Just In
- 47 min ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- 1 hr ago టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- 3 hrs ago రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- 3 hrs ago జైలు నుంచి వచ్చాడు.. కోట్లు విలువ చేసే కారు కొన్నాడు - ఎవరో తెలుసా?
Don't Miss
- News AP Pre-Poll Survey: ఏపీ ఎన్నికల్లో జనం పల్స్ క్లియర్ ! ఎన్ని సీట్లో తెలుసా ? లేటెస్ట్ సర్వే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
చైనా-పాక్ దేశాలకు గట్టి షాకిచ్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైన్యంలో ఉన్న అడ్వాన్స్డ్ సుఖోయ్ ఎస్యు-30 ఎమ్కెఐ (SU-30MKI) యుద్ద విమానం గగన తలంలో ఉన్న చెనా చెంగ్డు జె-20 యుద్ద విమానాలు ఎంత దూరంలో ఉన్నా డేగ కన్నుతో కనిపెడుతుంది.
రాడార్ నిఘా వ్యవస్థ ఉన్న యుద్ద విమానాలను సాధారణంగా స్టెల్త్ యుద్ద విమానాలు అంటారు. ప్రస్తుతం ఐదవ తరానికి చెందిన యుద్ద విమానాలు ప్రపంచ ఎయిర్ ఫోర్స్లోకి ప్రవేశించాయి. ప్రపంచపు అత్యాధునిక యుద్ద విమానాలుగా పేరుగాంచిన ఐదవ తరానికి చెందిన స్టెల్త్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ద విమానాలు ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సైన్యంలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చైనా ఈ శక్తివంతమైన స్టెల్త్ ఫైటర్ విమానాలను తమ గగన తలం సైన్యంలోకి ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. చెంగ్డు-జె 20 స్టెల్త్ ఫైటర్ యుద్ద విమానాలను సైన్యంలోకి చేర్చినట్లు చైనా మీడియా ప్రపంచ దేశాలకు చాటింపు వేసింది.
చెంగ్డు-జె-20 యుద్ద విమానం చైనా పొరుగు దేశమైన ఇండియాకు భారీ ముప్పు పొంచి ఉందని తెలిపింది. ఏదేమైప్పటికీ, ఇండియా నాశనం కోరుకుంటున్న చైనా, దాని మిత్ర దేశం కూడా ఈ వార్త పట్ల సంతోషాన్ని వెలిబుచ్చింది. అయితే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీసుకున్న తాజా నిర్ణయంతో రెండు దేశాలు ఖంగుతిన్నాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైన్యంలో ఉన్న అడ్వాన్స్డ్ సుఖోయ్ ఎస్యు-30 ఎమ్కెఐ (SU-30MKI) యుద్ద విమానం గగన తలంలో ఉన్న చెనా చెంగ్డు జె-20 యుద్ద విమానాలు ఎంత దూరంలో ఉన్నా డేగ కన్నుతో కనిపెడుతుంది.
అంతే కాకుండా, భారత్-చైనా సరిహద్దు రేఖ వెంబడి సుఖోయ్ SU-30MKI యుద్ద విమానాలు గగన తల గస్తీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భారత్ భూబాగం మీద చక్కర్లు కొట్టిన చెంగ్డు జె-20 యుద్ద విమానాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తున్న జెగ్డు జె-220 యుద్ద విమానాలు టిబెట్ మీదుగా భారత సరిహద్దు ఉపరితలంలోకి వచ్చినట్లు ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ విభాగం వెల్లడించింది. అయితే, అత్యాధునిక రాడార్ డిటెక్షన్ సిస్టమ్ ఉన్న SU-30MKI పైటర్ జెట్ కొన్ని వందల కిలోమీటర్ల అవతలి వైపున్న జెంగ్డు జె-20 విమానాలను గుర్తించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఛీఫ్ మార్షల్ బీరేంద్ర సింగ్ చెప్పుకొచ్చాడు.
సుఖోయ్ SU-30MKI యుద్ద విమానం కేవలం శత్రు దేశానికి చెందిన జె-20 విమానాలను గుర్తించడమే కాకుండా, అవి ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాయి మరియు వాటి ఖచ్చితమైన సామర్థ్యాన్ని కూడా గుర్తిస్తుందని ఆయన వెల్లడించాడు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల సైన్యంలో ఉన్న అత్యంత శక్తివంతమైన SU-30MKI యుద్ధ విమానాల్లో అధునాతన రాడార్ పరికరాలను ఏర్పాటు చేసింది. దీంతో, చైనా చెంగ్డుజె-20 ఫైటర్ జెట్లను గుర్తించడమే కాకుండా వాటిని నిరంతరం పర్యవేక్షిస్తాయి.
అంతే కాకుండా, సుఖోయ్ SU-30MKI యుద్ద విమానాల్లో రష్యాకు చెందిన అడ్వాన్స్డ్ AESA టెక్నాలజీ గల రాడార్ సిస్టమ్ను కూడా అందిస్తోంది. ఇది ఏకకాలంలో 30 లక్ష్యాలను గుర్తించగలదు. అందులో ఒకేసారి ఆరు లక్ష్యాలను టార్గెట్ చేసుకుని దాడి చేయగలుగుతుంది.
జె-20 స్టెల్త్ ఫైటర్ జెట్ యుద్ద విమాలు ఉన్నాయని విర్రవీగిన చైనా ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద ఉన్న అత్యాధునిక రాడార్ వ్యవస్థతో ఆలోచనలో పడింది
విదేశీ యుద్ద విమాన నిపుణుల కథనం మేరకు, చైనా వద్ద ఉన్న చెంగ్డు జె-20 యుద్ద విమానం ఐదవ తరానికి చెందినది కాదని, నాలుగవ తరంలో కాస్త అడ్వాన్స్డ్ వెర్షన్ అని తెలిపారు. అమెరికా యుద్ద విమానాలతో పోల్చితే వీటి పరిధి కాస్త తక్కువే.
అంతే కాకుండా, చైనా చెంగ్డు జె-20 యుద్ద విమానాలు అమెరికా యొక్క ఐదవ తరానికి చెందిన ఎఫ్-22 రాప్టర్ మరియు ఎఫ్-35 లైటింగ్ II వంటి యుద్ద విమానాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిఫెన్స్ నిపుణులు పేర్కొన్నారు.
ఏదేమైనప్పటికీ, చైనా చెంగ్డు జె-20 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అంత శక్తవంతమైనదేమీ కాదని, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని యూరోపియన్ డిఫెన్స్ నిపుణులు తెలిపారు. వారి కథనం మేరకు, చెంగ్డు జె-20 ఫైటర్ జెట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క సుఖోయ్ SU-30MKI రాడార్ సిస్టమ్ నుండి తప్పించుకోవడం దాదాపు కష్టమే.
భారత్ను ఎదుర్కొనేందుకు చైనా జె-20 ఫైటర్ జెట్ స్టెల్త్ ఫైటర్ను ప్రవేశపెట్టినప్పటికీ, దాని ఆటలు ఇక మీదట సాగవు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీలోని సుఖోయ్ SU-30MKIలో ఉన్న అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్ అత్యంత ఖరీదైన మరియు అరుదైనది. గుర్తించడం, గుర్తించిన వెంటనే దాడిచేయగల సామర్థ్యం దీని సొంతం.
అదనంగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్తో పోల్చుకుంటే చైనా ఎయిర్ ఫోర్స్ బేస్ సముద్రం మట్టం నుండి చాలా ఎత్తులో ఉంది. ప్రత్యేకించి భారత్ సరిహద్దులో ఉన్న టిబెట్ తలాల్లో చైనా ఎయిర్ ఫోర్స్ బేస్లు ఎక్కువగా ఉన్నాయి. ఆయుధాలను లోడ్ చేయడం మరియు ఇంధనం నింపడం వంటివి చాలా కష్టతరంతో కూడుకున్నాయి.
డిఫెన్స్ పరిశ్రమ అనుభవజ్ఞుల కథనం మేరకు, ప్రస్తుతానికి చైనా యుద్ద విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమే. అడ్వాన్స్డ్ స్టెల్ట్ ఫైటర్ జెట్ ఉన్నాయని మొన్నటి వరకు విర్రవీగిన చైనా మరియు దాని మిత్ర దేశం పాకిస్తాన్లకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రవేశపెట్టిన తాజా టెక్నాలజీ వణుకుపుట్టిస్తోంది.