Just In
- 6 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 9 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 11 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 15 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి
ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. దేశవ్యాప్తంగా ప్రతి రోజు కొన్ని వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో మనం నిత్యజీవితంలో చూస్తూనే ఉన్నాం.
ఇలాంటి నేపథ్యంలోనే ఇటీవల ఒక వీడియో వెలువడింది. ఇందులో ట్రాఫిక్ సిగ్నెల్స్ క్రాష్ చేసిన రెండు వాహనాలు ఏ విధంగా దెబ్బ తింటాయో మీరు ఇక్కడ చూడవచ్చు.
నివేదికల ప్రకారం ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగినట్లు తెలిసింది. ట్రాఫిక్ సిగ్నెల్ పడిన సమయంలో వాహనాలు వాటిని ఉల్లంఘిస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియ చెప్పడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది.
ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ట్రాఫిక్ సిగ్నెల్ లో సిగ్నెల్ పడినప్పుడు, అది ఏమాత్రం పట్టించుకోకుండా ఒక మహీంద్రా బొలెరో పిక్-అప్ మరియు మారుతి సుజుకి ఈకో రోడ్డు దాటుతున్నాయి. అదే సమయంలో అటుగా వస్తున్న ఒక లారీ ఢీ కొట్టింది. ఈ సంఘనటనలో మహీంద్రా బొలెరో పిక్-అప్ మరియు మారుతి సుజుకి ఈకో రెండు భారీగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన మే 31న జరిగినట్లు ఇక్కడ చూడవచ్చు.
MOST READ:సూపర్ కారుతో కబాబ్ తయారు చేసిన యువకుడు.. చివరకు ఏమైందంటే?
ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న డ్రైవర్లు భారీగా గాయాలపాలైనట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ రెడ్ సిగ్నెల్ పడిన సమయంలో కూడా మహీంద్రా బొలెరో పిక్-అప్ మరియు మారుతి సుజుకి ఈకో రోడ్డు క్రాష్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అటుగా వస్తున్న లారీ ట్రాఫిక్ సిగ్నెల్స్ అనుసరించి వచ్చింది. కావున లారీ డ్రైవర్ డి తప్పులేదని మనం ఇక్కడ గుర్తించవచ్చు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ వర్షం కురుస్తుంది. కావున వర్షంలో వాహనాలను కంట్రోల్ చేయడం అనేది కొంతవరకు కష్టతరంగా ఉంటుంది. కావున వాహనదారులు ఈ వీడియో చూసైనా ఇలాంటి సంఘటనలు పాల్పడకుండా ఉండాలని పోలీసులు తెలిపారు.
MOST READ:ఉక్కు మనిషికి వద్దకు ఈవీలకు మాత్రమే ఎంట్రీ; పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ!
భారతదేశంలో దాదాపు అన్ని ప్రధానమైన కూడళ్లలో ఇప్పటికే చాలా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కెమెరాల వల్ల సులభంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిని గుర్తించి వారికి ఈ చలాన్లు జారీ చేయబడుతున్నాయి. అయినప్పటికీ ఈ రోజుకి కూడా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు.
వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో వీలైనంతవరకు తక్కువ వేగంతో వెళ్లడం మంచిది. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నెల్స్ లో ఎక్కువమంది వాహనదారులు చాలా తొందరగా వెళ్లాలని చాలా ఆతృతగా ఉంటారు. కావున ఈ సమయంలో ఒకరిని మించి ఒకరు ముందుగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో ప్రమాదాలు జరుగుతాయి.
MOST READ:ఔరా.. ఏమిటీ విచిత్రం.. 15 కేజీల స్కూటర్ తరలించడానికి 7,500 కేజీల ట్రక్కు
ఇప్పుడు చాలా మెట్రోపాలిటన్ నగరాల్లో సిసిటివి నెట్వర్క్ ఉంది. దీనిని పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తుంది. రిజిస్ట్రేషన్ నంబర్ను ట్రాక్ చేయడం ద్వారా ఉల్లంఘన ఆధారంగా పోలీసులు చలాన్ జారీ చేస్తారు. ఇటీవలి కాలంలో, చలాన్ మొత్తాన్ని పెంచడానికి ప్రభుత్వం మరియు అధికారులు చాలా కృషి చేస్తున్నారు.
వాహదారులు ఎప్పటికప్పుడు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడే ప్రమాదాల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారులందరికి తప్పకుండా ఈ వీడియో ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది.