లాక్డౌన్లో ఇల్లు చేరడం చాలా సింపుల్ : ఇలా చేయండి
భారతదేశంలో కరోనా మహమ్మారి అధికంగా వ్యాపిస్తున్న కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలుచేయబడింది. లాక్ డౌన్ భారతదేశంలో మొదట మర్చి 23 నుంచి 21 రోజులు ప్రకటించారు, కానీ కరోనా కట్టడి కాకపోవడం వల్ల రెండవ దశ లాక్ డౌన్ మే 03 వరకు ప్రకటించారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తగా కరోనా దశ లాక్ డౌన్ మూడవ దశలోకి అడుగుపెట్టింది. ఈ మూడవ దశ లాక్ డౌన్ లో కేంద్ర ప్రభుత్వం కొన్ని మినహాయిములను కలిగించింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

ఈ రోజు నుండి కేంద్ర ప్రభుత్వం సడలింపులను ప్రకటించింది, ఇది వ్యక్తిగత వాహనాలను అనవసర సేవలకు కూడా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది.

కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి దేశంలో రాష్ట్రాలను మూడు జోన్లుగా విభజించడం జరిగింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ జోన్లను విభజించి కూని సడలింపులు కూడా కల్పించింది. అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు గ్రీన్, ఆరంజ్ మరియు రెడ్ జోన్లను ప్రకటించింది.

గ్రీన్ జోన్లలో ప్రజారవాణా మరియు బస్సుల రవాణాకు అనుమతి లభించింది. అంతే కాకుండా నిత్యావసర సదుపాయాలకు కూడా సమయం కేటాయించింది. ఆరంజ్ జోన్లలో నివసించే వారికి మరియు రెడ్ జోన్లలో నివసించే వారికి ఈ రోజు నుంచి కొన్ని సదుపాయాలను కల్పించింది. అంటే ఆ ప్రాంతాలలో వ్యక్తిగత వాహనాలు ఉపయోగించుకోవచ్చు. అంతే తాకకుండా అత్యవసర సమయాల్లో క్యాబ్ వంటి వాటిని కూడా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది.

ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఈ మొత్తం మూడు జోన్లలో వ్యక్తిగత 4 వీలర్లను ఉపయోగిస్తున్నప్పుడు, డ్రైవర్ కాకుండా గరిష్టంగా 2 అదనపు ప్రయాణీకులను అనుమతిస్తారు. 2 వీలర్లపై ఒకటికి మాత్రమే వెళ్లే అవకాశం కల్పించబడింది. రెడ్ జోన్లలో ఎలాంటి ప్రజా రవాణా అయినా బస్సులు వంటి వాటికి అనుమతించబడదు.

గ్రీన్ జోన్లలో, బస్సులు కూడా 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడపడానికి అనుమతించబడ్డాయి మరియు బస్ డిపోలు 50 శాతం సామర్థ్యంతో పనిచేయనున్నాయి.

ఈ మూడు జోన్లలో అనవసర కార్యకలాపాల కోసం ఉద్యమం ప్రతిరోజూ ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతించబడుతుంది. మరియు మిగిలిన సమయాలకు కర్ఫ్యూ పాస్ తప్పని సరిగా అవసరం. సామాజిక దూరాన్ని అన్ని సమయాల్లో ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలు తెలిపాయి.

65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అన్ని వేళలా బయటికి రాకూడదాహాని ఆంక్షలు విధించారు. అత్యవసర సమయాల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతిని పొంది పాస్ ను పొందాలి. దీనికి సంబంధించిన పాస్ లు ఆన్ లైన్ లో అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు దానిని ఉపయోగించుకోవాలి.


Click it and Unblock the Notifications








