మహిళలకు మాత్రమే అంకితం అయిన ఐఎన్ఎస్ మహదేయి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
ప్రపంచం మొత్తం ఇంజన్ పవర్తో నడుస్తోంది అంటే మీరు నమ్ముతారా ? నమ్మాల్సిందే ఎందుకంటే కార్లు, బైకులు, విమానాలు, రైళ్లు ఇలాంటి ఎన్నో వాహనాలు యంత్ర శక్తి ద్వారా నడుస్తాయి. అందులో నీటి మీద పరుగులు పెట్టే పెద్ద పెద్ద షిప్పులు సైతం కూడా. కాని ఇండియన్ నేవీలో ఉన్న ఐఎన్ఎస్ మహదేయి మాత్రం మహిళా శక్తితో నడుస్తోంది. దీనిని ప్రారంభించినప్పటి నుండి నేటి వరకు దీనికి ప్రాథినిత్యం వహిస్తోంది మహిళలే.
ఇంతేనా దీని గురించి తెలుసుకోవడే అదును అడుగడుగునా అత్భుతాలే. అందుకే ఈ సందర్బంగా దీని గురించి కొన్ని అతి ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు క్రింది కథనం ద్వారా అందివ్వడం జరిగింది.

ఈ ఐఎన్ఎస్వి మహదేయి గురించి మీరు వినడం ఇది మొదటిసారి అయినప్పటికీ. ఇది ఇండియన్ నేవీలో శిక్షణ బోటుగా సేవలు అందిస్తోంది. కొన్ని ప్రపంచ రికార్డులనే సాధించింది.

మొదటిసారిగా ఇది గోవాలోని మోర్మాగ్లో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు విశాఖపట్నం నుండి కేవలం మహిళలు మాత్రమే నడుపుతూ వచ్చారు.

అయితే ప్రస్తుతం గోవాలో అచ్చం ఇలాంటిదే అక్వారియస్ ఫైబర్ లెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అభివృద్ది చేస్తున్నారు.2017 లో దీనిని కేవలం మహిళల ద్వారా మాత్రమే ప్రపంచం మొత్తం చుట్టిరావాలని ఆశయంతో ఉన్నారు.

ఇండియన్ నేవీ ఈ సరికొత్త బోటు గోవాలోని సంస్థకు తయారీకు చెందిన ఆర్డరును ఇచ్చింది. దీనిని 2017 ఫిబ్రవరిలో ఇండియన్ నేవీకు డెలివరీ ఇవ్వనున్నారు.

మహదేయి బోటు దాదాపుగా 1,00,000 నాటికల్ మైళ్ల దూరం నీటి మీద పరుగులు పెట్టింది. అంటే ఏకంగా 1,85,200 కిలోమీటర్లు. అంటే భూమి చుట్టు రెండు సార్లు తిరిగి వచ్చినంత దూరం. ఒక సాధారణ శిక్షణా బోటు మరియు సాహస ప్రయాణం చేసిన మహిళలు ప్రాథినిధ్యం వహించిన బోటు కూడా ఇదే.

ఇలా ప్రపంచాన్ని సముద్రం మీద చుట్టి వచ్చిన వారిలో దిలీప్ డోండి. ఇతను మే 19, 2010 లో ఒక్కడే భూమిని సముద్ర మార్గం ద్వారా చుట్టి వచ్చిన మొదటి భారతీయుడు. దిలీప్ ఆగష్ట్ 19, 2009 లో తన ప్రయాణాన్ని ప్రారంభించి మే 19, 2010 లో ముగించాడు. అది కూడా కేవలం నాలుగు సార్లు మాత్రమే తన మొత్తం ప్రయాణంలో తన బోటును ఆపినట్లు తెలిపాడు.

ఇలా ఐఎన్ఎస్ మహదేయి బోటును నడిపిన వారిలో ఎల్టి. కమమాండర్ అభిలాష్ టోమి. ఈ బోటు ద్వారా ఒక్కడే మరియు నాన్-స్టాప్గా ఇండియన్ బోటును నడిపిన వ్యక్తి ఇతను.

ఐఎన్ఎస్ మహదేయి బోటు దాదాపుగా 23 టన్నుల బరువును మోయగలదు. దీని గోవా ఆధారిత అక్వారియస్ ఫైబర్లెస్ సంస్థ తయారుచేసి ఇండియన్ నేవీకు 2009లో అందించింది.

ఈ మహదేయి బోటులో కమ్యునికేషన్ వ్యవస్థ కోసం శాటిలైట్ మరియు ఎలక్ట్రానిక్ న్యావిగేషన్లను అందించారు.

ఈ మహదేయి బోటులో 12,000 లీటర్ల సామర్థ్యం గల త్రాగునీటి ట్యాంకు కలదు. ప్రాథమికంగా ఇది సముద్ర నీటిని రివర్స్ ఆస్మాసిస్ పద్దతి ద్వారా శుద్ది చేసి నిల్వ ఉంచుకుంటుంది.

ఐఎన్ఎస్ మహదేయి అనే పేరును ఈ బోటుకు మండోవి నది ఆధారంగా పెట్టినట్లు తెలిసింది.

భారతీయ నౌకా దళంలో మహిళలచేత నడుపబడుతున్న మొదటి బోటు కూడా ఈ ఐఎన్ఎస్ మహదేయినే అయిన ఇండియన్ నేవీ తెలిపింది.

ఇండియన్ నేవీకి పేరు ఎలా వచ్చిందో తెలుసా ?
ప్రారంభంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ సొంతం నౌకా దళాన్ని బ్రిటీష్ వారు 1612 లో స్థాపించారు. తరువాత ఇది కాస్త జనవరి 26 1950 లో రాయల్ ఇండియన్ నేవీగా రూపాంతరం చెందింది. ఇండియన్ నేవీ తన మొదటి అస్త్రాన్ని పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా 1961 లో గోవా విముక్తి సందర్భంగా పనిచేసింది.

- తీర ప్రాంతాల్ని మొహరించిన అమెరికా ఆంపిబియస్ యుద్ద వాహనాలు
- భారత్కు మరింత బలాన్ని చేకూర్చిన ఐఎన్ఎస్ అరిహంత్ అణుజలాంతర్గామి
- మరింత బలమైన రష్యా రక్షణ రంగం


Click it and Unblock the Notifications