Just In
- 1 min ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 14 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 15 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 17 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
Don't Miss
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈ సొరంగ మార్గ నిర్మాణం జరిగితే 50 కి.మీ దూరం తగ్గుతుంది, అదెక్కడుందో తెలుసా ?
జమ్మూ మరియు శ్రీనగర్ జాతీయ రహదారి, కాశ్మీర్ను భారతదేశంలోని ఇతర నగరాలతో కలిపే ఏకైక రహదారి. ఈ హైవే అన్ని రకాల వాతావరణాలలో మన్నికైనదిగా నిర్మించబడింది. ప్రస్తుతం ఈ రహదారిని మరింత వెడల్పు చేసే పనులు జరుగుతున్నాయి.
ఈ రహదారిని ప్రస్తుతం నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారిపై బనిహాల్ మరియు ఖాజిగాండ్ మధ్య 8.5 కిలోమీటర్ల పొడవైన సొరంగం నిర్మిస్తున్నారు. ఈ సొరంగం నిర్మాణం జరిగితే దాదాపు జమ్మూ కాశ్మీర్ మధ్య దూరం 50 కి.మీ వరకు తగ్గుతుంది.
ఈ రహదారి నిర్మాణంతో దూరం తగ్గిన తరువాత ప్రయాణికులు చేరుకోవలసిన సమయం కూడా తగ్గుతుంది. ఈ జాతీయ రహదారిని వెడల్పు చేసే పనులు 2011 నుండి కొనసాగుతున్నాయి. పనులు ప్రారంభమైనప్పుడు దీనిని పూర్తి చేయడానికి ఐదేళ్ల గడువు కూడా ముందే నిర్ణయించారు.
MOST READ:టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్లు, ఎలా ఉన్నాయో చూసారా ?
త్వరలోనే ఈ రహదారి పనులు పూర్తవుతాయి. బనిహాల్ - ఖాజిగాండ్ మధ్య మార్గాలు మూసివేసిన రహదారులు ఎక్కువగా ఉన్నందున ఈ రహదారిని దాటడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రహదారి రైడర్లకు మంచి అనుభూతిని కూడా కలిగిస్తుంది.
ఈ సమస్యను దూరం చేయడానికి జమ్మూ, శ్రీనగర్ ప్రయాణించే సమయాన్ని తగ్గించడానికి హైవే వెడల్పు చేయబడుతోంది. రహదారికి వచ్చే అన్ని అడ్డంకులను పరిష్కరించాలని కూడా ఆదేశించారు.
MOST READ:మరోసారి వైరల్ అయిన మహేంద్ర సింగ్ ధోని వీడియో : అదేంటో తెలుసా !
హైవే వెడల్పుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయింది మరియు దాని నివేదికను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఐఐ) కు సమర్పించారు. ఈ ప్రాజెక్టు 1.5 సంవత్సరాలలో పూర్తవుతుందని ఎన్హెచ్ఏఐ తెలిపింది.
ప్రస్తుతం బనిహాల్ - ఖాజిగాండ్ సబ్ వే పూర్తయింది మరియు త్వరలో ప్రారంభించబడుతుంది. రాంబన్, బనిహాల్ కొండ ప్రాంతాల్లో 16 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ. 2,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అనేక ప్రధాన రహదారులు మరియు సబ్ వే లను నిర్మించే ప్రణాళికలు కూడా ఉన్నాయి.
MOST READ:మద్యం మత్తులో మహిళపై కారు నడిపిన పోలీస్ ఇన్స్పెక్టర్, తర్వాత ఏం జరిగిందంటే?
కొత్త రహదారులు మరియు సొరంగాల నిర్వహణ కోసం జాతీయ రహదారి 44 ను కాంట్రాక్టర్లకు కేటాయించారు. ఈ ప్రాంతాల్లోని అన్ని అడ్డంకులను అధిగమించి వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏది ఏమైనా ఈ మార్గం పూర్తయిన తరువాత వాహనదారులు ప్రయాణించే దూరం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.