Just In
- 4 min ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 2 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 2 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 4 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- Sports IPL 2024: ఐపీఎల్ విజేతగా నిలిచేది ఆ జట్టే- రికీ పాంటింగ్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- News మాకు ఏమిచ్చారని మీకు ఓటేయాలి: రేవంత్ రెడ్డి ఫైర్
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Lifestyle కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
- Movies ఎన్టీఆర్ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
ఇండియాలో కూడా అత్యంత పొడవైన సొరంగ మార్గం ఉందని గర్వంగా చెప్పుకోండి
భారత దేశపు అత్యంత పొడవైన రహదారి సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించారు. ఈ మార్గం గురించి పూర్తి వివరాలు...
మన
దేశంలో
అత్యంత
పొడవైన
రహదారి
సొరంగ
మార్గం(India's
Longest
Road
Tunnel)
ఉందని
చెప్పుకునే
రీతిలో
జమ్మూ
కాశ్మీరులోని
చెనాని
మరియు
నాశ్రి
ప్రాంతాల
మధ్య
నిర్మించిన
భారత
దేశపు
అత్యంత
పొడవైన
రహదారి
సొరంగ
మార్గం(రోడ్
టన్నెల్)ను
ప్రధాన
మంత్రి
నరేంద్ర
మోడీ
గారు
ప్రారంభించారు.
ఈ
రోడ్
టన్నెల్
గురించి
మరిన్ని
వివరాలు....
జమ్మూకాశ్మీరులోని చెనాని మరియు నాశ్రి ప్రాంతాల మధ్య నిర్మించిన ఈ రోడ్ టన్నెల్ తొమ్మిది కిలోమీటర్ల మేర ఉంది. ఇది దేశీయంగా అత్యంత పొడవైన రోడ్ టన్నెల్ మాత్రమే కాకుండా ఆసియాలోని అత్యంత పొడవైన ద్వి దిశాత్మక(bi-directional) టన్నెల్గా నిలిచింది.
ఈ రోడ్ టన్నెల్ను రూ. 3,720 కోట్ల రుపాయలు వెచ్చించి నిర్మించారు. తొమ్మిది కిలోమీటర్ల మేర రెండు వైపులా(టు వే) సమాంతరంగా రహదారిని నిర్మించారు.
ప్రధాన సొరంగ మార్గానికి ఆనుకుని అత్యవసర సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఈ రెండింటిని 29 చిన్న చిన్న మార్గాలతో అనుసంధానించారు. ప్రధాన సొరంగ మార్గంలో ప్రయాణించేటపుడు అత్యవసరంగా పారిపోయేందుకు ప్రక్కనే ఉన్న అత్యవసర సొరంగ మార్గాన్ని ఉపయోగించుకోవచ్చు.
సొరంగ మార్గానికి ఇరువైపులా జాతీయ రహదారిని చేరేందుకు పెద్ద వంతెనలు నిర్మించారు. ఇరువైపులా టోల్ బూత్లను కూడా ఏర్పాటు చేశారు. వాహనాల ఎత్తు 5-మీటర్లకు మించకుండా ఉండేందుకు టోల్ బూత్ల వద్ద ప్రత్యేక సెన్సార్లను అమర్చడం జరిగింది.
ఈ నూతన సొరంగ మార్గం యొక్క ఎత్తు 1,200 మీటర్లు (3,937 అడుగులు)గా ఉంది. శ్రీనగర్ మరియు జమ్మూల మధ్య నిర్మించిన చెనాని-నాశ్రి సొరంగం మార్గం ద్వారా ప్రయాణం సమయం సుమారుగా 2 గంటలకు పైగా తగ్గింది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని కఠినమైన 40 కిలోమీటర్ల రహదారిలో ప్రయాణించాల్సిన అవసరం కూడా దీంతో తీరిపోయింది.
జమ్మూ-శ్రీనగర్ మార్గంలో ప్రయాణ సమయం మరియు దూరం తగ్గిపోవడం ద్వారా ఇంధన వినియోగం భారీ తగ్గపోనుంది. ఈ మార్గంలో రాకపోకలు ప్రారంభించడం ద్వారా రోజుకు సుమారుగా రూ. 27 లక్షల విలువైన ఇంధన ఆదా జరుగుతుందని అధికారులు అంచనా వేశారు.
నార్వేలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి టన్నెల్(పైన ఉన్న ఫోటో) పొడవు 24.51 కిలోమీటర్లలో దాదాపు సగ భాగం ఉంది ఈ భారతదేశపు అత్యంత పొడవైన రహదారి సొరంగ మార్గం.