Just In
- 40 min ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 2 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 6 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 8 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
55 ఏళ్ల సేవ: ప్రపంచపు అతి పురాతణ యుద్ద విమాన వాహక నౌక విరాట్కు వీడ్కోలు
ఇండియన్ నేవీ 55 సంవత్సరాల వయస్సున్న ఐఎన్ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌకను సర్వీసు నుండి తప్పించి శాశ్వత విశ్రాంతిని కల్పించనుంది. అయితే ఇది ఇప్పుడు ఆంద్రప్రదేశ్ చెంతకు చేరింది.
ఐఎన్ఎస్
విరాట్
యుద్ద
విమాన
వాహక
నౌక.
సుమారుగా
55
సంవత్సరాల
పాటు
నౌకా
దళంలో
సేవలందించింది.
అందులో
27
ఏళ్ల
పాటు
రాయల్
నేవీ
(బ్రిటీష్
నౌకా
దళం)లో
సేవలందించింది.
ప్రపంచ
వ్యాప్తంగా
అత్యంత
పురాతణమైన
యుద్ద
విమాన
వాహక
నౌక
అయిన
ఐఎన్ఎస్
విరాట్కు
భారత
నౌకాదళం
కొచ్చి
నగరంలోని
ఓడరేవులో
సర్వీసు
నుండి
వీడ్కోలు
పలికింది.|
సుమారుగా ఐదున్నర దశాబ్దాల పాటు నిర్విరామంగా నౌకా దళానికి సేవలందించిన ఐఎన్ఎస్ విరాట్ యుద్ద నౌకను శాశ్వతంగా సర్వీసు నుండి తొలగించి విరామం కల్పించింది.
భారత నౌకా దళం దీనిని సర్వీస్ నుండి పూర్తిగా ఉపసంహరించి, 55 ఏళ్ల సేవలకు గాను నేవీ అధికారులు ఘణంగా వేడుకలు జరిపి ఐఎన్ఎస్ విరాట్కు వీడ్కోలు పలుకనున్నారు.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఐఎన్ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌకను చేజిక్కించుకోవడానికి అమితాసక్తితో ఉంది.
భారతీయ నౌకా దళం ఈ నౌకను సేవల నుండి తప్పించిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించనుంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ నగరంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయడం కోసం ఇలాంటి పురాతణ నౌకలు మరియు జలాంతర్గాములను సేకరిస్తోంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఐఎన్ఎస్ విరాట్ను కూడా ప్రజల సందర్శనకు ఉపయోగించనుంది.
యుద్ద విమానాలను మోసుకెళ్లే ప్రపంచపు అత్యంత పురాతణమైన నౌక ఈ ఐఎన్ఎస్ విరాట్ ఇప్పుడు ఇండియాలోని మన రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్) చెంతకు చేరింది.
1943 లో ఇంగ్లాండ్ ప్రభుత్వం విక్కర్స్ ఆర్మ్స్ట్రాంగ్ అనే నౌకల తయారీ సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. 1953 ఫిబ్రవరి 16న ఆ దేశం విడుదల చేసింది.
1959 నవంబర్ 25 నుండి రాయల్ నౌకాధళంలో సేవలు ప్రారంభించింది. ఆ తరువాత 1987 ఏడాది వరకు నిర్విరామంగా రాయల్ నేవీలో విసృత సేవలు అందించింది.
1982 నుండి 1985 మధ్య ఫాల్యాండ్ దీవుల్లో జరిగిన ఉద్యమాల్లో ఈ నౌక కీలక పాత్ర పోషించింది.
రాయల్ నేవీ ఈ యుద్ద నౌకను తమ నౌకా దళం నుండి 1987లో తొలగించింది. తరువాత 1987 మే నెలలో భారత ప్రభుత్వం ఈ ఐఎన్ఎస్ విరాట్ ను కొనుగోలు చేసింది.
సుమారుగా 28 ఏళ్ల పాటు భారత నౌకా దళంలో సేవలందించిన విరాట్ ను ఫిబ్రవరి 2015 న ముంబాయ్ నుండి కొచ్చి రేవుకు చేరుకుంది. అయితే అప్పటికే విధులు సరిగా నిర్వర్తించలేక సర్వీసు నుండి విరమణకు సిద్దమయ్యింది.
ఏట్టకేలకు భారత నౌకా దళం దీనిని సర్వీసు నుండి తొలగించి నౌకాధళ కేంద్ర ముంబాయ్కు చేర్చింది. ఇప్పుడు వినియోగంలో లేని ఈ నౌకను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేజిక్కించుకోనుంది.
ఐఎన్ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక భారత సముద్ర తీరంలో నిరంతర గస్తీ కోసం విశేష సేవలందించింది. నౌకాధళ విమానాలను తనతో పాటు తీసుకెళ్లి తీరం చుట్టూ గస్తీ నిర్వహించేది.
ఈ ఐన్ఎస్ విరాట్ విమాన వాహన నౌక సుమారుగా 28,700 టన్నుల బరువును మోయగలదు.
దీని పొడవు 226.5 మీటర్లు (743అడుగులు), వెడల్పు 48.78 మీటర్లు (160 అడుగులు) మరియు ఎత్తు నీట మట్టం నుండి 8.8 మీటర్లు (29 అడుగులు)గా ఉంటుంది.
ఐఎన్ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక యొక్క గరిష్ట వేగం గంటకు 52 కిలోమీటర్లు (28 నాటికల్స్)గా ఉంది. దీని పరిధి గంటకు 26 కిలోమీటర్ల వేగంతో నిరంతరంగా 10,500 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
ఇందులో గరిష్టంగా 2,100 మంది వరకు ప్రయాణించవచ్చు. నౌకకు సంభందించి 1,207 మంది మరియు యుద్ద విమానాలకు సంభందించి 143 మంది విధుల్లో ఉండేవారు.
ఐఎన్ఎస్ విరాట్ నౌక ద్వారా గరిష్టంగా 26 వరకు యుద్ద విమానాలను మోసుకెళ్లవచ్చు.
సాంకేతికంగా ఇందులో నాలుగు స్టీమ్ బాయిలర్ టర్బైన్స్ కలవు. ఇవి సుమారుగా 400పిఎస్ఐ సామర్థ్యంతో 57,000 కిలోవాట్ పవర్ ఉత్పత్తి చేయును.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దీనిని వైజాగ్లో మ్యూజియంలా ఎర్పాటు చేయడానికి భారత నౌకా ధళం నుండి కొనుగోలు చేయడానికి 20 కోట్ల రుపాయలు వెచ్చించారు.
- భారత్ కు పొంచి ఉన్న ముప్పు....!!
- సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!
- 102 ఏళ్ల తరువాత విస్తరించబడిన పనామా కెనాల్ చరిత్ర