Just In
- 50 min ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 1 hr ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 3 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 5 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
Don't Miss
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Movies Adivi Sesh: "అకీరాతో స్నేహం అలా కుదిరింది.. కచ్చితంగా అతడితో సినిమా చేస్తా"
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గుడ్ న్యూస్ చెప్పిన కర్ణాటక గవర్నమెంట్, ఏంటో తెలుసా..?
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపించడం వల్ల దాదాపు నెల రోజులకుపైగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. ఈ కారణంగా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. కాబట్టి భారత ప్రభుత్వం కరోనా వైరస్ కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాలలో లాక్ డౌన్ నుంచి కొన్ని సేవలకు మినహాయింపు ఇచ్చారు. కాబట్టి కొన్ని సంస్థలకు లాక్ డౌన్ నుంచి బయట పడ్డాయి. ఇందులో భాగంగా కొన్ని చిన్నపాటి కర్మాగారాలు కూడా తెరుచుకున్నాయి.
సాధారణంగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా వాహన సేవలు రద్దు చేయబడ్డాయి. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకోసం ప్రత్యేక బస్సు సౌకర్యాలు కల్పించడానికి కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక జోన్ (సెజ్) మరియు వ్యవసాయ రంగంలోని పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చింది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 24 తర్వాత తొలిసారిగా 2,500 కు పైగా సంస్థలు ప్రారంభమవుతున్నప్పటికీ, కార్మికుల కొరత ఉంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడటానికి ముందు చాలా కంపెనీలు ముందు జాగ్రత్త చర్యగా కార్యకలాపాలను నిలిపివేసాయి.
MOST READ:మెర్సిడెస్ బెంజ్ విడుదలచేయనున్న ఎలక్ట్రిక్ కార్ : ఇక్యూసి
లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఈ కర్మాగారాల్లోని కార్మికులు మరియు సిబ్బంది తమ ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. బస్సులు, ట్రైన్లు మరియు విమానయాన సేవలు రద్దు చేయబడ్డాయి. దీనివల్ల కార్మికులు కర్మాగారాలకు తిరిగి రావడం కష్టమవుతుంది.
వచ్చే వారం నుండి రాష్ట్రంలో మరో 3 వేల కర్మాగారాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సంస్థలు ప్రారంభించడం వల్ల మళ్ళీ కార్మికుల కొరత ఉంటుంది. ఈ పరిస్థితిని బట్టి కార్మికులను తిరిగి పనిలోకి తీసుకురావడానికి రవాణా సదుపాయం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
MOST READ:లాక్డౌన్ లో ఇల్లుచేరుకోవడానికి 3 లక్షలు పైగా ఖర్చుపెట్టిన వ్యక్తి, ఎలా వెళ్ళాడో తెలుసా ?
అనేక సంస్థలు తమ కార్మికులను తిరిగి తీసుకురావడానికి ప్రత్యేక సౌకర్యాలను అందిస్తున్నాయి, అని ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. కంపెనీలకు సహాయం చేస్తామని కర్ణాటక ప్రభుత్వం కూడా తెలిపింది.
ఎప్పటిలాగే పరిశ్రమలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రతిపాదన చేసినట్లు వాణిజ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం విద్యుత్ మరియు నీటి బిల్లులు మరియు కొన్ని పన్నులకు మినహాయింపు ఇస్తుంది.
పారిశ్రామికవేత్తలు 2,500 పారిశ్రామిక యూనిట్ల కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి కోరుతున్నారు. కరోనా వైరస్ సంక్రమణకు భయపడి కార్మికులు కర్మాగారాలకు రానందున చాలా కర్మాగారాలు ఇంకా ప్రారంభం కాలేదు. కానీ త్వరలో కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయినట్లైతే కర్మాగారాలన్నీ మల్లి పునఃప్రారంభం కానున్నాయి.