కూడా కొన్ని నిబంధనలతో డ్రోన్లను ఉపయోగించడానికి అనుమతించబడ్డాయి. దీని కోసం వారు జిఐఎస్ బేస్డ్ డేటాబేస్ మరియు ఎలక్ట్రానిక్ టాక్స్ రిషిఫ్టు కోసం డేటాను సిద్ధం చేస్తున్నారు.

గత సంవత్సరం కరోనా మహమ్మారిని నివారించడానికి, అనేక నగరాల్లో క్రిమిసంహారక మందులను స్ప్రే చేయడానికి డ్రోన్లను ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా కరోనా ప్రభావిత ప్రాంతాలు మరియు కంటైన్మెంట్ జోన్లలోని డ్రోన్ల ద్వారా ఆహార ప్యాకెట్లు మరియు అవసరమైన నిత్యావసర సామాగ్రిని కూడా పంపిణీ చేశారు.

ప్రస్తుతం నివేదికల ప్రకారం, అత్యవసరమైన వైద్య సామాగ్రి మరియు ఇతర వస్తువులను డ్రోన్లను ఉపయోగించి తీసుకోవచ్చు. ఈ విధానం ద్వారా కరోనా మహమ్మారి నుంచి సోషల్ డిస్టెన్స్ పాటించబడుతుంది. డ్రోన్ వ్యాక్సిన్ను సాధారణ వాహనం కంటే వేగంగా పంపించగలదు.

రోడ్లు ట్రాఫిక్ గా ఉన్న సమయంలో వాహనాల ద్వారా ఏదైనా వస్తువులను రవాణా చేయడం కష్టతరం అయితే, డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ రోడ్లలో కూడా చాలా వేగంగా చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోవచ్చు.

భారతదేశంలో చాలా వేగంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులపై ఇటీవల చైనా స్పందించింది. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు భారత్తో మాట్లాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది.

భారతదేశంలో ఒక్క గురువారం రోజు మాత్రమే 3 లక్షల 14 వేల 835 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా నమోదైన కేసులను తెలియజేస్తుంది. ఈ సంఖ్యను బట్టి భారతదేశంలో ఈ మహమ్మారి ఎంత తీవ్రంగా వ్యాపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








