4,200 వాహనాలను సీజ్ చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

భారత దేశంలో కరోనా వైరస్ వల్ల దేశం మొత్తమ్ దాదాపు 21 రోజుల లాక్ డౌన్ విధించబడింది. కానీ రోజు రోజుకి ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉండటం వల్ల ఈ లాక్ డౌన్ వ్యవధిని మే 3 వరకు పొడిగించి భారత ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసింది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. కానీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ని పాక్షికంగా సడలిస్తున్నారు. కరోనా ఎక్కువగా ఉండటం చేత కర్ణాటకలో లాక్ డౌన్ ఇప్పటికి అమలులో ఉంది.

4,200 వాహనాలను సీజ్ చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా, లాక్ డౌన్ ని ఉల్లంఘించిన వాహనదారుల వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కర్ణాటకలో లాక్ డౌన్ చాలా కఠినంగా పాటిస్తున్నారు. అంతే కాకుండా వేలాది వాహనాలను బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని ఇతర నగరాల పోలీసులు కూడా వాహనాలను జప్తు చేస్తున్నారు.

4,200 వాహనాలను సీజ్ చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

కల్బర్గి పోలీసులు ఇప్పటివరకు సుమారు 4200 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కల్బుర్గి నగరంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి పోలీసులు ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు. కల్బుర్గి డిసిపి దీని గురించి మాట్లాడుతూ నిబంధనను ఉల్లంఘించిన వాహనదారుల వాహనాలను మే 3 వరకు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు.

4,200 వాహనాలను సీజ్ చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

లాక్ డౌన్ ప్రారంభంలో బెంగళూరు పోలీసులు 7000 కి పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు బయట ఉన్న వాహనాలను ట్రాక్ చేస్తున్నారు మరియు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

4,200 వాహనాలను సీజ్ చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

కేరళలోని అనేక జిల్లాల్లో వాహనాల రాకపోకలకు అనుమతి కలిపించారు. అంతే కాకుండా వాహనాల సంఖ్యను పరిమితం చేయడానికి సరి బేసి నిబంధన అమలు చేయబడింది. ప్రజలు అవసరమైన పని కోసం మాత్రమే బయటకు రావాలని సూచించారు.

4,200 వాహనాలను సీజ్ చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

కర్ణాటకలో ప్రభుత్వం వాహనాల సేవలన్నింటిని రద్దు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ఆదేశిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు కఠినంగా శిక్షిస్తున్నారు.

4,200 వాహనాలను సీజ్ చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

దేశ వ్యాప్తంగా వాహన వినియోగం రద్దు కావడం వల్ల ప్రజలు తమకు అవసరమైన నిత్యావసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నారు. ఇటీవల బెంగళూరుఐ చెందిన పోలీసు కానిస్టేబుల్ ఒక క్యాన్సర్ రోగికి మందులు అందించడానికి అందించడానికి యాక్టివాలో దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణించారు.

4,200 వాహనాలను సీజ్ చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ విజయవంతం కావడానికి రాష్ట్ర పోలీసులు అహ్రర్నిశలు చాలా కష్టపడుతున్నారు. త్వరలో లాక్ డౌన్ పూర్తిగా తొలగించనున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 22, 2020, 12:51 [IST]
English summary
Kalaburgi police seized 4200 vehicles for violating Corona virus lockdown ruels. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+