Just In
- 8 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 8 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 9 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 11 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విలేజ్లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..
భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకి చాపకింద నీరులా ధరలు పెరుగుతుండటం సామాన్యుడి పాలిట శాపంగా మారింది. పెరుగుతున్న డీజిల్ మరియు పెట్రోల్ ధరలపై ప్రభుత్వాలు కూడా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అంతే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి వాహనదారులను ప్రోత్సహిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు కేవలం పెద్ద పెద్ద కంపెనీలు తయారుచేసిన ఎలక్ట్రిక్ బైకులు అధిక ధరలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను సామాన్యుడి చెంతకు చేరే అవకాశం కనిపించడం లేదు. ఇటీవల కాలంలో సెరైకేలా ఖర్సావన్ జిల్లాలోని బసుర్దా గ్రామంలో నివసిస్తున్న కామ్దేవ్ పాన్ అనే యువ శాస్త్రవేత్త ఎలక్ట్రిక్ బైక్ల తయారీ చేసి స్థానికులకు పెట్రోల్ బైక్లకు ప్రత్యామ్నాయాన్ని అందించారు.
కామ్దేవ్ పాన్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజిక్స్ పూర్తి చేసి, చాలా రోజులు ఈ ఎలక్ట్రిక్ బైక్ పై 2 సంవత్సరాలు పరిశోధనలు చేసి మొత్తానికి ఎకో ఎలక్ట్రిక్ బైక్ ను తయారుచేసాడు. కామ్దేవ్ తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఎలెక్ట్రిక్ బైక్ను కేవలం 34,000 ఖర్చుతో నిర్మించారు. ఇది ఒకసారి ఛార్జ్ చేయబడిన తర్వాత 50 నుండి 60 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించగలదు. అంతే కాకుండా దీని బరువు 150 కేజీల వరకు ఉంటుంది.
MOST READ:మైసూర్లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ఈ అద్భుతమైన నిర్మాణాన్ని ప్రశంసించారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలవడానికి రాంచీకి వచ్చిన కామ్దేవ్ ఎలక్ట్రిక్ బైక్ను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పూర్తిగా పరిశీలించి, ఈ యువ శాస్త్రవేత్తను ప్రశంసించాడు.
కామ్దేవ్ పాన్ తన గ్రామంలో తన 16 సంవత్సరాల వయసులో పరిశోధన చేస్తున్నప్పుడు తన సైకిల్ మోటారును నడిపించాడు, అప్పటి నుండి, కామదేవ్ కొత్త పరిశోధన చేయడానికి ఆసక్తి చూపిస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ బైక్లు లేదా స్కూటర్ లు ఎలక్ట్రికల్ ఛార్జ్ చేయబడతాయి.
MOST READ:2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ రివ్యూ ; కొత్త ఫీచర్స్ & పూర్తి వివరాలు
కామ్దేవ్ తయారు చేసిన ఈ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్ ఎలక్ట్రిక్ అవసరం లేకుండా, డ్రైవింగ్ చేయడం ద్వారా సులభంగా ఛార్జ్ చేసే విధంగా తయారుచేసాడు. ఇది ఒక కొత్త లేటెస్ట్ టెక్నాలజీ.
కామ్దేవ్ పరిశోధనలు చేసి ఎలక్ట్రిక్ బైక్ ను తయారుచేయడం వల్ల, ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్త పరిశోధనలు మరియు ఆవిష్కరణల వైపు ఆసక్తి కనపరుస్తున్నారు. చాలా తక్కువ వ్యవధిలో, కామ్దేవ్ మొత్తం జార్ఖండ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు. కామ్దేవ్ కృషితో జార్ఖండ్లో తయారు చేసిన ఈ బైక్ కి ఎకో ఫ్రెండ్లీ బైక్ అని పేరుపెట్టారు.
కామదేవ్ సృష్టించిన అద్భుత సృష్టితో కేవలం తన కుటుంబం మాత్రమే కాదు, ఆ గ్రామం మొత్తంగా గర్వంగా ఉంది. కామదేవ్ కి ఉన్న అత్యంత ఆసక్తి వల్ల ఇప్పుడు తన భార్యకు కూడా పరిశోధన గురించి అవగాహన కల్పిస్తున్నాడు. ఏదైనా సంస్థ పెట్టుబడికి సహాయం చేస్తే, ఈ బైక్ను మరింత తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చని అతడు చెబుతున్నాడు. ఏది ఏమైనా సరైన నిత్యావసరాలు కూడా లేని ఒక చిన్న గ్రామంలో పట్టుదలతో ఇంతటి ఎలక్ట్రిక్ బైక్ తయారుచేయడం నిజంగా ప్రశంసనీయం.
Source: Etv Bharat