Just In
- 7 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 8 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 9 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 9 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- Movies ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కర్ణాటకలో ప్రారంభం కానున్న నైట్ కర్ఫ్యూ; కొత్త రూల్స్ & టైమింగ్స్ ఇవే
కరోనా మహమ్మారి భారతదేశంలో చాలా వేగంగా వ్యాపిస్తోంది.ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య మరింత పెరుగుతున్న తరుణంలో, దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మరి వ్యాప్తిని తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న నగరాల్లో ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించబడింది.
రోజురోజుకి పెరుగుతున్న కరోనా వైరస్ నివారించడానికి ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందు జాగ్రత్త చర్యలు కూడా అమలు చేసింది. ఇందులో భాగంగానే కర్ణాటకలో ఏప్రిల్ 10 నుండి 20 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ సమయంలో కఠినమైన నిబంధనలు అమల్లో ఉంటాయి.
కర్ణాటకలో విధించనున్న ఈ నైట్ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమై ఉదయం 5 గంటల వరకు ఉంటుంది. అదికూడా బెంగళూరుతో సహా మైసూర్, మంగళూరు, తుమ్కూర్, బీదర్, కలబురగి, ఉడిపి మరియు మణిపాల్ జిల్లాలలో నైట్ కర్ఫ్యూ ఉంటుంది. ఈ సమయంలో అవసరమైన సర్వీసులు మినహా మిగిలినవన్నీ పూర్తిగా నిషేధించబడుతుంది.
MOST READ:వావ్.. ఎంజి సైబర్స్టర్ సూపర్ కార్.. మైండ్బ్లోయింగ్
ఈ నైట్ కర్ఫ్యూతో ఎమర్జెన్సీ సర్వీస్ వాహనాలకు తప్పి ఇతర వాహనాలకు చోటు ఉండదు. అంతే కాకుండా ఈ సమయంలో ఎమర్జెన్సీ పాస్ లు కూడా జరీ చేయబడవు. అయితే ఈ సమయంలో ట్రైన్ జర్నీ మరియు విమాన ప్రయాణానికి అనుమతి ఉంది. కానీ దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ చూపించాలి.
కరోనా ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ప్రజలు కూడా ఈ నియమాలకు కట్టుబడి ఉండాలి. ఏదైనా అవసరాలు ఉంటే వీలైనంత వరకు పగటి పూట పూర్తి చేసుకోవడం చాలా వరకు మంచిది. ఎదుకంటే ఈ మహమ్మారి వ్యాప్తి చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీనిని నివారించడానికి ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకోకతప్పదు.
MOST READ:సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది
కావున ప్రజలు దీనిని దృష్టిలో ఉంచుకోవడం మంచిది. ఈ నియమాలను ఉల్లంఘించినట్లైతే వారి వాహనాలు జప్తుచేయబడతాయి. అంతే కాకుండా జరిమానాలు కూడా విధించబడతాయి.
గత ఏడాది ఇలాంటి సమయంలోనే పోలీసులు వేల సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా అధికంగా వ్యాపిస్తున్న కరోనా నివారణ కోసం విధించిన ఈ లాక్ డౌన్ ఉల్లంఘిస్తే మునుపటి లాగే చర్యలు తీసుకుంటారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులకు సహకరిస్తూ కరోనా నివారణలో పాలు పంచుకోవాలి. అప్పుడే కరోనాను నివారించడం సులభం అవుతుంది.
MOST READ:పెట్రోల్ బంక్లో కొత్త రూల్.. అది ఉంటేనే ఇకపై పెట్రోల్