Just In
- 1 hr ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 3 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 3 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 4 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
Don't Miss
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Movies వాడుంటే రాత్రికి పండగే.. అలా పడుకుంటా! పచ్చిగా బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ కి కార్స్ గిఫ్ట్ గా ఇచ్చిన విద్యాశాఖామంత్రి, ఎక్కడో తెలుసా ?
సాధారణంగా ఎవరి నుంచి అయినా కారుని బహుమతిగా పొందితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. సినీ తారలు మరియు ఇతర ఫెమస్ వ్యక్తులు చాలామందికి లగ్జరీ కార్లను గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. ఇటీవల తెలుగు సినీ నటులు ప్రభాస్ మరియు నితిన్ రేంజ్ రోవర్ కార్లను గిఫ్ట్స్ గా ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవల జార్ఖండ్ లో విద్యార్థులకు కార్లను బహుమతిగా ఇచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహాతో రాష్ట్రంలోని 10, 12 వ తరగతి బోర్డు పరీక్షలలో అగ్రస్థానంలో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు ఆల్టో కార్ బహుమతులుగా అందజేశారు. జార్ఖండ్ శాసనసభలో బుధవారం జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు ఆల్టో కార్ అందజేశారు.
విద్యార్థులకు కార్లను ఇచ్చి, ఈ రోజు, నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాను మరియు వచ్చే ఏడాది నుండి రాష్ట్రంలోని అగ్రస్థానంలో ఉన్నవారి విద్య ఖర్చులను భరిస్తానని ప్రకటించాను, తద్వారా వారి చదువు పూర్తి చేయడానికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది అంతే కాకుండా వారి జీవితంలో గొప్ప అవకాశాలను రాణిస్తారు.
MOST READ:భారత్లో గ్లోస్టర్ ఎస్యూవీ బుకింగ్స్ ప్రారంభించిన ఎంజి మోటార్స్
గత 15 సంవత్సరాలుగా పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులకు తన నియోజకవర్గంలో ల్యాప్టాప్లు పంపిణీ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహాతో తెలిపారు. అంతకుముందు, బుధవారం, మంత్రి తన నియోజకవర్గం బొకారోలో 75 శాతానికి పైగా స్కోరు చేసిన విద్యార్థులకు 340 సైకిళ్లతో పాటు, 10 వ తరగతి టాపర్కు మోటారుబైక్ను అందజేశారు.
ఈ ఏడాది 10, 12 వ రాష్ట్ర బోర్డు పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన మనీష్ కుమార్ కటియార్, అమిత్ కుమార్ లను ఆల్టో కార్ల కీలను విద్యాశాఖ మంత్రి అందజేశారు. విద్యా మంత్రి నుండి కారు బహుమతి అందుకోవడంతో ఇద్దరూ చాలా సంతోషించారు. ఇలాంటి బహుమతులు తమ జీవితంలో మరెన్నో గెలవాలని ఆయన అన్నారు. ఇలాంటి బహుమతుల వల్ల విద్యార్థులు చాలా వరకు ప్రోత్సహించబడతారు.
MOST READ:హోండా కార్స్ వర్చ్యువల్ షోరూమ్ని చూశారా? ఎంత బాగుందో..
ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం మాకు గర్వకారణం అని టాపర్ అమిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది మనకు మాత్రమే కాదు, రాబోయే తరాలకు కూడా ప్రోత్సాహకరమైన అంశం.
భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన హ్యాచ్బ్యాక్లలో సుజుకి ఆల్టో ఒకటి. మారుతి సుజుకి ఆల్టో చిన్న కుటుంబాలకు అందుబాటులో ఉండే బడ్జెట్ కారు.ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు వాహనదారునికి మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.
MOST READ:హెల్మెట్ లేదని ఆటో డ్రైవర్కి ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు ; ఎక్కడో తెలుసా ?