ఒక్క బటన్తో ప్రపంచ పటంలో కొన్ని దేశాలనే తుడిచేయ గల సతన్ 2 మిస్సైల్
రష్యా తాజాగ సతన్ 2 అనే అత్యాధునిక న్యూక్లియర్ మిస్సైల్ను అభివృద్ది చేసింది. ఒక్క సారి దీనిని ప్రయోగిస్తే ఫ్రాన్స్ పరిమాణంలో ఉన్న దేశాన్ని మొత్తం క్షణంలో నాశనం చేయవచ్చు.
మిలిటరీ మరియు సైనిక శక్తి సామర్థ్యాలను అత్యధికంగా కలిగి ఉన్న దేశాలలో మొదటి అమెరికా తరువాత స్థానంలో ఉంది రష్యా. అయితే అత్యాధినిక అణు క్షిపణులు రూపకల్పిన, యుద్ద సామాగ్రి అభివృద్దిలో రష్యాదే పై చేయి. ఓ దశలో ప్రపంచ దేశాలకు కావాల్సిన వివిధ యుద్ద సామాగ్రిని అందివ్వడంలో రష్యా కీలక పాత్ర పోషిస్తోంది.

రష్యా తాజాగ సతన్ 2 అనే అత్యాధునిక న్యూక్లియర్ మిస్సైల్ను అభివృద్ది చేసింది. ఒక్క సారి దీనిని ప్రయోగిస్తే ఫ్రాన్స్ పరిమాణంలో ఉన్న దేశాన్ని మొత్తం క్షణంలో నాశనం చేయవచ్చు.

రష్యా ఇంతకు మునుపు సతన్ అనే మిస్సైల్ అభివృద్ది చేసింది దానికి అనుసంధానంగానే ఈ సతన్ 2 మిస్సైల్ను అభివృద్ది చేసింది.

దీనిని ప్రయోగించిన అనంతరం 10,000 కిలోమీటర్ల పరిధి వరకు సుమారుగా డజన్ మేర ఉన్న లక్ష్యాలను నాశనం చేయగలదు.

ఈ సతన్ 2 మిస్సైల్లో వినియోగించిన వార్ హెడ్స్ అత్యంత శక్తివంతమైనవి. జపాన్ మరియు రెండవ ప్రపంచ యుద్దంలో వినియోగించిన వాటికంటే 1,000 రెట్లు శక్తివంతమైనవి.

100 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ మెగా న్యూక్ న్యూక్లియర్ మిస్సైల్ను రష్యా సనత్ 2 అనే పేరుతో పిలుస్తోంది.

మిస్సైళ్లను తయారు చేసే మేకేవ్ రాకెట్ డిజైన్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం ఈ రాకెట్ను రానున్న రెండేళ్లలోపు ప్రయోగించినున్నట్లు తెలిసింది.

రష్యా రక్షణలో భాగంగా రష్యా వ్యూహాత్మక ధళ బలగాలకు కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిసింది. అధికారికంగా దీనికి ఆర్ఎస్-28 సర్మత్ అనే పేరును ఖరారు చేసినట్లు కూడా తెలిసింది.

అత్యంత భయంకరమైన ఈ మిస్సైల్స్ ప్రస్తుతం మానవుడు వద్ద ఉన్న అనేక శక్తివంతమైన ఆయుధాలను నాశనం చేయగలదు.

ఒక్క సారి ప్రయోగిస్తే సుమారుగా 16 అణు బాంబులను వెంటతీసుకెళ్లి విభిన్న ప్రదేశాలలో ఉన్న లక్ష్యాల మీద దాడి చేయగలగే సామర్థ్యం కలదు.

వీటిని ఖండాతర దాడులకు కూడా వినియోగించవచ్చు. అమెరికా మరియు యూరప్ సముద్రం తీరాల వరకు వీటిని ప్రయోగించే సామర్థ్యం కలదు.

- ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యన్ మిస్సైల్స్ ఇప్పడు భారత్ వద్ద
- మోడీ ఎఫెక్ట్; భారతదేశ రక్షణ ఒప్పందంపై ప్రపంచ దేశాల పోటీ


Click it and Unblock the Notifications








