Just In
- 21 min ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 1 hr ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- 2 hrs ago కూతురికి రూ.2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. ఫిదా చేస్తున్న వీడియో
- 2 hrs ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
Don't Miss
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇండియన్ డాక్టరుకి 100 వాహనాల్లో సెల్యూట్ చేసిన అమెరికా ప్రజలు, ఎందుకో తెలుసా..?
చైనాలో పుట్టిన కరోనా వైరస్ నేడు ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. ఈ వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే వేలాది మంది మరణించారు, మరియు లక్షలాది మంది వ్యాధి బారిన పడ్డారు మరియు ఆసుపత్రులలో ఉన్నారు. కరోనా నివారించడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చరియలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు సేవచేయడంలో డాక్టర్లు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నారు.
కరోనా భాదితులకు సేవ చేస్తున్న డాక్టర్లపై మన దేశంలో దాడులు చేస్తుంటే, అమెరికా మాత్రం భారతీయ డాక్టరుకి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. అమెరికాలో ఉన్న భారతీయ సంతతికి చెందిన డాక్టర్ ఉమా మధుసూధన్ కి అమెరికా ప్రజలు తమ కృతజ్ఞతను తెలుపుకున్నారు.
డాక్టర్ ఉమా మధుసూధన్ భారతీయ సంతతకి చెందిన మహిళ. మైసూర్కు చెందిన మరియు ఆమె స్వగ్రామంలో చదువుకుంది. భారతీయ సంతతికి చెందిన డాక్టర్ ఉమా మధుసూధన్ ఇప్పుడు అమెరికాలో ఒక సంచలనంగా మారింది.
అమెరికాలోని కరోనా బాధితులకు సేవచేయడం వల్ల ఈమెకి దాదాపు 100 కి పైగా కార్ల కాన్వాయ్ లు ప్రయాణిస్తూ తమని కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో మనం ఇక్కడ చూడవచ్చు.
MOST READ:అమ్మకాలలో హోండానే అధిగమించిన హీరో మోటోకార్ప్
అమెరికాలో డాక్టర్ ఉమా వైద్య రంగంలో చేసిన పనిని గౌరవించటానికి ఈ విధంగా చేశారు. ఆమె తన ఇంటి వెలుపల నిలబడి ఉంటుంది. అయితే అనేక ప్రైవేట్ కార్లు, పోలీసు కార్లు మరియు ఫైర్ ట్రక్కులు కూడా ఆమెను గౌరవించటానికి కవాతు చేస్తాయి. ఫైర్ ట్రక్కులు ఆమె కోసం సైరన్ మోగిస్తుండగా వాహనాలు కూడా హంకింగ్ అవుతున్నాయి. చాలా మంది కార్ల నుంచి దిగి "ధన్యవాదాలు" ప్లకార్డులను ఉంచుతున్నారు.
డాక్టర్ ఉమా అక్కడే నిలబడి గౌరవానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతుంది. డాక్టర్ ఉమా మధుసూధన్ అమెరికాలోని సౌత్ విండ్సర్ ఆసుపత్రిలో రోగులకు చికిత్స చేస్తున్నారు. ఆ రోగులకు చేసిన చికిత్స వల్ల ఆమెకి ప్రజలు కృతజ్ఞతలు తెలపడం మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.
MOST READ: ఈ మాడిఫైడ్ సుజుకి జిమ్నీ ఎస్యువి హార్స్ పవర్ ఎంతో తెలుసా..?
కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడానికి వారు చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్నారు. ఇది అంటువ్యాధి కలిగించే వైరస్ కాబట్టి వైద్యులకు మరియు ఆరోగ్య కార్యకర్తలకు కూడా సోకె ప్రమాదం ఉంది. కానీ అది ఏమాత్రం పట్టించుకోకుండా నిరంతరం రోగులకు సేవ చేస్తున్న డాక్టర్లు నిజంగా అభినందనీయులు.
కరోనా బాధితులకు సేవ చేయడం వల్ల కరోనా సోకి మరణించిన డాక్టర్లు కూడా చాలామందే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అధికారులు వైద్యులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలకు వారి భద్రతను నిర్ధారించడానికి పిపిఇ కిట్లను అందించడానికి కృషి చేస్తున్నారు. అయినప్పటికీ తగినంత కిట్లు అందుబాటులో లేవు, ఇది వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తలను ఈ భయంకర వైరస్ సోకడానికి కారణం అవుతోంది.
MOST READ:కలకత్తా ప్రజల కోసం వీధుల్లోకి వచ్చిన మమతా బెనర్జీ
భారతదేశంలో ప్రస్తుతం కరోనా నివారణలో భాగంగా లాక్ డౌన్ రెండవ దశ కొనసాగుతోంది. ఇందులో కొంతమందిఉకి మాత్రమే ఈ లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంది.ప్రజలు మాత్రం అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకి రాకూడదనే ఆంక్షలను కూడా విధించారు. ప్రస్తుత లాక్డౌన్ మే 3 న ఎత్తివేయబడుతుంది, అయితే పరిస్థితిని బట్టి ఇది పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి.