Just In
- 1 hr ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 2 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 4 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
- 5 hrs ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
Don't Miss
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మైసూర్లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు
దక్షిణ భారతదేశంలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇందులో కర్ణాటక కూడా ఒకటి. కర్ణాటకలో పర్యాటకులు చూడదగిన ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. మైసూర్ ఎప్పుడూ పర్యాటకులతో నిండి ఉంటుంది. మైసూర్ నగరంలో మైసూర్ మహారాజా ప్యాలెస్, లలిత్ మహల్ ప్యాలెస్, జూ మరియు చాముండి హిల్ మొదలైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
సాంస్కృతిక నగరంగా విరాజిల్లుతున్న మైసూర్ పర్యాటక రంగంపై మరింత ఆకర్షణ కలిగించడానికి ఇప్పుడు 'అంబారి' అనే డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. మైసూర్లో పర్యాటక అభివృద్ధికి గత బడ్జెట్ ప్రాధాన్యతలో కర్ణాటక ప్రభుత్వం లండన్ బిగ్ బస్ మోడల్పై 6 డబుల్ డెక్కర్ ఓపెన్ బస్ సర్వీసును ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి 5 కోట్ల గ్రాంట్ కూడా విడుదల చేసింది.
అంబారి బస్ సర్వీసును కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రారంభించింది. డబుల్ డెక్కర్ బస్సులను నైపుణ్యం కలిగిన సంస్థలు రూపొందించాయి, ఇవి త్వరలో రహదారిపైకి వస్తాయి.
MOST READ:2021 ఫిబ్రవరిలో పుంజుకున్న మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!
ఈ డబుల్ డెక్కర్ అంబారి బస్సులో మొత్తం 40 సీట్లు ఉన్నాయి, వీటిలో దిగువ డెక్లో 20 మరియు ఎగువ డెక్లో 20 ఉన్నాయి. దిగువ డెక్లోని 20 సీట్లలో ఎసి ఉంటుంది. ఎగువ డెక్లోని 20 సీట్లు పూర్తిగా ఓపెన్ లోనే ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల ప్రయాణికులు తమ ప్రయాణంలో కూడా ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.
ఈ అంబారీ డబుల్ డెక్కర్ బస్ సర్వీస్ మైసూర్ ప్యాలెస్, మైసూర్ జూ, మైసూర్ విశ్వవిద్యాలయం, సెయింట్ ఫిలోమెనా చర్చి, జిల్లా కలెక్టర్ కార్యాలయం గుండా ప్రయాణిస్తుంది. ప్రతి బస్సు పర్యటన వ్యవధి ఒకటిన్నర గంటలు. ఈ కాలంలో, ప్రతి ప్రయాణికుడికి బస్సు లోపల ఉన్న మానిటర్లలో ఆడియో మరియు వీడియో ద్వారా తెలియజేస్తారు.
MOST READ:కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము.. చివరికి ఎం జరిగిందంటే ?
ప్రయాణీకుల భద్రత కోసం ప్రతి బస్సులో సిసిటివిలను ఏర్పాటు చేస్తారు. ఈ అంబారి డబుల్ డెక్కర్ బస్సు సాంస్కృతిక నగరం మైసూర్ పర్యాటకానికి మరింత తోడ్పడుతుంది. అంబారీ బస్సు సజావుగా నడపడానికి బస్సు మార్గంలో ఎలక్ట్రిక్ వైర్ మరియు చెట్ల కొమ్మలను తొలగించారు. ప్రతి అరగంటకు అంబారీ బస్సు అందుబాటులో ఉంటుంది.
మైసూర్ నగరంలో ప్రారంభమైన ఈ డబుల్ డెక్కర్ బస్ టికెట్ ధర రూ. 250. ఒకప్పుడు డబుల్ డెక్కర్ హైదరాబాద్ నగరంలో కూడా వినియోగంలో ఉండేవి, కానీ కాలక్రమేణా కొన్ని అనివార్య కారణాల వల్ల వీటి వాడకం తగిపోయింది. ఇటీవల మళ్ళీ ఇవి పురుడు పోసుకుంటున్నాయి.
MOST READ:భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య
గమనిక : ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే