ప్రధాని వద్ద కేవలం మారుతి 800 కారు మాత్రమే ఉందట!

ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ శాఖల మంత్రులు చివరకు మనదేశ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా తమ తమ ఆస్తుల వివరాలను ప్రజలకు వెల్లడించారు. మరి మన్మోహన్ ప్రధానమంత్రి కదా ఆయన వద్ద కొన్ని కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయనుకుంటే మనం కారులో కాలేసినట్లే. ప్రస్తుతం ఆయన వద్ద ఒకే ఒక్క కారు ఉంది. అది కూడా 1996వ సంవత్సరానికి చెందిన 'మారుతి 800' కారు.
ప్రధానమంత్రి వెల్లడించిన ఆస్తుల వివరాల ప్రకారం ఆయన వద్ద ఉన్న కారు ఇదేనట. ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఈ కారు విలువ సుమారు రూ.27,500 లకు వరకూ ధర పలకవచ్చు. అయితే, ఇదే కారును వేలంలో విక్రయించినట్లయితే, మన్మోహన్ సింగ్ ఉపయోగించిన కారు కాబట్టి లక్షల్లో ధర పలికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా.. ఆయనకు ప్రభుత్వం కేటాయించిన ఓ బుల్లెట్ ప్రూఫ్ బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్ కారు కూడా ఉంది.
ప్రధాని నగర సంచారానికి బయలుదేరినప్పుడు ముందు వెనుక పెద్ద పెద్ద ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనా)లు ఈ బిఎమ్డబ్ల్యూ కారును అనుసరిస్తూ ఉంటాయి. ఒకవేళ ప్రధానిగా మన్మోహన్ సింగ్ తప్పుకున్నట్లుయితే, ఆయన ఈ కారును తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ వెల్లడించిన ఆస్తుల వివరాల ప్రకారం ఆయన మొత్తం సంపద విలువ కేవలం రూ.5.10 కోట్లు మాత్రమేనట.


Click it and Unblock the Notifications








