కిరోసిన్తో నడిచే రాకెట్లకు శ్రీ కారం చుట్టిన ఇస్రో: అమెరికన్ కంపెనీల్లో పుట్టిన గిలి
ప్రపంచం మొత్తం మీద అంతరిక్షరాన్ని అభ్యసించడంలో ఉన్న ముఖ్యమైన ఛాప్టర్ ఇస్రో. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు తన వైపు తలెత్తుకుని చూసే స్థాయికి ఎదుగుతోంది ఇండియన్ ఇస్రో. అందులో భాగంగా ప్రపంచ మొత్తం మరోసారి ఇస్రో నామం మారుమ్రోగిపోయేలా సరికొత్త సృష్టికి శ్రీకారం చుట్టింది. కిరోసిన్ ఇంధనంగా వినియోగించుకుని పది టన్నులు బరువున్న శాటిలైట్లను కక్ష్యలోకి మోసుకెళ్లే రాకెట్ను అభివృద్ది చేస్తోంది. మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

ఇప్పటికే అమెరికా రాకెట్ లాంచింగ్ సంస్థలు చాలా వరకు అమెరికా ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. కారణం అమెరికా తమ శాటిలైట్లను ఇండియాలోని ఇస్రో ద్వారా కక్ష్యలోనికి ప్రవేశపెడుతోంది. దీని ద్వారా అమెరికా రాకెట్ లాంచింగ్ సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతోంది.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశల కన్నా అన్ని రంగాలలో ముందున్న దేశం అమెరికా. మరి అమెరికా లాంటి పెద్ద దేశం మన ఇస్రో సేవలు ఎందుకు వినియోగించుకుంటోంది ? ఇస్రో ద్వారా శాటిలైట్లను అతి తక్కువ ఖర్చుతో ప్రయోగించవచ్చు. మరియు ప్రయోగించి శాటిలైట్లు ఖచ్చితంగా కక్ష్యలోకి చేరుకోవడం.

ఇలా అమెరికానే కాదు సుమారుగా 22 దేశాలకు పైగా ఇండియన్ ఇస్రో సేవలను అందిస్తోంది. దీని ద్వారా భారీ స్థాయిలో విదేశీ ధనాన్ని కూడా సంపాదిస్తోంది.

ఎన్నో విజయాలను సాధించిన ఇస్రో తాజాగా అత్యధికంగా 10 టన్నుల వరకు బరువైన శాటిలైట్లను మోసుకెళ్లే రాకెట్లను తయారు చేస్తోంది.

ఇండియన్ ఇస్రోలో ఉన్న జియోసింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV Mk-2) రాకెట్ అత్యధికంగా రెండు టన్నుల బరువున్న శాటిలైట్లను మాత్రమే మోయగలదు. 10 టన్నుల బరువున్న రాకెట్ అందుబాటులోకి వస్తే ఇదో గొప్ప విజయం అని చెపప్పవచ్చు.

అత్యధిక బరున్న శాటిలైట్లను మోసుకెళ్లడానికి ఉపయోగపడేవి సెమి క్రయోజనిక్ ఇంజన్లు. ఇలాంటి రాకెట్లలో ఇప్పుడు ఇస్రో ఈ సెమి క్రయోజనిక్ ఇంజన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఈ సెమి క్రయోజనిక్ ఇంజన్ యొక్క డిజైన్ మరియు అభివృద్దిని గోద్రేజ్ ఏరోస్పేస్ సంస్థ ఇప్పటికే సిద్దం చేసింది.

ఇందులో కిరోసిన్ మరియు ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్ను ఇంధనంగా వినియోగింస్తారు. సాధారణంగా కిరోసిన్ ఇంధనాన్ని ఇళ్లలో మరియు పురాతణ ఆటోలలో వాడే వారు. అలాంటి కిరోసిన్ ఇంధనంతో రాకెట్ను నడిపే పరిజ్ఞానాన్ని ఇస్రో అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఈ సెమి క్రయోజనిక్ ఇంజన్లు ఇంధనాన్ని మండించి విడుదల చేసే ఎగ్జాస్ట్ కారకాలు పర్యావరణ హితంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇవి విడుదల చేసే వాయువులు ఇతర రాకెట్లు విడుదల చేసే వాయువులతో పోల్చితే ఎంతో తక్కువ స్థాయిలో కాలుష్య కారకాలు ఉంటాయి.

సెమి క్రయోజనిక్ ఇంజన్లో వినియోగంచే ఇంధనం కూడా తక్కువ ధరలో లభిస్తుంది. కాబట్టి ఈ రాకెట్లను వినియోగించి శాటిలైట్లను ప్రయోగిస్తే, వాటికయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.

ఈ సెమి క్రయోజనిక్ ఇంజన్ గల రాకెట్ అందుబాటులోకి వస్తే ఇండియన్ ఇస్రో వివిధ రకాల స్థాయిల సంభందించిన శాటిలైట్ లాంచింగ్ వాహనాలను కలిగి ఉంటుంది. ఇప్పటికే జిఎస్ఎల్వి ఎమ్కె-3 రాకెట్లో సిఇ20 అనే ఇంజన్ను వినియోగిస్తున్నారు.

ఈ రాకెట్ల అన్ని కలయికలో ఒకటి, రెండు నుండి 10 టన్నుల వరకు బరువున్న శాటిలైట్లను ప్రయోగించే సామర్థ్యాన్ని ఇండియన్ ఇస్రో కలిగి ఉంటుందని, జిఎస్ఎల్వి ఎమ్కె-3 రాకెట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సోమనాథ్ ఇస్రోలో తెలిపాడు.

జిఎస్ఎల్వి ఎమ్కె-3 సుమారుగా 65 మీటర్లు పొడవు ఉంది.

జిఎస్ఎల్వి ఎమ్కె-3 రాకెట్ మొత్తం బరువు 732.6 టన్నులు ఉంటుంది. ఇది 10 టన్నుస వరకు శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది.

ప్రస్తుతం యూరప్కు చెందిన స్పేస్ ఏజన్సీ సంస్థలు అంతరిక్షంలోకి నాలుగు టన్నుల బరువున్న శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతున్నారు. అయితే వీరికంటే ముందుగా ఇస్రో ఇలాంటి బరువున్న శాటిలైట్లను విజయవంతంగా ప్రయోగించింది.

ఇండియన్ ఇస్రో దాటికి బెంబేలెత్తుతున్న విదేశీ రాకెట్ లాంచింగ్ సంస్థలు: సమగ్ర వివరాలు


Click it and Unblock the Notifications








