భారత్కు మరింత బలాన్ని చేకూర్చిన ఐఎన్ఎస్ అరిహంత్ అణుజలాంతర్గామి
దేశ ప్రజల భద్రతే ముఖ్య లక్షంగా దేశ రక్షణలో భాగమైన ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ మరియు నేవీ వివిధ రకాల యుద్ద సామాగ్రిని సృష్టించుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇండియన్ నేవీ భారత దేశపు మొదటి న్యూక్లియర్ జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ను తయారు చేసుకుంది.
భారత దేశపు మొదటి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

దేశీయ మొదటి న్యూక్లియర్ సబ్మెరైన్ పూర్తి నిర్మాణంకోసం దాదాపుగా 2.9 బిలియన్ అమెరికన్లు డాలర్లు ఖర్చు చేశారు. ఇంత మొత్తం వెచ్చించడానికి ఇందులో అధునాతమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజిల్ను అందించారు.

ఇది దాదాపుగా 112 మీటర్ల పొడవు అనగా 367 అడుగులు కలదు. మరియు ఇది 6,000 టన్నుల బరువును కలిగి ఉంటుంది.

ఐఎన్ఎస్ సబ్మెరైన్ నీటి ఉపరితలం పైన గంటకు 22 నుండి 28 కిలో మీటర్లతో మరియు నీటి లోపల గంటకు 44 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

ఇందులో దాదాపుగా 12 కె15 ఎస్ఎల్బిఎమ్ మిస్సైల్స్ లేదా కె-4 అనే మిస్సైల్స్ను దాదాపుగా 4 నాలుగు వరకు కలిగి ఉంది. వీటి

అంతే కాకుండా కె-15 సాగరిక అనే 12 వార్హెడ్లను ఇది కలిగి ఉంటుంది.

ఇందులో వినియోగించనున్న కె-15 సాగరిక మిస్సైల్స్ పరిధి 750 కిలోమీటర్లు మరియు కె-4 మిస్సైల్స్ పరిధి దాదాపుగా 3,500 కిలోమీటర్లుగా ఉంది.

ఇండియన్ నేవీ ఇలాంటి మరో రెండు సబ్మెరైన్లను తయారు చేయాడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిని విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించనున్నారు.

ప్రస్తుతం భారత్ మొదటి న్యూక్లియర్ సబ్మెరైన్ పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిందని ఇక దీనిని ప్రారంభించడమే ఆలస్యం అని తెలిసింది.

అయితే దీనిని ప్రధాని మోడి చేతులు మీదుగా విశాఖపట్నం పోర్ట్ కేంద్రంగా ప్రారంభించనున్న ఒక అధికారి తెలిపారు

దేశీయ మొదటి న్యూక్లియర్ సబ్మెరైన్ రష్యాకు చెందిన అకులా-క్లాస్ సబ్మెరైన్కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.

- ఆ లిస్టులో చేరిపోయిన రోహిత్ శర్మ
- బొగ్గు గనులలో బయల్పడిన రహస్యమైన కార్లు అవశేషాలు
- ఇండియా-పాకిస్తాన్ల మధ్య ప్రారంభం కానున్న యుద్దం...!!
Picture credit: Wiki Commons


Click it and Unblock the Notifications