భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్
ఇటీవల కాలంలో లడఖ్ లోయలో గత కొద్ది రోజులుగా భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. లడఖ్ వ్యాలీ వంటి మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో, సైన్యం ప్రతి ఒక్కరిపైనా నిఘా ఉంచాలి.

అటువంటి ప్రదేశాలలో భారత సైనికులకు సరిహద్దు కాపలా అనేది ఒక సవాలు వంటిది. కార్గిల్ విజయ దివాస్ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఒక వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో భారత సైనికులు తూర్పు లడఖ్లోని కరాకోరం పాస్ వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్లను నడుపుతున్నారు.

కరాకోరం పాస్ చైనా మరియు భారతదేశ సరిహద్దులను వేరు చేస్తుంది. విజయ్ దివాస్ ప్రతి సంవత్సరం జూన్ 26 న జరుపుకుంటారు, 1999 కార్గిల్ యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకుంటారు. ఈ 2019 వీడియోలో కరాకోరం పాస్ యొక్క మంచుతో కూడిన రాతి దారుల వెంట భారత సైనికులు బైక్లు నడుపుతున్నట్లు మనం ఇక్కడ చూడవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా ర్యాలీని నిర్వహించాయి. ర్యాలీలో 6 మంది భారతీయ సైనికులు ఉన్నారు. ఈ బృందం వాస్తవ నియంత్రణ రేఖ పక్కన లే కౌర్ నుండి బయలుదేరి అనేక ప్రాంతాలను దాటి భారత సరిహద్దుల్లోని కరాకోరం చేరుకుంది.

ఈ ప్రదేశంలో-30 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నందున, బైక్ నడపడానికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కరాకోరం పాస్ యొక్క ఇరుకైన మార్గాల్లో ఎల్లప్పుడూ మంచు ఉంటుంది కాబట్టి, అది ఎక్కువ జారుతుంది. ఈ కారణంగా బైక్ నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరం.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ రాతి మరియు కఠినమైన రహదారులపై ప్రయాణించడానికి రూపొందించబడిన ఆఫ్-రోడింగ్ బైక్. ఈ బైక్ పర్వత, రాతి మరియు జారే రోడ్లపై ప్రయాణించవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్లో 411 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ బిఎస్ 6 ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 24.3 బిహెచ్పి శక్తి మరియు 32 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్లో 5-స్పీడ్ మెష్ గేర్బాక్స్ అమర్చారు.


Click it and Unblock the Notifications








