కడప To సింగపూర్ సిటీ బస్సు సర్వీసు: ఏది రియల్ ఏది వైరల్
సోషల్ మీడియా పుణ్యమా అని నిజమైనా... అబద్దమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. తాజాగా కడప బస్సు డిపో నుండి సింగపూర్ సిటీకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు నేమ్ బోర్డు ఉన్న ఓ ఆర్టీసీ బస్సు ఫోటో ఇంటర్
సోషల్ మీడియా పుణ్యమా అని నిజమైనా... అబద్దమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. తాజాగా కడప బస్సు డిపో నుండి సింగపూర్ సిటీకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు నేమ్ బోర్డు ఉన్న ఓ ఆర్టీసీ బస్సు ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి సింగపూర్కు ఇంకా విమాన సర్వీసులే షురూ కాలేదు. అలాంటిది కడప డిపో నుండి సింగపూర్ సిటీకి బస్సు సర్వీసు మొదలయ్యింది. మరి ఇందులో నిజమెంతో... అబద్దం ఎంతో... కడప నగర వాసులకు మరియు కడప ఏపీఎస్ఆర్టీ డిపో నిర్వాహకులకే తెలియాలి.

బోర్డు చూసిన మొదట్లో నిజంగానే కడప నుండి సింగపూర్ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి బస్సు సర్వీసు నడుపుతున్నారని పొరబడవచ్చు. కానీ పాత బస్టాండు - సింగపూర్ సిటీ వయా: పాత రిమ్స్, సంధ్యా సర్కిల్, యర్రముక్క పల్లి, కొత్త కలెక్టర్ ఆఫీస్, కొత్త రిమ్స్ అని ఉండటంతో ఇది కడప చుట్టప్రక్కల తిరిగే సర్వీస్ అని అనుకోవచ్చు.

ఇంకొందరేమే, సింగపూరు లేదు... జపాన్ లేదు... ఎవరో బోర్డు మీదున్న పేరును తీసేసి సింగపూర్ సిటీ అనే పేరుతో ఎడిటింగ్లో తమ టాలెంట్ చూపించారని అంటున్నారు. మరి ఇందులో ఏది రియల్...? ఏది వైరల్...?
మీకు తెలిస్తే క్రింది కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి



Click it and Unblock the Notifications








