Just In
- 7 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 9 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 10 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 12 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనా సంక్షోభం మధ్య ఈ వీడియో పైలట్లలో విశ్వాసం పెంచనుందా.. ?
భారతదేశంలో 21 రోజుల లాక్ డౌన్ కారణంగా అన్ని వాహన సేవలు నిలిపివేయబడ్డాయి. బస్సులు, ట్రైన్లు మాత్రమే కాకుండా విమాన సేవలు కూడా పూర్తిగా నిలివేయబడ్డాయి. ఇప్పుడు కేవలం అత్యవసర సేవలకు మరియు సరుకు రవాణా చేసే విమానాలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి.
భారతదేశంలో కరోనా తీవ్రంగా ఉన్న కారణంగా విమానయాన పరిశ్రమ పూర్తిగా మూసివేయబడింది. వైమానిక సంస్థ తిరిగి ప్రారంభమవుతుందా లేదా అనే దానిపై పైలట్లు మరియు సిబ్బందిలో ఆందోళనలు మొదలయ్యాయి. తిరిగి తమ విధుల్లో ఎప్పుడు రావాలన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. అంతే కాకుండా కొంత మంది ఉద్యోగాలు కోల్పోతామేమో అని సందేహాలు కూడా మొదలయ్యాయి.
ఇంత క్లిష్ట పరిస్థితిలో ఇండిగో పైలట్ ప్రదీప్ కృష్ణన్, ఇతర పైలట్లతో కలిసి, విమానాలు మళ్లీ ఎగురుతాయని పైలట్లలో విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి ఒక వీడియో రూపొందించారు.
ఇతర విమాన సిబ్బందిలో ఉత్సాహాన్ని ప్రోత్సహించడానికి ఈ వీడియో తయారు చేయబడిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొంత సహనం అవసరమని ఆయన అన్నారు.
దీనికి సంబంధించిన సమాచారం ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన సంస్థలు సుమారు 5 కోట్ల మంది ప్రయాణికులను కోల్పోతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 8 నుంచి 9 మిలియన్ల మంది ప్రయాణికులు ఈ విమానాలలో ప్రయాణించే అవకాశం ఉంది. 2019 లెక్కల ప్రకారం దాదాపు 14 కోట్ల మంది ప్రయాణికులు విమానంలో ప్రయాణించారు.
View this post on InstagramA post shared by Pradeep Krishnan (@capt_pradeepkrishnan) on
ఇప్పుడు కరోనా అత్యధికంగా వ్యాపించడం వల్ల అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా తగ్గుతుంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 3 కోట్లకు పైగా ప్రయాణికులు అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 7 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
కరోనా వైరస్ వల్ల కలిగే నష్టం నుండి కోలుకోవడానికి విమానయాన సంస్థలకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్రయాణీకుల సంఖ్య తగ్గడం చాలా కంపెనీల వ్యాపారాలను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది.