భారత దేశపు అతి వేగవంతమైన రైలు ఏప్రిల్ 5 నుండి పరుగులు పెట్టనుంది

By Anil

గత ఏడాది ప్రధాన మంత్రి మోడీ అభీష్టం మేరకు కేంద్ర రేల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు భారత దేశపు అతి వేగవంతమైన రైలును అవిష్కరించడానికి పచ్చ జెండా ఊపాడు. గటిమన్ పేరుతో పిలువబడే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఏప్రిల్ 5 నుండి ఇండియన్ రైల్వే వారి పట్టాల మీద పరుగులు పెట్టనుంది.

గటిమన్ ఎక్స్‌ప్రెస్ (అత్యంత వేగవంతమైన) రైలు గురించి మరిన్నివివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఆగ్రా - ఢిల్లీ

ఆగ్రా - ఢిల్లీ

ఢిల్లీ నుండి ఆగ్రా మధ్య దాదాపుగా 195 కిలోమీటర్లు పాటు ఇది సేవలు అందించనుంది. భారత దేశపు అత్యంత వేగవంతమైన రైలుగా పిలువబడే ఇది ముఖ్యంగా ఢిల్లీ మరియు ఆగ్రాల మధ్య ప్రయాణించనుంది.

ప్రయాణ దూరం

ప్రయాణ దూరం

సాధారణ ప్యాసింజర్ రైళ్లో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం సుమారుగా ఎనిమిది గంటలుగా ఉంది. అయితే ఈ గటిమన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కేవలం గంటా నలభై నిమిషాల్లో 195 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించవచ్చు.

 నిజామొద్దీన్ రైల్వే స్టేషన్ కేంద్రంగా

నిజామొద్దీన్ రైల్వే స్టేషన్ కేంద్రంగా

భారత దేశపు అతి వేగవంతమైన రైలుని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు డిల్లీలోని నిజామొద్దీన్ రైల్వే స్టేషన్ కేంద్రంగా ప్రారంభించనున్నారు.

ప్రారంభ సమయం

ప్రారంభ సమయం

ఈ రైలును ఏప్రిల్ 5, 2016 ఉదయం 10 గంటలకు ఢిల్లీలో సర్వీసును ప్రారంభించబడును.

గరిష్ట వేగం

గరిష్ట వేగం

దీనిని 10 గంటలకు ఢిల్లీలో ప్రారంభించగా ఆగ్రాకు 11 గంటల 40 నిమిషాలకు చేరుకుంటుంది. దీని వేగం గంటకు 160 కిలోమీటర్లుగా ఉంది. 100 నిమిషాల్లో ఇది 200 కిలోమీటర్ల దూరాన్ని చేధిస్తుంది.

టికెట్ ధరలు

టికెట్ ధరలు

ఢిల్లీ నుండి ఆగ్రా మధ్య గటిమన్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏ/సి శ్రేణిలో ప్రయాణ ధర రూ. 690 లు మరియు ఎక్సిక్యూటివ్ శ్రేణిలో ప్రయాణ ధర రూ. 1,365 లుగా ఉన్నాయి.

శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ ధరలు

శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ ధరలు

ఢిల్లీ నుండి ఎక్స్‌ప్రెస్ మధ్య శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలులో ఏ/సి శ్రేణి ధర రూ. 540 మరియు ఎక్సిక్యూటివ్ శ్రేణి ధర రూ. 1,010 లుగా ఉంది.

ప్యాసింజర్

ప్యాసింజర్

ఢిల్లీ మరియు ఆగ్రా మధ్య ప్యాసింజర్ రైలు ప్రయాణం సుమారుగా 7 గంటల 34 నిమిషాలు పడుతుంది. మరియు రెండు గంటలు నెమ్మదిగా దీని ప్రయాణం సాగుతుంది. ఇందులో ఢిల్లీ - ఆగ్రా మధ్య టికెట్ ధర రూ. 45 రుపాయలుగా ఉంది.

స్టేషన్లు

స్టేషన్లు

ఢిల్లీ మరియు ఆగ్రాల మధ్య దాదాపుగా 27 స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలు ఈ రెండింటి మధ్య గంటకు 25 కిలోమీటర్లు వేగంతో పరుగులు పెడుతుంది. అయితే గటిమన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ రెండింటి మధ్య నాన్ స్టాప్‌గా వెలుతుంది.

ప్రారంభం

ప్రారంభం

ఏప్రిల్ 5, 2016 న ప్రారంభమగు గటిమన్ ఎక్స్‌ప్రెస్ గురించి పూర్తి వివరాలు ప్రారంభం తరువాత తెలుగు డ్రైవ్‌స్పార్క్‌లో ప్రచురించబడును. మరిన్ని వివరాలకు తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

ఇండియన్ రైల్వే గురించి ఆసక్తికరమైన విషయాలు

భారతీయులకు ఆటోమొబైల్స్ కన్నా ముందుగా రైలు బండి పరిచయం జరిగింది. దాదాపుగా 170 సంవత్సరాల క్రితం తెల్ల దొరలు ప్రారంభించిన రైలు వ్యవస్థ, విధ్యుత్ తీగ దేశం మొత్తం పాకినట్లు రైలు పట్టాలు దేశం మొత్తం పరుచుకున్నాయి. వారి పరిజ్ఞానంతో మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రజలు మెప్పులు పొందుతున్న ఏకైక రవాణా రంగం ఇండియన్ రైల్వే: 170 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియన్ రైల్వే గురించి ఆసక్తికరమైన విషయాలు తరువాత స్లైడర్ల ద్వారా తెలుసుకుందాం రండి.

1. అత్యంత వేగవంతమైన రైలు

1. అత్యంత వేగవంతమైన రైలు

ప్రస్తుతం న్యూ ఢిల్లీ-భోపాల్ మధ్య పరుగులు పెడుతున్న శతాబ్ధి ఎక్స్ ప్రెస్ అత్యంత వేగవంతమైన రైలు. అత్యధిక వేగం గంటకు 150 కిలోమీటర్లు

Picture credit: Bahnfrend/Wiki Commons

2. నెమ్మదిగా నడిచే రైలు

2. నెమ్మదిగా నడిచే రైలు

ఇది ఊటీ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 10 కిలోమీటర్లు. అంటే అత్యంత వేగంగా పరుగులు పెట్టే శతాబ్ధి రైలు వేగంలో 15 వ వంతు అన్నమాట. తక్కువ వేగంతో ప్రయాణించే మెటుపాళ్యం ఊటి నిలగిరి ప్యాసింజర్ రైలు ఇంత తక్కువ వేగంగా ఎందుకు ప్రయాణిస్తుందో తెలుసా ఎపుడు కొండప్రాంతాల్లో నడవాల్సి ఉండటం వలన దీనికి ఈ స్పీడ్ లిమిట్‌ను పెట్టారు.

Picture credit: Gcheruvath/Wiki Commons

3. ఎక్కువ దూరం పరుగులు పెట్టే రైలు

3. ఎక్కువ దూరం పరుగులు పెట్టే రైలు

దేశ వ్యాప్తంగా గల రైలు బండ్లలో ఎక్కువ దూరం పరుగులు పెట్టే రైలు ఉంది తెలుసా ? ఇది డిబ్రూఘర్ మరియు నాగ్‌పూర్ మద్య గల 4273 కిలోమీటర్ల దూరాన్ని చేధించే వివేక్ ఎక్స్ ప్రెస్ దీనికి బాగా పేరు గాంచింది. దూరం మరియు సమయం పరంగా చూసిన కూడా ఇదే ముందు స్థానంలో ఉంది.

Picture credit: kochigallan

4. అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు

4. అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు

ఎక్కువ దూరం ప్రయాణించే అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు బండి కూడా ఇండియన్ రైల్వేలో కలదు. కేవలం మూడు కిలోమీటర్లు దూరం మాత్రమే గల నాగ్‌పూర్-అజ్‌ని స్టేషన్ల మధ్య ఈ రైలు తిరిగుతుంది. ఇంత తక్కువ దూరం సేవలు అందించడానికి గల కారణం నాగ్‌పూర్ నుండి అజ్‌ని పారిశ్రామిక వాడకు కార్మికులను చేరవేయడానికట.

Picture credit: YouTube

5. నాన్‌-స్టాప్‌గా పరుగులు పెట్టే పొడవైన రైలు మార్గం

5. నాన్‌-స్టాప్‌గా పరుగులు పెట్టే పొడవైన రైలు మార్గం

అత్యంత పొడవైన రైలు మార్గం ఉన్నప్పటికీ నాన్ స్టాప్‌గా ఎక్కువ దూరం నడిచే రైలు కూడా ఉంది. త్రివేండ్ర-హజరత్ నిజామొద్దీన్ మధ్య పరుగులు పెట్టే రాజధాని ఎక్స్ ప్రెస్ దాదాపుగా 528 కిలోమీటర్ల పాటు వడోదర నుండి కోట వరకు నాన్‌-స్టాప్‌గా పరుగులు పెడుతుంది.

Picture credit: V Malik/Wiki Commons

6. అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ పేరు

6. అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ పేరు

ఇండియన్ రైల్వేలో అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ పేరు గల స్టేషన్ ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూర్ జిల్లాలో గల రేణిగుంట సమీపంలో ఉంది. దీని పేరు వెంకట నరసింహరాజు వారి పేట రైల్వే స్టేషన్. ఇది రేణిగుంట-అరక్కోణం మద్య కలదు.

Picture credit: topworldfact

7.అతి చిన్న పేరు గల రైల్వేస్టేషన్

7.అతి చిన్న పేరు గల రైల్వేస్టేషన్

పొడవైన పేరు గల రైల్వే స్టేషన్ లాగే పొట్టి పేర్లున్న రైల్వే స్టేషన్‌లు కుడా ఇండియన్ రైల్వే‌లో ఉన్నాయి. అందులో ఒడిస్సా లోని ఐబి మరియు గుజరాత్‌లోని ఓడి స్టేషన్లు కలవు.

Picture credit: storyglitz

8. ఎక్కువ స్టాపులు గల రైళ్లు

8. ఎక్కువ స్టాపులు గల రైళ్లు

భారతీయ రైల్వేలో ఎక్కుల స్టాపులు గల రైలు ఎక్స్‌ప్రెస్/మెయిల్ ట్రైన్ ఇది హౌరా-అమృత్‌సర్‌ల మధ్య పరుగు పెడుతుంది. దీనికి దాదాపుగా 115 స్టాపులు కలవు.

Picture credit: Smeet Chowdhury/Wiki Commons

9. ప్రతి సారి ఎంతో సమయం లేటుగా వచ్చే రైలు

9. ప్రతి సారి ఎంతో సమయం లేటుగా వచ్చే రైలు

రైళ్లు లేటుగా రావడం సర్వసాధారణం కాని 10 నుండి 12 గంటల పాటు లేటుగా రావడం అనే సాధారణ విషయం కాదు. గౌహతి-త్రివేడ్రం మధ్య పరుగులు తీసే రైలు ఒక ట్రిప్ సమయం 65 గంటల 5 నిమిషాలు అయితే ఇది ప్రతి సారి 10 నుండి 12 గంటల పాటు లేటుగా వస్తుంది. భారతీయ రైల్వేలో ఇంత సమయం పాటు లేటుగా వచ్చే రైలు ఇదేనట.

Picture credit: indiarailinfo

10. ఒకే ఊరిలో రెండు రైల్వే స్టేషన్లు

10. ఒకే ఊరిలో రెండు రైల్వే స్టేషన్లు

ఒక్క రైల్వే స్టేషన్‌ కూడా లేని ఊర్లు కోకొల్లలుగా ఉంటే ఈ ఊరికి మాత్రం రెండు రైల్వే స్టేషన్లు కావాలంట. ఇలాంటి రైల్వే స్టేషన్ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో గల శ్రీరామ్ పూర్ మరియు బెలాపూర్ రైల్వే స్టేషన్లు. ఒకే ట్రాక్‌‌కు ఒక వైపు శ్రీరామ్ పూర్ రైల్వే స్టేషన్ ట్రాక్‌కు మరో వైపు బెల్లా పూర్ స్టేషన్‌కలదు.

Picture credit: railyatri

11. అత్యంత శక్తివంతమైన రైలు

11. అత్యంత శక్తివంతమైన రైలు

ఇండియన్ రైల్వే‌లో గల అత్యంత శక్తివంతమైన రైళ్లలో WAG-9 అనే ఎలక్ట్రిక్ రైలు అత్యంత శక్తివంతమైనది. ఇది దాదాపుగా 6,350 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Picture credit: Adityamadhav83/Wiki Commons

12.నాలుగు దిక్కులలో చివరగా ఉన్న రైల్వే స్టేషన్లు

12.నాలుగు దిక్కులలో చివరగా ఉన్న రైల్వే స్టేషన్లు

దేశానికి గల నాలుగు దిక్కులలో ఉన్న చివరి రైల్వే స్టేషన్లు

ఉత్తరం: బరముల్లా స్టేషన్ జమ్ము అండ్ కాశ్మీర్‌లో కలదు

దక్షిణం: కన్యాకుమారి తమిళనాడులో కలదు

పడమర: గుజరాత్‌లోని నాలియా రైల్వే స్టేషన్

తూర్పు: అస్సాం లోని టిన్సుకియా మార్గంలో గల లెడో స్టేషన్

Picture credit: indiarailinfo

13. ఎక్కువ మార్గాలను నడుపుతు జంక్షన్

13. ఎక్కువ మార్గాలను నడుపుతు జంక్షన్

మతురా జంక్షన్, ఇది ఏడు మార్గాలను పర్యవేక్షిస్తు ఉంది. ఆగ్రా కంట్ బ్రాడ్ గేజ, బ్రాడ్ గేజ్ మార్గం గల భరత్ ‌పూర్, బ్రాడ్ గేజ్ లైన్ గల అల్వార్, బ్రాడ్ గేజ్ మార్గం గల ఢిల్లీ, మీటర్ గేజ్ గల అచ్‌నెరా, మీటర్ గేజ్ మార్గం గల విృందావన్ మరియు మీటర్ గేజ్ మార్గం గల హత్రాస్, కాస్‌గంజ్ మార్గాలు.

Picture credit: Superfast1111/Wiki Commons

14. ఎక్కువ సమాంతర పట్టాలు గల రూట్

14. ఎక్కువ సమాంతర పట్టాలు గల రూట్

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు పట్టాలు సమాతరంగా అది కూడా పది కిలోమీటర్లు పాటు కలవు. ఇది బాంద్రా-ఆంధేరిల మధ్య కలదు.

Picture credit: Superfast1111/Wiki Commons

15. రద్దీ రైల్వే స్టేషన్

15. రద్దీ రైల్వే స్టేషన్

దేశ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ లక్నో, రోజుకు 64 రైళ్లు వస్తుపోతుంటాయి.

Picture credit: Mohit/Wiki Commons

16. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైవ రైల్వే ప్లాట్‌ఫామ్

16. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైవ రైల్వే ప్లాట్‌ఫామ్

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రైల్వే ఫ్లాట్ ఫామ్ఉత్తరల ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో కలదు. దీని పొడవు 1,366.33 మీటర్లు పొడవు కలదు.

Picture credit: Benison P Baby/Wiki Commons

17. పురాతణమైన రైలు బండి

17. పురాతణమైన రైలు బండి

ప్రస్తుతం భారతీయ రైల్వే నడుపుతున్న రైళ్లలో అత్యంత పురాతణమైన రైలు ఫెయిరి క్వీన్. దీనిని 1855 లో తయారు చేశారు. అంతే కాకుండా అత్యంత పురాతణమైన ఆవిరి ఇంజన్ ఇంతవరకు సేవలు అందిస్తున్నందుకు దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు కల్పించారు.

Picture credit: Arup1981/Wiki Commons

18. మొదటి రైలు రోడ్డు

18. మొదటి రైలు రోడ్డు

దేశీయంగా మొదటి రైలు రోడ్డును నిర్మించింది ఎవరో తెలుసా, బ్రటీషు వారు ఏమాత్రం కాదు. ఇద్దరు భారతీయులు కలసి మొదటి రైలు రోడ్డును నిర్మించారు. వారు జంషెట్జీ జీజీభోయ్ మరియు జగన్నాథ్ షంకర్‌సేత్ లు

Picture credit: rediff/Wiki Commons

19. కార్మిక బలం

19. కార్మిక బలం

ఇండియన్ రైల్వే అత్యంత శక్తివంతమై అతి పెద్ద కార్మిక వ్యవస్థను కలగి ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిదవ స్థానంలో ఉన్నఅతి పెద్ద కార్మిక వ్యవస్థ. ప్రస్తుతం దాదాపుగా 1.4 మిలియన్ వరకు కార్మికులు ఇండియన్ రైల్వేలో సేవలు అందిస్తున్నారు.

20. భారతీయ రైల్వే విస్తీర్ణం

20. భారతీయ రైల్వే విస్తీర్ణం

ఇండియన్ రైల్వే 64,000 కిలోమీటర్లు పొడవైన రైల్వే వ్యవస్థను కలిగి ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద రైల్వే వ్యవస్థలలో నాలుగవ స్థానంలో ఉంది. వరుసగా యుఎస్, రష్యా, చైనాలు ఉన్నాయి.

Picture credit: mapsofindia

 21. చివరి ఆవిరి రైలింజన్లు

21. చివరి ఆవిరి రైలింజన్లు

ఇండియన్ రైల్వే ఆవిరితో రైలింజన్లను తయారు చేయడం 1972 నుండి నిలిపివేసింది.

Picture credit: Wiki Commons

22. భారతీయ రైళ్లు రోజు పరుగులు పెడుతున్న దూరం

22. భారతీయ రైళ్లు రోజు పరుగులు పెడుతున్న దూరం

ఇండియన్ రైల్వేలో గల దాదాపు 14,300 రైళ్లు దేశ వ్యాప్తంగా భూమికి చంద్రునికి మద్య గల దూరానికి మూడున్నర రెట్లు దూరం పరుగులు పెడుతున్నాయి.

23. మరుగుదొడ్లు

23. మరుగుదొడ్లు

మొదటిసారిగా 1891 లో మొదటి శ్రేణి రైళ్లలో తరువాత 1907 నుండి తక్కువ శ్రేణి రైళ్లలో మరుగుదొడ్లను ప్రారంభించడం జరిగింది.

24.ఎయిర్ కండీషనింగ్

24.ఎయిర్ కండీషనింగ్

మొదటి సారిగా 1874లో మొదటి శ్రేణి రైళ్లలో ఎ/సి ను ప్రారంభించారు. అప్పట్లో భారత్‌లో గల రైల్వేను గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే అనేవారు.

Picture credit: RegentsPark/Wiki Commons

25.పొడవైన సొరంగ మార్గం

25.పొడవైన సొరంగ మార్గం

ఇండియన్ రైల్వేలో గల అత్యంత పొడవైన సొరంగ మార్గం పిర్ పంజల్ సొరంగ మార్గం. దీని పొడవు 11.245 కిలోమీటర్లుగా ఉంది. దీని నిర్మాణం జమ్మూ కాశ్మీర్‌లో 2012 డిసెంబర్‌లో పూర్తి అయ్యింది.

Picture credit: Owais khursheed/Wiki Commons

26. భూ గర్భ రైల్వే

26. భూ గర్భ రైల్వే

మొదటి భూగర్భ రైల్వేను కలకత్తా మెట్రోలో ప్రారంభించారు.

Picture credit: WillaMissionary/Wiki Commons

27. కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్

27. కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్

కంప్యూటర్ రిజర్వేషన్‌ను చేయడం మొదటి సారిగా ఇండిన్ రైల్వే 1986 లో ఢిల్లీలో ప్రారంభించారు.

Picture credit: indianrailinfoblog.blogspot

28. విధ్యుత్ రైళ్లు

28. విధ్యుత్ రైళ్లు

ఇండియన్ రైల్వేలోకి మొదటి సారిగా 1925 ఫిబ్రవరి మూడున ఎలక్ట్రిక్ రైళ్లు ప్రవేశించాయి. మొదటి రైలు బొంబాయి విటి మరియు కుర్లా స్టేషన్ల మధ్య సేవలు ప్రారంభించింది.

Picture credit: Shan.H.Fernandes/Wiki Commons

29. చక్రాల మీద ఇంద్ర భవనం

29. చక్రాల మీద ఇంద్ర భవనం

ఇండియన్ రైల్వే 1982 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సంధర్బంగా ప్యాలెస్‌ను తలపించే ఇంధ్ర భవనంలాంటి లగ్జరీ రైలును ప్రారంభించింది.

30. అతి ఘోరమైన రైలు ప్రమాదం

30. అతి ఘోరమైన రైలు ప్రమాదం

1981 జూన్ 6 న జరిగిన రైలు ప్రమాదం ఇండియన్ రైల్వేలో అత్యంత ఘోరమైనది. దాదాపుగా 80 మంది ప్రయాణికులతో మన్సి మరియు సహారా రూట్ మద్య ప్రయాణిస్తున్నప్పుడు బాగమతి నది వంతెన మీద ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో దాదాపుగా 500 మంది వరకు మృతి చెందినట్లు గణాకాంలు వెల్లడించాయి.

31. ప్రయాణికుల సంఖ్య

31. ప్రయాణికుల సంఖ్య

రోజుకు 25 మిలియన్ ప్రయాణికులను ఇండియన్ రైల్వే వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది.

32. మొత్తం రైళ్ల సంఖ్య

32. మొత్తం రైళ్ల సంఖ్య

ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో ప్రతి రోజు దాదాపుగా 19,000 వరకు తిరుగుతున్నాయి. ఇందులో 12,000 వరకు ప్రయాణికుల కోసం మరియు 7,000 వరకు సరుకు రవాణా కోసం

33. రైల్వే స్టేషన్ల సంఖ్య

33. రైల్వే స్టేషన్ల సంఖ్య

మొత్తం భారతీయ రైల్వే వ్యవస్థలో 7,083 రైల్వే స్టేషన్లు కలవు.

34. ఛార్జీల వివరాలు

34. ఛార్జీల వివరాలు

ప్రస్తుతం ఇండియన్ రైల్వే ఛార్జీల మోత మోగిస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీ మరియు కలకత్తాల మద్య గల 1500 కిలోమీటర్లు ప్రయాణానికి సాదారణ ఛార్జీ 250 రుపాయలుగా ఉండేది. ఇదే దూరం ఇతర దేశాలలో ప్రయాణించాలంటే దీని ధరకు 10 రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

35. ట్రాన్సిట్ ట్రైన్స్

35. ట్రాన్సిట్ ట్రైన్స్

సిటీ రవాణా కోసం ముంబాయ్ లోకల్ ట్రైయిన్ ట్రాన్స్‌పోర్ట్ కోసం 15 కోచ్‌లను అందించారు.

36. ఛత్రపతి శివాజీ టెర్మినస్

36. ఛత్రపతి శివాజీ టెర్మినస్

ముంబాయ్‌లో గల ఛత్రపతి శివాజీ టెర్మినస్ ద్వారా సంవత్సరానికి దాదాపుగా 33 మిలియన్ మంది ప్రయాణికులు వస్తుపోతుంటారు. మరియు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో వారిచే గుర్తంపు పొందిన ఏకైక భారతీయ రైల్వే స్టేషన్ ఇది.

37. పురాతన పద్దతిలో ట్రాక్ మరమ్మత్తులు

37. పురాతన పద్దతిలో ట్రాక్ మరమ్మత్తులు

ఇండియన్ రైల్వేలో ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో ట్రాక్ మరమ్మత్తుల కోసం 1853 కాలం నాటి పద్దతులను వినియోగిస్తున్నారు.

38. భారీ వసూళ్లు

38. భారీ వసూళ్లు

2011-21 సంవత్సరం కాలంలో ఇండియన్ రైల్వే ఫైన్లు మరియు ఇతర టికెట్ రహిత ప్రయాణికుల నుండి దాదాపుగా 581 కోట్ల రుపాయలు పైబడి వసూలు చేశారు. మరి ఇపుడు ఈ మొత్తం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కరలేదు.

 39.రైల్వే మ్యూజియం

39.రైల్వే మ్యూజియం

భారతీయ రైల్వే 1977లో జాతీయ రైలు మ్యూజియంను ఢిల్లీలో ఏర్పాటు చేసింది. ఇది ఆసియాలోనే అతి పెద్ద మ్యూజియం. ఇది దాదాపుగా మొత్తం 11 కిలోమీటర్లు విస్తరించి ఉంది.

Picture credit: Bruno Corpet/Wiki Commons

40. పొడవైన రైల్వే వంతెన

40. పొడవైన రైల్వే వంతెన

ప్రస్తుతం దేశీయంగా అతి గల అతి పొడవైన రైల్వే వంతెమ కేరళలో కలదు. ఎడప్పల్లీ మరియు వల్లార్పడం ప్రాంతాల మద్య 4.62 కిలోమీటర్లు పొడవు గల దీనిని వెంబనాద్ రైల్ బ్రిడ్జ్ అని పిలుస్తారు.

Picture credit: Rash9745/Wiki Commons

41. సముద్రపు వంతెన

41. సముద్రపు వంతెన

భారత దేశపు మొదటి సముద్రపు వంతెన పాంబన వంతెన. తమిళనాడులోని రామేశ్వరం నుండి సమద్రంలో గల పాంబన్ దీవికి రైలు వంతెన నిర్మించారు.

Picture credit: Shubham Gupta/Wiki Commons

42. రైలు, రోడ్డు వంతెన

42. రైలు, రోడ్డు వంతెన

క్రింది వైపున రైలు మరియు పై వైపున వాహనాలు వెళ్లే రైలు మరయు రోడ్డు వంతెనను గోదవరి నది మీద నిర్మించారు. ఇది ఆసియాలోనే రెండవ అతి పెద్ద రైలు రోడ్డు వంతెన.

Picture credit: worldtravelserver/Wiki Commons

43.మొదటి రైల్వే వంతెన

43.మొదటి రైల్వే వంతెన

ముంబాయ్-థానే మార్గంలో 1854 లో మొదటి రైల్వే వంతెనను నిర్మించారు. దీని పేరు దపూరీ వయాడక్ట్

Picture credit: Wiki Commons

44.స్వాతంత్ర్యం ముందు నుండి

44.స్వాతంత్ర్యం ముందు నుండి

భారతీయులకు స్వాతంత్ర్యం రాకమునుపునుండి దాదాపుగా 42 సంస్థలు ఇండియన్ రైల్వేలో భాగస్వామ్యంగా ఉండేవి.

45. అత్యంత ఎత్తైన వంతెన

45. అత్యంత ఎత్తైన వంతెన

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎత్తైన రైలు వంతెను చీనాబ్ నది మీద నిర్మిస్తున్నారు. దీనిని ఎత్తు దాదాపుగా 359 మీటర్లు(1,180 అడుగులు) గా ఉండనుంది.

Picture credit: spatialprecision

46. ఇండియన్ రైల్వేలో మొదటి రైలు సొరంగం

46. ఇండియన్ రైల్వేలో మొదటి రైలు సొరంగం

1865 లో థానేకు సమీపంలో పార్సిక్ సొరంగాన్ని నిర్మించారు. ఇది భారత దేశపు మొదటి రైలు సొరంగం.

Picture credit: indiarailinfo

47. ప్రపంచ రికార్డు

47. ప్రపంచ రికార్డు

ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ద్వారా ఎక్కువ మార్గాలకు రైళ్లను నడపబడుతున్న స్టేషన్‌గా ఢిల్లీ రైల్వే స్టేషన్ గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించింది.

48. సంపద

48. సంపద

ఇండియన్ రైల్వేకు దాదాపుగా 10.65 లక్షల ఎకరాల భూమిని కలిగి ఉంది. ఇందులో 90 శాతం వరకు రైల్వే మరియు ఇతరులకు అద్దె కోసం వినియోగిస్తోంది. ప్రస్తుతం 1.13 లక్షల ఎకరాలు ఖాళీగా ఉంది.

49.భోజనశాల గల రైలు

49.భోజనశాల గల రైలు

ముంబాయ్-పూనేల మధ్య నడుస్తున్న పురాతణమైన డెక్కన్ క్వీన్ రైలు ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో కలదు.

Picture credit: YouTube

More from DriveSpark

Article Published On: Monday, April 4, 2016, 18:17 [IST]
English summary
Indias Fastest Train Begin Service From April 5
Read more on: #రైలు #rail
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+