మిత్సుబిషి నుండి మొదటి ప్యాసింజర్ జెట్ ప్లేన్
జపాన్కు చెందిన ఆటోమొబైల్ సంస్థ తమ మొట్టమొదటి ప్రయాణికుల జెట్ను పరిచయం చేసింది.జపాన్ దేశంలో మిత్సుబిషి మొట్టమొదటి ప్రాంతీయ జెట్ను ప్రవేశపెట్టింది.
1970 నుండి మిత్సుబిషి కార్పోరేషన్ కమర్షియల్ ఎయిర్లైన్లో మంచి పట్టు కోసం వేచి చూస్తూ వచ్చింది. ప్రస్తుతం ప్రాంతీయ వాణిజ్య ఎయిర్లైన్ వినియోగం అందికం కావడంతో మిత్సుబిషి తమ మొదటిజెట్ కార్యకలాపాలను ప్రారంభించింది.
మిత్సుబిషి వాణిజ్య విమానం గురించి మరింత సమాచారం క్రింది కథనాల ద్వారా తెలుసుకుందా...

జపాన్ యొక్క మొట్టమొదటి దేశీయ ప్రయాణికుల జెట్ ప్లేన్ ప్రథమ పరీక్షను ప్రారంభించింది. ఇది విజయవంతంగా గాలిలో ప్రయాణించింది.

మిత్సుబిషి ప్రారంభించిన ఈ జపాన్ ప్యాసింజర్ జెట్ యొక్క పోటి బ్రెజిల్ మరియు కెనడా మొదటి ప్రతర్థ్యులగా నిర్ణయించుకుంది. అందులో భాగంగానే మిత్సుబిషి తన అతి చిన్న ప్యాసింజర్ విమానాలను ప్రవేశపెట్టింది.

మిత్సుబిషి కార్పోరేషన్కు చెందిన ఈ ప్రాంతీయ విమానాన్ని మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ అభివృద్దిపరిచిన మిత్సుబిషి ప్రాంతీయ జెట్ (యమ్ఆర్జే) సంస్థ బుధ వారం నేగాయ విమానాశ్రయం వద్ద రన్వే మీద ప్రయోగించారు.

రెండు ఇంజన్లు గల ఈ జెట్ విమానం సుమారుగా 35 మీటర్లు అంటే 115 అడుగుల పొడవు ఉంది. ఇది జపాన్ దేశంలో పారదర్శకమైన ఆకాశం మార్గంలోకి సజావుగా వెళ్లిపోయింది.

మిత్సుబిషి రీజనల్ జెట్ ప్లేన్లో సుమారుగా 80 మంది వరకు ప్రయాణికులు ప్రయాణించే వీలు కలదు. ఈ సంస్థకు పోటి బ్రెజిల్కు చెందిన ఎబ్రియర్ మరియు కెనడాకు చెందిన బాంబర్డైయర్ తయారీదారులు.

మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, జపాన్కు సైనిక యుద్ధ విమానాలను అందించే ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

మిత్సుబిషి వారి తరువాత ఆలోచన ఇంధన సామర్థ్యం గల విమానం అందించిండం మరియు ప్రస్తుతం విమాన ప్రయాణాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ నిర్వహణ వ్యయంతో ఎక్కువ మంది ప్రకయాణికులను మోసుకెళ్లే విమానాలను అందించాలని నిర్ణయించుకుంది.

పొరుగుదేశమైన చైనా ఈ మద్య విడుదల చేసిన 158 సీట్ల కెపాసిటి గల సి919 జెట్లైనర్ విమానానికి, ఎయిర్ బస్ ఎ320 మరియు బోయింగ్ 737 విమానాలనకు పోటిగా మరిన్ని విమానాలాను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సంస్థ తెలిపింది.



Click it and Unblock the Notifications