Just In
- 57 min ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 2 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 4 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
- 4 hrs ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
Don't Miss
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ కి కార్స్ గిఫ్ట్ గా ఇచ్చిన విద్యాశాఖామంత్రి, ఎక్కడో తెలుసా ?
సాధారణంగా ఎవరి నుంచి అయినా కారుని బహుమతిగా పొందితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. సినీ తారలు మరియు ఇతర ఫెమస్ వ్యక్తులు చాలామందికి లగ్జరీ కార్లను గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. ఇటీవల తెలుగు సినీ నటులు ప్రభాస్ మరియు నితిన్ రేంజ్ రోవర్ కార్లను గిఫ్ట్స్ గా ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవల జార్ఖండ్ లో విద్యార్థులకు కార్లను బహుమతిగా ఇచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహాతో రాష్ట్రంలోని 10, 12 వ తరగతి బోర్డు పరీక్షలలో అగ్రస్థానంలో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు ఆల్టో కార్ బహుమతులుగా అందజేశారు. జార్ఖండ్ శాసనసభలో బుధవారం జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు ఆల్టో కార్ అందజేశారు.
విద్యార్థులకు కార్లను ఇచ్చి, ఈ రోజు, నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాను మరియు వచ్చే ఏడాది నుండి రాష్ట్రంలోని అగ్రస్థానంలో ఉన్నవారి విద్య ఖర్చులను భరిస్తానని ప్రకటించాను, తద్వారా వారి చదువు పూర్తి చేయడానికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది అంతే కాకుండా వారి జీవితంలో గొప్ప అవకాశాలను రాణిస్తారు.
MOST READ:భారత్లో గ్లోస్టర్ ఎస్యూవీ బుకింగ్స్ ప్రారంభించిన ఎంజి మోటార్స్
గత 15 సంవత్సరాలుగా పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థులకు తన నియోజకవర్గంలో ల్యాప్టాప్లు పంపిణీ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహాతో తెలిపారు. అంతకుముందు, బుధవారం, మంత్రి తన నియోజకవర్గం బొకారోలో 75 శాతానికి పైగా స్కోరు చేసిన విద్యార్థులకు 340 సైకిళ్లతో పాటు, 10 వ తరగతి టాపర్కు మోటారుబైక్ను అందజేశారు.
ఈ ఏడాది 10, 12 వ రాష్ట్ర బోర్డు పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన మనీష్ కుమార్ కటియార్, అమిత్ కుమార్ లను ఆల్టో కార్ల కీలను విద్యాశాఖ మంత్రి అందజేశారు. విద్యా మంత్రి నుండి కారు బహుమతి అందుకోవడంతో ఇద్దరూ చాలా సంతోషించారు. ఇలాంటి బహుమతులు తమ జీవితంలో మరెన్నో గెలవాలని ఆయన అన్నారు. ఇలాంటి బహుమతుల వల్ల విద్యార్థులు చాలా వరకు ప్రోత్సహించబడతారు.
MOST READ:హోండా కార్స్ వర్చ్యువల్ షోరూమ్ని చూశారా? ఎంత బాగుందో..
ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం మాకు గర్వకారణం అని టాపర్ అమిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది మనకు మాత్రమే కాదు, రాబోయే తరాలకు కూడా ప్రోత్సాహకరమైన అంశం.
భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన హ్యాచ్బ్యాక్లలో సుజుకి ఆల్టో ఒకటి. మారుతి సుజుకి ఆల్టో చిన్న కుటుంబాలకు అందుబాటులో ఉండే బడ్జెట్ కారు.ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు వాహనదారునికి మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.
MOST READ:హెల్మెట్ లేదని ఆటో డ్రైవర్కి ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు ; ఎక్కడో తెలుసా ?