మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

దక్షిణ భారతదేశంలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇందులో కర్ణాటక కూడా ఒకటి. కర్ణాటకలో పర్యాటకులు చూడదగిన ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. మైసూర్ ఎప్పుడూ పర్యాటకులతో నిండి ఉంటుంది. మైసూర్ నగరంలో మైసూర్ మహారాజా ప్యాలెస్, లలిత్ మహల్ ప్యాలెస్, జూ మరియు చాముండి హిల్ మొదలైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

సాంస్కృతిక నగరంగా విరాజిల్లుతున్న మైసూర్ పర్యాటక రంగంపై మరింత ఆకర్షణ కలిగించడానికి ఇప్పుడు 'అంబారి' అనే డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. మైసూర్‌లో పర్యాటక అభివృద్ధికి గత బడ్జెట్ ప్రాధాన్యతలో కర్ణాటక ప్రభుత్వం లండన్ బిగ్ బస్ మోడల్‌పై 6 డబుల్ డెక్కర్ ఓపెన్ బస్ సర్వీసును ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి 5 కోట్ల గ్రాంట్ కూడా విడుదల చేసింది.

మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

అంబారి బస్ సర్వీసును కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రారంభించింది. డబుల్ డెక్కర్ బస్సులను నైపుణ్యం కలిగిన సంస్థలు రూపొందించాయి, ఇవి త్వరలో రహదారిపైకి వస్తాయి.

మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

ఈ డబుల్ డెక్కర్ అంబారి బస్సులో మొత్తం 40 సీట్లు ఉన్నాయి, వీటిలో దిగువ డెక్‌లో 20 మరియు ఎగువ డెక్‌లో 20 ఉన్నాయి. దిగువ డెక్‌లోని 20 సీట్లలో ఎసి ఉంటుంది. ఎగువ డెక్‌లోని 20 సీట్లు పూర్తిగా ఓపెన్ లోనే ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల ప్రయాణికులు తమ ప్రయాణంలో కూడా ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

ఈ అంబారీ డబుల్ డెక్కర్ బస్ సర్వీస్ మైసూర్ ప్యాలెస్, మైసూర్ జూ, మైసూర్ విశ్వవిద్యాలయం, సెయింట్ ఫిలోమెనా చర్చి, జిల్లా కలెక్టర్ కార్యాలయం గుండా ప్రయాణిస్తుంది. ప్రతి బస్సు పర్యటన వ్యవధి ఒకటిన్నర గంటలు. ఈ కాలంలో, ప్రతి ప్రయాణికుడికి బస్సు లోపల ఉన్న మానిటర్లలో ఆడియో మరియు వీడియో ద్వారా తెలియజేస్తారు.

మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

ప్రయాణీకుల భద్రత కోసం ప్రతి బస్సులో సిసిటివిలను ఏర్పాటు చేస్తారు. ఈ అంబారి డబుల్ డెక్కర్ బస్సు సాంస్కృతిక నగరం మైసూర్ పర్యాటకానికి మరింత తోడ్పడుతుంది. అంబారీ బస్సు సజావుగా నడపడానికి బస్సు మార్గంలో ఎలక్ట్రిక్ వైర్ మరియు చెట్ల కొమ్మలను తొలగించారు. ప్రతి అరగంటకు అంబారీ బస్సు అందుబాటులో ఉంటుంది.

మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

మైసూర్ నగరంలో ప్రారంభమైన ఈ డబుల్ డెక్కర్ బస్ టికెట్ ధర రూ. 250. ఒకప్పుడు డబుల్ డెక్కర్ హైదరాబాద్ నగరంలో కూడా వినియోగంలో ఉండేవి, కానీ కాలక్రమేణా కొన్ని అనివార్య కారణాల వల్ల వీటి వాడకం తగిపోయింది. ఇటీవల మళ్ళీ ఇవి పురుడు పోసుకుంటున్నాయి.

గమనిక : ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

More from DriveSpark

Article Published On: Wednesday, March 3, 2021, 9:29 [IST]
English summary
Karnataka Tourism department Starts Double Decker Ambari Bus Service In Mysuru. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+