Just In
- 12 hrs ago రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- 15 hrs ago మార్కెట్లో వీటికి తిరుగే లేదు.. కొత్త బైక్ కొనాలనుకుంటే ఈ లిస్ట్ అస్సలు మిస్ అవ్వకండి
- 17 hrs ago వారెవ్వా.. యూట్యూబర్స్ వాడే కార్లు ఇలా ఉన్నాయా!.. ఓ లుక్కేసుకోండి
- 17 hrs ago రూ. 10 లక్షల లోపు ధరలో విడుదల కాబోతున్న ప్రముఖ బ్రాండ్ల కార్లు ఇవే..
Don't Miss
- Movies Guppedantha Manasu March 19th: మనును కాలేజీ నుంచి వెళ్లగొట్టిన వసు, అనుపమ.. తప్పు తెలుసుకోగలరా?
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ట్రాఫిక్ ఫైన్ అడిగితే మంగళ సూత్రం ఇచ్చిన మహిళ.. ఇది ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే
భారతదేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో భాగంగా రోడ్డుప్రమాదాలను తగ్గించడానికి దేశం మొత్తం కఠినమైన ట్రాఫిక్ నియమాలు అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు విరుచుకుపడుతున్నారు.
వాహనాలలో ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ కలిగి ఉండాలి. అప్పుడే ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ రూల్స్ అన్నింటిని వాహనదారులు పక్కనపెడుతున్నారు. ఈ కారణంగా పోలీసులు వీరికి భారీ జరిమానాలు విధిస్తున్నారు.
ఇటీవల కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో బైక్ పై వెళ్తున్న ఒక జంట హెల్మెట్ ధరించకపోవడంతో వారికి ట్రాఫిక్ పోలీస్ 500 జరిమానా విధించాడు. ట్రాఫిక్ పోలీస్ విధించిన జరిమానా చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో మహిళ తన మెడలోని మంగళసూత్రం తీసి ఇచ్చింది.
నివేదికల ప్రకారం కర్ణాటకలోని బెల్గావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హుక్కేరి పట్టణానికి చెందిన 30 సంవత్సరాల భారతి గత వారం తన భర్తతో కలిసి మోటార్ సైకిల్పై మార్కెట్కు వెళ్లారు. వారి వద్ద కేవలం 1800 రూపాయలు ఉండగా, అందులో 1700 రూపాయలకు ఒక మంచం కొన్నారు. మిగిలిన 100 రూపాయలతో టిఫిన్ చేశారు.
మార్కెట్ నుంచి తిరిగి మోటార్ సైకిల్పై ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో ట్రాఫిక్ పోలీస్ ఆపి, వారికి హెల్మెట్ లేకపోవడం వల్ల 500 రూపాయలు ఫైన్ వేసాడు. అయితే తమ వద్ద డబ్బులు లేవని, ఉన్న డబ్బు మొత్తం ఖర్చయిపోయిందని ఆ దంపతులు ట్రాఫిక్ పోలీసుకి చెప్పారు. కానీ ఆ పోలీస్ వీరి మాటలు పట్టించుకోలేదు.
చివరికి వారు వాదించి, వాదించి విసిగిపోయి ఆమె తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి పోలీస్ కి ఇచ్చి, ఈ జరిమానా కింద దీన్ని తీసుకోవాలని చెప్పింది. ఆ దంపతులకు మరియు ట్రాఫిక్ పోలీసులకు మధ్య ఈ గొడవ సుమారు రెండు గంటలు కొనసాగింది. ఈ కారణంగా అక్కడ జనం నెమ్మదిగా గుమిగూడారు. ఈ వాగ్వాదం పెద్దది కావడంతో ఒక సీనియర్ అధికారి అక్కడకు వచ్చి కల్పించుకున్నారు. ఆ దంపతులను విడిచి పెట్టాలని ఆ ట్రాఫిక్ పోలీస్కు చెప్పడంతో ఈ వివాదం ముగిసింది.
సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలను నివారించడానికి ఇంత కఠినంగా ప్రవర్తిస్తారు. కానీ ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఆ వాహనదారులను వదిలివేయడం మంచిది. కానీ వాహనదారులు కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. ప్రమాదాలు నివారించడానికి వాహనదారుడు కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.