మీకు తెలుసా.. అంతర్రాష్ట్ర ప్రయాణానికి ఈ టెస్ట్ అవసరం లేదు
కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలో అత్యధికంగా వ్యాపిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కరోనా లాక్ డౌన్ మరియు కర్ఫ్యూ లాంటివి అమలులో ఉన్నాయి.

అయితే ఈ సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాకుండా ప్రజలు కొంత అనారోగ్యంపాలయితే తప్పకుండా ఆర్టీ-పిసిఆర్ టెస్ట్ చేసుకోవాలి. కానీ ఆరోగ్యంగా ఉన్న వారు ఈ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతరాష్ట్ర ప్రయాణానికి ఆర్టీ-పిసిఆర్ టెస్ట్ తీసుకోవలసిన అవసరం లేదని ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసిఎంఆర్) పేర్కొంది.

ఈ నియమం కేవలం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ నేపథ్యంలో ల్యాబ్లు చాలా రద్దీగా ఉంటాయి. ల్యాబ్లు రద్దీని నివారించడానికి ఒకసారి ఈ ఆర్టీ-పిసిఆర్ టెస్ట్ కి వచ్చిన వ్యక్తి తిరిగి టెస్ట్ చేయించుకోకూడదని ఐసిఎంఆర్ సూచించింది.

కరోనా వైరస్ టెస్ట్ చేయడానికి ల్యాబ్లు చాలా రద్దీగా ఉంటుంది. కావున వీలైనంత వరకూ ఈ రద్దీని తగ్గించడానికి ఆరోగ్యవంతులైన ప్రజలు టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ టెస్ట్ సమయంలో సకాలంలో రిపోర్ట్ పొందేవిధంగా ఉండాలని చెబుతున్నారు.

కొత్త ఆర్డినెన్స్ ప్రకారం, కరోనా లక్షణాలు లేని వ్యక్తులు కరోనా పరీక్ష చేయించుకోవలసిన అవసరం లేదు. బస్సు, ట్రైన్ మరియు ఫ్లైట్ లో ప్రయాణించే ప్రయాణీకులకు ఈ నియమం వర్తిస్తుంది. అయితే అనవసరమైన అంతరాష్ట్ర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదని ఐసిఎంఆర్ సూచించింది.

అంతర్రాష్ట్ర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు చాలా వరకు తగ్గించాలి. ఇందులో కూడా జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ ప్రయాణాన్ని ఉపసంహరించుకోవాలని తెలిపారు. ప్రయాణీకులందరూ కోవిడ్ భద్రతా నియమాలను పాటించాలని ఇది పేర్కొంది.

ఇంతలో కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ సమయంలో ఇ-పాస్లు తీసుకుని ప్రయాణించడం తప్పనిసరి చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ యొక్క విధానం ప్రకారం, రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పుడు కరోనా రోగులను పరీక్షించాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం భారతదేశంలో ఆర్టీ-పిసిఆర్, ట్రూనాట్, సిబినాట్ సహా 2,506 టెస్ట్ ల్యాబ్లు ఉన్నాయి. ఈ ప్రయోగశాలలు ప్రతిరోజూ మూడు షిఫ్టులు చేస్తాయి. ఇందులో ప్రతి రోజు 1.5 మిలియన్ టెస్ట్ లు జరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా వైరస్ ఏ విధంగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రతిరోజూ కరోనా సోకిన రోగుల సంఖ్య పెరుగుతున్నందున, సకాలంలో నివేదికలను అందించడానికి ప్రయోగశాలలపై ఒత్తిడి పెరుగుతోంది. రోజు రోజుకి టెస్ట్ లు మరింత పెంచాలని ఐసిఎంఆర్ సిఫార్సు చేస్తుంది. ప్రస్తుతం రోగుల సంఖ్య పెరుగుతున్న కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాల్లో టెస్ట్ లకు అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది.


Click it and Unblock the Notifications








