నగదు రహిత లావీదేవీలకు మొదటి సైడ్ ఎఫెక్ట్: మీకు తెలుసా ?
దేశవ్యాప్తంగా నగదు రహిత లావీదేలపై జరిగిన ప్రచారం అంతా ఇంత కాదు. మొత్తానికి నగదు రహిత లావాదేవీలకు ప్రజలు కొద్ది కొద్దిగా అలవాటు పడ్డారు.
దేశవ్యాప్తంగా నగదు రహిత లావీదేలపై జరిగిన ప్రచారం అంతా ఇంత కాదు. మొత్తానికి నగదు రహిత లావాదేవీలకు ప్రజలు కొద్ది కొద్దిగా అలవాటు పడ్డారు. అందులో ఒకరు కర్ణాటకకు చెందిన డాక్టర్ రావు. అయితే ఒక్కసారి ఉలిక్కిడే రీతిలో తన మొబైల్ ఫోన్కు మీ కార్డు ద్వారా నాలుగు లక్షల రుపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటూ మెసేజ్ వచ్చింది. నగదు రహిత లావాదేవీలకు మొదటి సైడ్ ఎఫెక్ట్ అని చెప్పవచ్చు.

నాలుగు లక్షలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్ ఏంటి, అనుకుంటున్నారా....? అసలు విషయం తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. కర్ణాటకలోని కొచ్చి-ముంబాయ్ జాతీయ రహదారి మీద గుండ్మి అనే టోల్ గేట్ వద్ద రూ. 40 కోసం కార్డు స్వైప్ చేసాడు డాక్టర్ రావు.

కొద్ది దూరం వెళ్లిన తరువాత తన చరవాణికి వచ్చిన మెసేజ్ చూసి కంగుతిన్నాడు. బ్యాంక్ అలర్ట్స్ రూపంలో వచ్చిన మెసేజ్లో మీ కార్డును ఉపయోగించి నాలుగు లక్షలు స్వైప్ చేశారనే సమాచారం వచ్చింది.

ఊహించిన సంఘటన కర్ణాటకలోని ఉడుపి జాతీయ రహదారి ప్రాంత పరిధిలో రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో చోటు చేసుకుంది. ముంబాయ్కి వెళుతున్న కారులో డాక్టర్ మరియు డ్రైవర్ ఉన్నాడు. టోల్ ఫీజు రూ. 40 చెల్లించాల్సి ఉండగా డాక్టర్ తన డెబిట్ కార్డ్ ఇవ్వడం జరిగింది.

కొంత దూరం వెళ్లిన తరువాత సెల్ ఫోన్కు వచ్చిన మెసేజ్ చూసి ఉలిక్కిపడ్డాడు. వెంటనే టోల్ సిబ్బంది ఇచ్చిన రసీదు పరిశీలిస్తే అందులో కూడా నాలుగు లక్షలు చెల్లించినట్లు ఉంది.

ఈ విశయమై వెనక్కి వచ్చి టోల్ సిబ్బందిని ప్రశ్నిస్తే ఇది మా తప్పిదం కాదు, దీనికి మాకు ఎలాంటి సంభందం లేదని చెప్పి, దానికి మేము బాధ్యులం కాదంటూ, చేసిన తప్పును తిరస్కరించారు.

అయితే డాక్టర్ రావు సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన మోసం గురించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే టోల్ సిబ్బందిని విచారిస్తే, మా తప్పిదం ద్వారానే ఇలా జరిగిందని అంగీకరించి తిరిగివ్వాల్సిన సొమ్ము ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

సుమారుగా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో టోల్ బూత్ సీనియర్ అధికారులను సంప్రదించి రూ. 9,99,960 లను బాధితుడికి చెల్లించారు. ఇలా పొరబాటున జరిగిందా... లేదంటే కావాలనే మోసం చేశారా... అనే దాన్ని గాలికి వదిలేశారు.

నిజానికి రూ. 40 కోసం నాలుగు మరియు ఒక్క సున్నా ఎంటర్ చేస్తే సరిపోతుంది. అలాంటి నాలుగు లక్షలకు ఎన్ని సున్నాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే టోల్ సిబ్బందం తేడాను గమనించవచ్చు. ఒకవేళ ఎక్కువ సున్నాలు ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతే ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేయవచ్చు కదా... వారికి దీని గురించి ముందే తెలియకపోతే రసీదు చూడకుండానే దానికి మేము భాద్యులం కాదు అని ఫిరాయించడం ఏమిటి... ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుత్తాయి.

పాఠకులారా...! క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ జరిపే ప్రతిచోటా జాగ్రత్తగా వ్యవహరించండి. చెల్లింపు జరిపిన తరువాత రసీదును గమనించి ఇవ్వాల్సిన మొత్తానికి సమానమైన చెల్లింపును గమనించండి.

వరల్డ్ వార్-IIలో హిట్లర్ వినియోగించిన ట్యాంక్ మోటార్ సైకిల్
ట్యాక్సీలో పాపను వదిలేసి ఫ్లయిట్ ఎక్కడానికి సిద్దమైన జంట!!


Click it and Unblock the Notifications








