సాధారణ వ్యక్తిని ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా, ఎందుకో తెలుసా ?

భారతదేశంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వారి ఆలోచనలను ట్వీట్ ద్వారా పంచుకుంటూ ఉంటాడు. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయడం ద్వారా భారతీయుల నుండి ప్రేరణ పొందడం గురించి మాట్లాడారు.

సాధారణ వ్యక్తిని ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా, ఎందుకో తెలుసా ?

ఇటీవల ఆనంద్ మహీంద్రా సిసిటివి ఇడియట్ ఖాతా ట్విట్టర్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి కొత్త టెక్నాలజీతో చిన్న స్థలంలో కార్ పార్కింగ్ చేయడం చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా కొత్త విధానాన్ని ప్రశంసించారు.

సాధారణ వ్యక్తిని ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా, ఎందుకో తెలుసా ?

మన దేశంలో వాహనాలు పార్కింగ్ చేయడానికి కావలసినంత స్థలం ఉండదు. కానీ ప్రజలు తక్కువ స్థలంలో వాహనాలను పార్క్ చేయడానికి వివిధ మార్గాలను అనుసరిస్తారు. వీడియోలో ఉన్న వ్యక్తి తన ఇంటి ముందు చిన్న స్థలంలో కారును పార్కింగ్ చేయడం మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

MOST READ:బిఎస్ 6 ఇంజిన్‌లో విడుదలైన కొత్త కవాసకి నింజా 650 బైక్

సాధారణ వ్యక్తిని ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా, ఎందుకో తెలుసా ?

ఈ వీడియో గురించి ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ, నేను పంజాబ్ లో కొన్ని రోజుల క్రితం ఇలాంటి సంఘటన చూసానన్నారు. ఈ వీడియోలో ఆ వ్యక్తి చేస్తున్న పనికి ఆనంద్ మహీంద్రా అభినందించారు. అంతే కాకుండా దీనిని రూపొందించిన వ్యక్తి మా తయారీ కర్మాగారం రూపకల్పనను మెరుగుపరచడానికి కొత్త ఆలోచనలను ఇవ్వగలడు, అని ఆయన అన్నారు. ఈ వీడియోలోని వ్యక్తి తన ఎరుపు హ్యాచ్‌బ్యాక్‌ను పార్కింగ్ చేయడం మనం ఇక్కడ చూడవచ్చు.

సాధారణ వ్యక్తిని ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా, ఎందుకో తెలుసా ?

ఆ వ్యక్తి మొదట తన కారును మెటల్ ప్లాట్‌ఫాంపై పార్క్ చేశాడు. ఈ ప్లాట్‌ఫాం స్థలానికి తగినట్లుగా రూపొందించబడింది. కారు ప్లాట్‌ఫాంపై నిలబడిన తరువాత, వ్యక్తి కారు నుండి దిగి ప్లాట్‌ఫాంను నెట్టాడు. దీనివల్ల కారు చిన్న స్థలంలో నిలిచిపోతుంది.

MOST READ:కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 250 బైక్ లాంచ్ ఎప్పుడంటే

సాధారణ వ్యక్తిని ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా, ఎందుకో తెలుసా ?

అతిచిన్న స్థలంలో కారును నిలిపిన వ్యక్తి చేసిన పనిని ప్రశంసించిన వ్యక్తులు, చెట్టును కత్తిరించకుండా ఓ వ్యక్తి కార్ పార్కింగ్ చేశాడని చెప్పారు. ఈ వ్యక్తి చర్యకు చాలా మంది అభినందనలు తెలిపారు.

సాధారణ వ్యక్తిని ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా, ఎందుకో తెలుసా ?

ఆనంద్ మహీంద్రా కొద్ది రోజుల క్రితం బైక్ పార్కింగ్ చిత్రాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో, రెండు బైక్‌లను పెద్ద ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ లోపల నిలిపి ఉంచారు. ఇది చూసి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు. ఇలాంటి సంఘటనలు భారతదేశంలో చాలానే జరుగుతూ ఉంటాయి. చాలామంది ప్రజలు కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగించి తమ అనుభూతులను తెలుపుకుంటున్నారు.

MOST READ:భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రవేశపెట్టనున్న కొత్త బైక్ ఇదే

Most Read Articles

English summary
Innovative Car Parking technique impresses Anand Mahindra. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X