Just In
- 1 hr ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 2 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 3 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 4 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బ్రేకింగ్ న్యూస్; ఆటో ఎక్స్పో 2022 ఎడిషన్కు బ్రేక్.. కారణం ఇదే
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను ప్రభావితం చేసింది. ఈ మహమ్మారి వల్ల ఎంతో మంది మరణించారు. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలలో కూడా లోటు ఏర్పడింది. కరోనా వైరస్ యొక్క ఫస్ట్ వేవ్ మరియు సెకండ్ వేవ్ కారణంగా ఊహకు అందని నష్టాలు వాటిల్లాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రభావం మొదలైంది. ఇది ప్రజలపైన మునుపటికంటే కూడా ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా 2022 లో జరగనున్న ఆటో ఎక్స్పో కూడా వాయిదా పడింది. కోవిడ్-19 కారణంగా ఆసియాలో అతిపెద్ద ఆటో షోలలో ఒకటైన ఆటో ఎక్స్పో యొక్క 2022 ఎడిషన్ను వాయిదా వేస్తున్నట్లు భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ మరియు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం ప్రకటించింది.
ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా తీవ్రతను దృష్టిలో ఉచుకుని, గ్లోబల్ ఆటో షోల OICA క్యాలెండర్కి అనుగుణంగా, ఈ ఏడాది చివర్లో మోటార్ షో తదుపరి ఎడిషన్ యొక్క ఖచ్చితమైన తేదీని ప్రకటించనున్నట్లు 'సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్' ప్రకటించింది.
మోటార్ షో 2022 గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్లో 2022 ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు జరగాల్సి ఉంది. అయితే కరోనా నుంచి ఎగ్జిబిటర్లను, సందర్శకులను మరియు వాటాదారులందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని దీనిని వాయిదా వేయడం జరిగింది. ఇందులో అందరి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని సియామ్ తెలిపింది.
సాధారణంగా మోటార్ షో యొక్క ఆటో ఎక్స్పో అనేది రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్యక్రమం. 2020 లో జరిగిన మోటార్ షో చివరి ఎడిషన్ కూడా ఈ మహమ్మారి వ్యాప్తితో ప్రభావితమైంది. చాలా మంది ఆటో తయారీదారులు ఈవెంట్లో పాల్గొనలేకపోయారు.
అయితే తర్వాత జరిగే ఆటో షోలో పాల్గొనటానికి సన్నద్ధమయ్యారు. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభవం వల్ల అది కూడా కాస్త వాయిదా పడింది. ఇందులో చాలా బ్రాండ్లు తమ భవిష్యత్ కార్లు మరియు కాన్సెప్ట్ మోడళ్లను ప్రదర్శించడానికి ద్వైవార్షిక ఈవెంట్ని చూస్తున్నాయి.
ఇందులో ఫోక్స్వ్యాగన్ గ్రూప్, ఎంఎస్ఐఎల్, హ్యుందాయ్, కియా మోటార్స్ వంటి ఎన్నో కంపెనీలు తమ ముఖ్యమైన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించాల్సి ఉంది. అయితే వీటికి ప్రస్తుతం నిరాశ ఎదురైయింది. అయితే తరువాత ఈ ఆటో షో గురించి అధికారిక సమాచారం ఇప్పటికి అందుబాటులో లేదు. దీని గురించిన సమాచారం త్వరలో ప్రకటించబడుతుంది.
గత 2020 లో జరిగిన ఆటో షోలో అనేక కొత్త ఉత్పత్తులు ఆవిష్కరించబడ్డాయి. అయితే ఇక రాబోయే ఆటో ఎక్స్పో మరిన్ని కొత్త ఉత్పత్తులు అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే సియామ్ ప్రకటన తర్వాత దీనికి ఒక మార్గం ఏర్పడుతుంది.