Just In
- 15 min ago క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 14 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 15 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 18 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
Don't Miss
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
4,200 వాహనాలను సీజ్ చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా..?
భారత దేశంలో కరోనా వైరస్ వల్ల దేశం మొత్తమ్ దాదాపు 21 రోజుల లాక్ డౌన్ విధించబడింది. కానీ రోజు రోజుకి ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉండటం వల్ల ఈ లాక్ డౌన్ వ్యవధిని మే 3 వరకు పొడిగించి భారత ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసింది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. కానీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ని పాక్షికంగా సడలిస్తున్నారు. కరోనా ఎక్కువగా ఉండటం చేత కర్ణాటకలో లాక్ డౌన్ ఇప్పటికి అమలులో ఉంది.
భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా, లాక్ డౌన్ ని ఉల్లంఘించిన వాహనదారుల వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కర్ణాటకలో లాక్ డౌన్ చాలా కఠినంగా పాటిస్తున్నారు. అంతే కాకుండా వేలాది వాహనాలను బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర నగరాల పోలీసులు కూడా వాహనాలను జప్తు చేస్తున్నారు.
కల్బర్గి పోలీసులు ఇప్పటివరకు సుమారు 4200 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కల్బుర్గి నగరంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి పోలీసులు ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు. కల్బుర్గి డిసిపి దీని గురించి మాట్లాడుతూ నిబంధనను ఉల్లంఘించిన వాహనదారుల వాహనాలను మే 3 వరకు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు.
MOST READ:మీ అభిమాన బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ ఇకపై లేనట్టే, ఎందుకో తెలుసా..?
లాక్ డౌన్ ప్రారంభంలో బెంగళూరు పోలీసులు 7000 కి పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు బయట ఉన్న వాహనాలను ట్రాక్ చేస్తున్నారు మరియు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
కేరళలోని అనేక జిల్లాల్లో వాహనాల రాకపోకలకు అనుమతి కలిపించారు. అంతే కాకుండా వాహనాల సంఖ్యను పరిమితం చేయడానికి సరి బేసి నిబంధన అమలు చేయబడింది. ప్రజలు అవసరమైన పని కోసం మాత్రమే బయటకు రావాలని సూచించారు.
MOST READ:గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో రూ. 5000
కర్ణాటకలో ప్రభుత్వం వాహనాల సేవలన్నింటిని రద్దు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ఆదేశిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు కఠినంగా శిక్షిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా వాహన వినియోగం రద్దు కావడం వల్ల ప్రజలు తమకు అవసరమైన నిత్యావసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నారు. ఇటీవల బెంగళూరుఐ చెందిన పోలీసు కానిస్టేబుల్ ఒక క్యాన్సర్ రోగికి మందులు అందించడానికి అందించడానికి యాక్టివాలో దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణించారు.
MOST READ:కోవిడ్-19 టెస్ట్ కోసం తిరంగ ప్రాజెక్టును ప్రారంభించిన కేరళ గవర్నమెంట్
కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ విజయవంతం కావడానికి రాష్ట్ర పోలీసులు అహ్రర్నిశలు చాలా కష్టపడుతున్నారు. త్వరలో లాక్ డౌన్ పూర్తిగా తొలగించనున్నారు.