రామేశ్వరం మరియు మనామదురైల మధ్య ప్రారంభమైన భారత దేశపు మొదటి గ్రీన్ ట్రైన్ కారిడార్
ఇండియన్ రైల్వే ప్రతి రోజు ఒక కొత్త ప్రత్యేకతను సంతరించుకుంటోంది. తన అభివృద్ది కార్యక్రమాల ద్వారా ప్రతి రోజు వార్తల్లోకెక్కుతోంది. అభివృద్దిలో ఒక భాగమే ఈ గ్రీన్ ట్రైన్ కారిడార్. గత వారంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రభాకర్ గారు రామేశ్వరం మరియు మనామదురైల మధ్య భారత దేశపు మొదటి గ్రీన్ ట్రైన్ కారిడార్ను ప్రారంభించారు.
భారత దేశపు మొదటి గ్రీన్ ట్రైన్ కారిడార్ గురించి పూర్తి వివరాలు కోసం.....

గ్రీన్ ట్రైన్ కారిడార్లో భాగంగా రైళ్లలోని మరుగుదొడ్లను నుండి వెలువడే మరియు మానవ వ్యర్థాలు రైల్వే ట్రాక్లను అపరిశుభ్రంపాలు చేయకుండా బయె టాయిలెట్లను ఇందులో ప్రవేశపెట్టారు.

తమిళనాడులోని రామేశ్వరం మరియు మనామదురైల మధ్య ఈ మొదటి గ్రీన్ ట్రైన్ కారిడార్ను ప్రారంభించారు.

మానవ వ్యర్థాలు రైల్వే ట్రాక్లను చేరకుండా ఉండేందుకు ఇండియన్ రైల్వే ముందస్తుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రైళ్లలో బయో టాయిలెట్లను కల్పించారు.

కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు పశ్చిమ రైల్వే విభాగంలో భాగంగా ఉన్న ఒఖా-కనాలస్ సెక్షన్లో 141 కిలోమీటర్లు పొడవు మరియు పోరుబందర్ నుండి వాస్జాలియన్ మధ్య ఉన్న 34 కిలోమీటర్ల దూరాన్ని వ్యర్థ రహిత రైల్వే ట్రాక్గా అక్టోబర్ నాటికి మార్చనున్నారు.

ఉత్తర రైల్వేలో భాగంగా సుమారుగా 78 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న జమ్మూ కాత్రా ట్రాక్ను మార్చి 2017 నాటికి గ్రీన్ కారిడార్గా మార్చనున్నామని సురేశ్ ప్రభు ప్రభాకర్ గారు వెల్లడించారు.

రామేశ్వరం - మనామదురై గ్రీన్ కారిడార్ను ప్రారంభించిన సందర్బంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు చెన్నై సెంట్రల్ మరియు తిరుచిరాపల్లి లో అప్గ్రేడెడ్ వై-ఫై సదుపాయాన్ని ప్రారంభించారు.

స్వచ్చ భారత్ మిషన్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేయడానికి గ్రీన్ కారిడార్ను విస్తరణలో ఈ మొదటి గ్రీన్ ట్రైన్ కారిడార్ ఇండియన్ రైల్వేలో అత్యంత ముఖ్యమైన మైలు రాయిగా సురేశ్ ప్రభు గారు అభివర్ణించారు.

రామేశ్వరం రైల్వే స్టేషన్లో రోజూ వారీగా సుమారుగా 26 రైళ్లను గ్రీన్ ట్రైన్లుగా నిర్వహిస్తున్నారు. తద్వారా ఇది గ్రీన్ స్టేషన్గా రూపాంతరం చెందింది. ఇక్కడ నిర్వహింపబడుతున్న అన్ని రైళ్లలో బయె టాయిలెట్లను ఫిట్ చేసారు.

దక్షిణ రైల్వే వారి ప్రకారం సుమారుగా 149 కోచ్లలో 563 బయె టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి.

రామేశ్వరం రైల్వే స్టేషన్లో ఇండియన్ రైల్వే బయె టాయిలెట్ ల్యాబ్ను ప్రారంభించారు. త్వరలో మరిన్ని రైళ్లలో బయో టాయిలెట్లను అందివ్వనున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిపారు.

- పాంబన్, రామేశ్వరాలను కలిపే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు


Click it and Unblock the Notifications








