Just In
- 9 min ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 13 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 17 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 19 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
Don't Miss
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Movies ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డ్రోన్ ద్వారా మెడికల్ డెలివరీకి శ్రీకారం.. ట్రయిల్ టెస్ట్ స్టార్ట్
భారతదేశం రోజురోజుకి అభివృద్ధి వైపు నడుస్తున్న క్రమంలో కొత్త వాహనాలు మార్కెట్లో అవతరిస్తున్నాయి. అంతే కాదు కొన్ని పద్ధతుల్లో కూడా కొత్త విధానాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే ఇటీవల మెడికల్స్ వంటి వాటిని అవసరమైన వారికి అందించడానికి, మెడికల్ డ్రోన్ ట్రయల్ ప్రారంభించబడింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి మెడికల్ డ్రోన్ డెలివరీ ట్రయల్.
ఈ సర్వీస్ బెంగళూరు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరిబిదానూర్ లో ప్రారంభమైంది. దీనిని బెంగళూరుకు చెందిన త్రాటిల్ ఏరోస్పేస్ సిస్టమ్స్ నేతృత్వంలో ఈ డ్రోన్ డెలివరీని పరీక్షిస్తోంది. ఈ పరీక్షను సివిల్ ఏవియేషన్ ఏజెన్సీ (డిజిసిఎ) మార్చి 2020 లో ఆమోదించింది.
అయితే ప్రస్తుతం దేశంలో అధికంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏజెన్సీ నుండి అనుమతి పొందడంలో ఆలస్యం జరిగింది. ఈ డెలివరీ డ్రోన్ రాబోయే 30 నుంచి 45 రోజులు పరీక్షించబడుతుంది. ఈ పరీక్ష బెంగళూరులోని 80 కిలోమీటర్లలో 30 నుంచి 45 రోజులు డ్రోన్ ద్వారా వైద్య పరికరాలు మరియు అవసరమైన మందులను పంపిణీ చేస్తుంది.
ఈ ట్రైయల్ టెస్ట్ ఈ డ్రోన్ లో ఏదైనా టెక్నీకల్ ప్రాబ్లమ్ మరియు డెలివరీలో ఏదైనా సమస్యను గుర్తించడానికి నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రయోగంలో రెండు రకాల డ్రోన్లను ఉపయోగిస్తారు. ఇందులో ఒకటి దాని పేలోడ్ సామర్థ్యం 1 కిలోలు ఉండేది, మరోకటి దాని పే లోడ్ సామర్త్యం 2 కిలోలు వరకు ఉండెది.
ఈ డ్రోన్ల డెలివరీకు సాఫ్ట్వేర్ రాన్ డింట్ మద్దతు ఇస్తుంది. భారతదేశంలో విస్తృత ప్రాంతంలో రవాణా చేయడానికి వీలుగా డ్రోన్ అనుకూలించబడతాయి. ఇది ఆపరేటర్లకు చాలా వరకు అనుకూలంగా కూడా ఉంటుంది. డ్రోన్ల బియాండ్ విజువల్ లైన్ సైట్ (బివిఎల్ఓఎస్) పైలట్ విమానాలను నిర్వహించడానికి యుఎఎస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం 20 యూనిట్లకు షరతులతో కూడిన మినహాయింపును మే నెలలోనే జారీ చేసింది.
కోవిడ్19 వ్యాక్సిన్ను మారుమూల ప్రాంతాలకు అందించడానికి డ్రోన్లను ఉపయోగించడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాన్పూర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) అధ్యయనం ప్రకారం, మానవరహిత వైమానిక వాహనాల కరోనా వ్యాక్సిన్లను మానవరహిత వైమానిక వాహనాలకు అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తరపున హెచ్ఎఎల్ ఇన్ఫ్రా టెక్ సర్వీసెస్ లిమిటెడ్ యుఎవిల నుండి వ్యాక్సిన్లు మరియు మందులను పంపిణీ చేయడానికి జూన్ 11 న ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఇఒఐ) ను ఆహ్వానించింది. భవిష్యత్ లో ఈ డ్రోన్ల సర్వీస్ మరింత ముమ్మరం కానుంది. ఇది చాలా వరకు అంటురోగాల భారీ నుంచి కూడా కాపాడుతుంది.
Note: Images are representative purpose only.