Just In
- 31 min ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 1 hr ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 3 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 5 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
Don't Miss
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Movies Adivi Sesh: "అకీరాతో స్నేహం అలా కుదిరింది.. కచ్చితంగా అతడితో సినిమా చేస్తా"
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇది చూసారా..కష్టాలను ఎదుర్కొని పరీక్షలో 87% మార్కులు సాధించి రూ. 25 వేల బహుమతి గెలిచిన విద్యార్ధి కథ
భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని నివారించడం కోసం భారత ప్రభుత్వం విధించినసంగతి అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు లాక్ డౌన్ సడలించబడింది. బస్సులు, ఆటో మరియు టాక్సీలతో సహా అన్ని రకాల వాహనాలు దాదాపు అన్ని ప్రాంతాలలో ప్రయాణిస్తున్నాయి. కానీ చాలామంది ప్రజలు ఇప్పటికి కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతో తమ సొంతవాహనాలలో ప్రయాణించడానికి ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారు.
కరోనా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. బస్సులు, ఆటో మరియు టాక్సీలతో సహా అన్ని రకాల వాహనాలకు ట్రాఫిక్ పరిమితం చేయబడింది. ప్రైవేట్ కారు మరియు ద్విచక్ర వాహనాల రద్దీ కూడా పరిమితం చేయబడింది. లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించి రోడ్డుపై వచ్చే వాహనాలను పోలీసులు జప్తు చేశారు.
ఇది అత్యవసర పరిస్థితులకు బయలుదేరాల్సిన వ్యక్తులకు కష్టమైంది. బయటి ప్రాంతాలలో చిక్కుకున్న కార్మికులు, ఆసుపత్రులకు వెళ్ళవలసి వచ్చిన వారు మరింత ఇబ్బంది పడ్డారు. వీరిలో ఎక్కువ మంది సైకిల్, ద్విచక్ర వాహనాల ద్వారా వందల కిలోమీటర్లు ప్రయాణించారు.
అలాంటి వారిలో శుభంగి పాటిల్ ఒకరు. లాక్ డౌన్ సమయంలో, ఆమె అనారోగ్య తల్లిని 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లింది.
అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత 12 వ తరగతి పరీక్ష రాశారు. అన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఆమె పన్నెండో తరగతి పరీక్షలో 87% సాధించింది. ఈ సాధనకు ముఖ్యమంత్రి ల్యాప్టాప్ పథకం కింద రూ .25 వేలు పొందటానికి అర్హత సాధించింది. కానీ తన కుమార్తె సాధించిన ఈ విజయాన్ని చూడటానికి అతని తల్లి సజీవంగా లేకపోవడం విచారకరం.
శుభంగి పాటిల్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నివాసి. ఆమె తండ్రి రైతు. ఆమె తండ్రి 2009 లో కిడ్నీ వైఫల్యంతో మరణించారు. అప్పటి అంగన్వాడీ కార్మికురాలిగా ఉన్న శుభంగి పాటిల్ తల్లి మొత్తం కుటుంబానికి బాధ్యత వహించింది. కానీ లాక్ డౌన్ కాలంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది.
MOST READ:దుమ్మురేపుతున్న ఫార్చ్యూనర్ లెజెండరీ ఎస్యూవీ ఆఫ్ రోడ్ పెర్ఫార్మెన్స్ వీడియో
ఆ సమయంలో శుభంగి పాటిల్ మరియు ఆమె సోదరి వద్ద డబ్బు లేదు. ఏమి చేయాలో తెలియక, వారు తమ తల్లిని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
దీని గురించి శుభంగి పాటిల్ మాట్లాడుతూ, అప్పుడు మా దగ్గర కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నా తల్లి ఆసుపత్రి ఖర్చులను మామయ్య భరిస్తారని నాకు తెలుసు. అందువల్ల నేను నా తల్లిని బామ్మ ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను.
నేను నా తల్లిని నా స్కూటర్ వెనుక కూర్చోబెట్టుకుని దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని సోప్తాకు తీసుకువెళ్ళాను. తర్వాత పరీక్ష రాశాను. కానీ నా తల్లి జూన్ నెలలో కన్నుమూసింది.
MOST READ:మరో వాహనాన్ని కాఫీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ వాహనంలో తెలుసా ?
కష్టాలను ఎదుర్కొని మంచి మార్కులు సాధించడంలో శుభంగి పాటిల్ సాధించిన విజయాన్ని చాలా మంది ప్రశంసించారు. మధ్యప్రదేశ్లోని నిబంధనల ప్రకారం 12 వ తరగతిలో 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు ల్యాప్టాప్ కొనడానికి రూ. 25 వేలు ఇస్తారు.
87% మార్కులతో శుభంగి పాటిల్ ఈ బహుమతికి అర్హురాలు. అయితే శుభాంగి పాటిల్ ల్యాప్టాప్ కొనడానికి బదులు ఈ డబ్బును కాలేజీ ఫీజు కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుంది. శుభంగి పాటిల్ వంటి చాలా మంది పేద విద్యార్థులు ఈ డబ్బును కళాశాల ఫీజు కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఏది ఏమైనా విషాదంతో మొదలైన శుభంగి పాటిల్ కథ మంచి మార్కులు సాధించి కొంత వరకు సుఖాంతం అయింది.
Source: Times of india
MOST READ:మీకు తెలుసా.. ఇప్పుడు సియట్ టైర్ బ్రాండ్ అంబాసిడర్గా అమీర్ ఖాన్