Just In
- 6 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 9 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 11 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 15 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
లాక్డౌన్ రూల్స్ గాలికొదిలేసిన ముఖ్యమంత్రి కొడుకు.. ఎవరో తెలుసా..?
భారతదేశంలో కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ మునుపటి కరోనా మొదటి దశకంటే కంటే కూడా వేగంగా సంక్రమిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మరి భారీ నుంచి ప్రజలను రక్షించడానికి మరియు ఈ వైరస్ యొక్క వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలతో లాక్ డౌన్ విధించాయి.
భారతదేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. కావున కర్ణాటక రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ అమలు చేయబడింది. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజారవాణా వంటి ట్రాఫిక్ పూర్తిగా నిషేధించబడింది. అయితే అత్యవసర సమయంలో మాత్రమే ప్రజలు బయటకు రావడానికి అనుమతించబడింది.
ఈ లాక్ డౌన్ ఉల్లంఘించిన ప్రజలపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు మరియు వారి బంధువులు ఈ లాక్ డౌన్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప కుమారుడు బి.వై.విజేంద్ర యడ్యూరప్ప లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
MOST READ:అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు వెనక్కి.. కారణం ఏమంటే?
కరోనా లాక్ డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ, తన మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ కారులో నంజాంగుడ్ లోని శ్రీకంటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సంఘటన గత మంగళవారం జరిగినట్లు నివేదికలద్వారా తెలిసింది. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన రాజకీయ నాయకుల పిల్లలపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో ఆలయాలన్నీ దాదాపు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సంక్రమణ తగ్గించడానికి చాలా వరకు దేవాలయాలు మూసివేయబడ్డాయి. కానీ ఈ నియమాలు ఉన్నత వర్గాలకు వర్తించవు అనే విషయం ముఖ్యమంత్రి కుమారుడి ప్రవర్తనకు నిదర్శనం.
MOST READ:కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే
కరోనా సంక్రమణను నివారించడానికి 2021 మే 24 ఉదయం 6 గంటల నుంచి కర్ణాటకలో లాక్డౌన్ అమలు చేయబడింది. ప్రస్తుతం మరింత ఎక్కువగా ఉన్న కరోనా కేసుల కారణంగా ఈ లాక్ డౌన్ వ్యవధి మరింత పొడిగించబడింది. మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ కారులో తన భార్యతో కలిసి నంజన్గుడ్ ఆలయాన్ని బివై విజయేంద్ర సందర్శించారు.
విజయేంద్ర అనేక జిల్లాలను దాటి నంజాంగుడ్ సందర్శించారు. డిప్యూటీ ముఖ్యమంత్రులు విజయేంద్ర, ఆయన భార్య కోవిడ్ నుంచి కోలుకోవాలని ప్రార్థించడానికి వెళ్లినట్లు తెలిసింది. దేశం నుండి కరోనా నిర్మూలించడానికి పూజలు జరిగాయని వారు పేర్కొన్నాడు. ఒక వైపు, కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా మరియు బయటి వ్యక్తుల వాహనాలను జప్తు చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తోంది.
MOST READ:ఈ మినీ క్యాంపర్తో మీ క్యాంపింగ్ను మరింత సరదాగా మార్చుకోండి!
మరోవైపు రాజకీయ నాయకుల బంధువులు బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అంతే కాకుండా వారు పేస్ మాస్క్ వంటివి కూడా ధరించరు. విజయేంద్ర నంజాంగుడ్ ఆలయాన్ని సందర్శించినప్పుడు తగిన భద్రతలు పాటించారని తెలిపారు.
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా క్యాబ్లు, టాక్సీలు, ఆటో రిక్షాలు, బస్సులు, మెట్రోలు మరియు ఇతర ప్రైవేట్ వాహనాలను మే 24 వరకు కర్ణాటకలో నిషేధించారు. అయితే, ఈ సమయంలో ట్రైన్ మరియు విమాన రాకపోకలు అనుమతించబడతాయి. విమానాల్లో మరియు ట్రైన్లలో ప్రయాణించాలనుకునేవారు తప్పకుండా టికెట్ చూపించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రయాణానికి అనుమతించడతారు.
MOST READ:ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?
NOTE: ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే