Just In
- 7 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 9 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 10 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 11 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Movies ఎన్టీఆర్ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
కరోనా సంక్షోభం మధ్య ఈ వీడియో పైలట్లలో విశ్వాసం పెంచనుందా.. ?
భారతదేశంలో 21 రోజుల లాక్ డౌన్ కారణంగా అన్ని వాహన సేవలు నిలిపివేయబడ్డాయి. బస్సులు, ట్రైన్లు మాత్రమే కాకుండా విమాన సేవలు కూడా పూర్తిగా నిలివేయబడ్డాయి. ఇప్పుడు కేవలం అత్యవసర సేవలకు మరియు సరుకు రవాణా చేసే విమానాలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి.
భారతదేశంలో కరోనా తీవ్రంగా ఉన్న కారణంగా విమానయాన పరిశ్రమ పూర్తిగా మూసివేయబడింది. వైమానిక సంస్థ తిరిగి ప్రారంభమవుతుందా లేదా అనే దానిపై పైలట్లు మరియు సిబ్బందిలో ఆందోళనలు మొదలయ్యాయి. తిరిగి తమ విధుల్లో ఎప్పుడు రావాలన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. అంతే కాకుండా కొంత మంది ఉద్యోగాలు కోల్పోతామేమో అని సందేహాలు కూడా మొదలయ్యాయి.
ఇంత క్లిష్ట పరిస్థితిలో ఇండిగో పైలట్ ప్రదీప్ కృష్ణన్, ఇతర పైలట్లతో కలిసి, విమానాలు మళ్లీ ఎగురుతాయని పైలట్లలో విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి ఒక వీడియో రూపొందించారు.
ఇతర విమాన సిబ్బందిలో ఉత్సాహాన్ని ప్రోత్సహించడానికి ఈ వీడియో తయారు చేయబడిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొంత సహనం అవసరమని ఆయన అన్నారు.
దీనికి సంబంధించిన సమాచారం ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన సంస్థలు సుమారు 5 కోట్ల మంది ప్రయాణికులను కోల్పోతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 8 నుంచి 9 మిలియన్ల మంది ప్రయాణికులు ఈ విమానాలలో ప్రయాణించే అవకాశం ఉంది. 2019 లెక్కల ప్రకారం దాదాపు 14 కోట్ల మంది ప్రయాణికులు విమానంలో ప్రయాణించారు.
View this post on InstagramA post shared by Pradeep Krishnan (@capt_pradeepkrishnan) on
ఇప్పుడు కరోనా అత్యధికంగా వ్యాపించడం వల్ల అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా తగ్గుతుంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 3 కోట్లకు పైగా ప్రయాణికులు అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 7 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
కరోనా వైరస్ వల్ల కలిగే నష్టం నుండి కోలుకోవడానికి విమానయాన సంస్థలకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్రయాణీకుల సంఖ్య తగ్గడం చాలా కంపెనీల వ్యాపారాలను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది.