Just In
- 20 min ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- 3 hrs ago 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- 3 hrs ago ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 4 hrs ago బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
Don't Miss
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
సముద్ర వంతెన మీద అత్యంత సుందరమైన రన్వే నిర్మిస్తున్న భారత్
భారత ప్రభుత్వం సముద్ర వంతెన తొలి రన్వే నిర్మించడానికి సిద్దమైంది. లక్షద్వీప్ దీవుల్లోని అగత్తి ఐలాండ్లో ఉన్న అత్యంత సుందరమైన రన్వే స్థానంలో భారతదేశపు తొలి సముంద్ర వంతెన రన్వేను భారత విమానాశ్రయాల
భారత ప్రభుత్వం సముద్ర వంతెన తొలి రన్వే నిర్మించడానికి సిద్దమైంది. లక్షద్వీప్ దీవుల్లోని అగత్తి ఐలాండ్లో ఉన్న అత్యంత సుందరమైన రన్వే స్థానంలో భారతదేశపు తొలి సముద్ర వంతెన రన్వేను భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ నిర్మించనుంది.
భారత దేశపు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటయిన లక్షద్వీప్ దీవుల సముదాయంలోని అగత్తి ద్వీపఖండములో ఉన్న విమానాశ్రయంలో కాంక్రీట్తో విశాలమైన వంతెనను నిర్మించి దాని మీద రన్వే నిర్మించడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) అనుమతులు పొందింది.
Recommended Video
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తమ అగత్తి దీవిలో ఉన్న లక్షద్వీప్ రన్వే పొడగించాలనే నిర్ణయానికి సానుకూల అనుమతులు లభించాయి. AAI మేరకు, అగత్తి విమానాశ్రయానికి అనుకుని ఉన్న మరికొన్ని చిన్న చిన్న దీవులను కలుపుతూ సముద్రం మీద పెద్ద వంతెన నిర్మించనుంది.
భారీ విమానాలు రాకపోకలు సాగించడానికి, వివిధ రకాల విమానయాన సేవలతో పాటు ఇతర విమానాల పార్కింగ్ మరియు అత్యవసర సేవలకు ఉపయోగించుకునేలా పొడవాటి రన్వే ను ఈ వంతెన మీద నిర్మించనున్నారు.
పర్యావరణ సంబంధిత ఆందోళనల కారణంగా అక్కడున్న చిన్న చిన్న ద్వీపాలని కలిపేయాలని తీసుకున్న నిర్ణయాన్ని మార్చడం జరిగింది. అయితే, పర్యావరణానికి హాని కలగకుండా ద్వీపాల్లోని సముద్రం తీరంలో కాంక్రీట్ పిల్లర్లు నిర్మించి వాటి ఆధారంగా రన్ వే పొడవును కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారుగా రూ. 1,500 కోట్ల రుపాయలను కేంద్రం ఖర్చు చేయనుంది. ఈ రన్వే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటిఆర్-72 మరియు ఈ శ్రేణి విమానాలను మాత్రమే రన్వే మీద అనుమతించనున్నారు.
Trending On DriveSpark Telugu:
ఇండియాలో ఉన్న ఆరు అందమైన ఎయిర్పోర్ట్లు
ఇండియాలో అత్యంత పొడవైన రన్వేలు ఉన్న 10 విమానాశ్రయాలు
ఈ రన్వే మీద కేవలం ఎనిమిది పైలట్లు మాత్రమే విమానాలు ల్యాండింగ్ చేయగలరు
భారత్లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు
ఒక్కో విమానంలో 50 మంది ప్రయాణికులు ఒక్కో ప్రయాణికుడికి 15 కిలోల లగేజ్ మాత్రమే ఈ రన్వే అనుమతిస్తుంది. విమానల ల్యాండింగ్ మరియు టేకాఫ్ వంటి అంశాల భద్రత దృష్ట్యా AAI ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్తగా అభివృద్ది చేస్తున్న ఈ ఎయిర్పోర్ట్లో సరసమైన ఛార్జీలు మాత్రమే ఉండనున్నాయి. భారతదేశపు మొదటి సముద్ర వంతెన రన్వే గల విమానాశ్రయంగా అగత్తి ఎయిర్పోర్ట్ మొదటి స్థానంలో నిలవనుంది.
ముంబాయ్ మరియు కుల్లు ప్రాంతాల్లో ఉన్న జూహు ఎయిర్ పోర్ట్లో కూడా సముద్ర వంతెన మీద రన్వే నిర్మించాలని భావించినప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో లక్షద్వీప్ దీవుల్లోని అగత్తి విమానాశ్రయంలో సముద్ర వంతెన రన్వేను నిర్మించడానికి కేంద్రం సిద్దమైంది.
Picture credit: Lakshadweep NIC
Trending DriveSpark Telugu YouTube Videos
Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here