Just In
- 55 min ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- 1 hr ago టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- 3 hrs ago రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- 3 hrs ago జైలు నుంచి వచ్చాడు.. కోట్లు విలువ చేసే కారు కొన్నాడు - ఎవరో తెలుసా?
Don't Miss
- News మేషరాశిలో సూర్య సంచారం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధననష్టం
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
సైకిల్ ప్రయాణంలో గిన్నిస్ బుక్ రికార్డ్; కేవలం 8 రోజుల్లో కాశ్మీర్ To కన్యాకుమారి చేరిన యువకుడు
చాలామంది యువకులు సాధారణంగా వారిలోని అసాధారణ ప్రతిభతో అసాధారణ కార్యక్రమాలు చేసి ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన చాలా విషయాలు మునుపటి కథనాల్లో చూసాం.. ఇదే తరహాలో ఇప్పుడు కాశ్మీర్కు చెందిన ఒక యువకుడు కేవలం 8 రోజుల్లో సైకిల్ పై కన్యాకుమారి చేరుకున్నాడు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం కాశ్మీర్కు చెందిన 23 ఏళ్ల యువకుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఎనిమిది రోజుల్లోనే పూర్తి చేసి కొత్త రికార్డును కైవసం చేసుకున్నాడు. సైకిల్తో ఈ కొత్త రికార్డు సొంతం చేసుకున్న ఈ యువకుడి పేరు ఆదిల్ తేలి. యితడు సైకిల్ పై కాశ్మీర్లో బయలుదేరి కేవలం ఎనిమిది రోజుల 1 గంట, 37 నిమిషాల్లో 3,600 కిలోమీటర్లు ప్రయాణించి కన్యాకుమారి చేరుకున్నాడు.
ఇంత తక్కువ సమయంలో సైకిల్ పై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చేరుకున్న ఆ యువకుడి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేయబడింది. ఆదిల్ తేలి కాశ్మీర్లోని బుడ్గం జిల్లాలో నివసిస్తున్నట్లు తెలిసింది.
MOST READ:గుండె తరుక్కుపోయే వీడియో.. ముందు బాక్స్లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్
ఆదిల్ తేలి మార్చి 22 న ఉదయం 7:30 గంటలకు శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద ఘంట ఘర్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి మార్చి 30 ఉదయం 9 గంటలకు కన్యాకుమారికి చేరుకున్నారు. ఆయన ప్రయాణానికి కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ కాశ్మీర్ పాండురంగ్ నాయకత్వం వహించారు.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వేగంగా సైక్లింగ్ చేసిన ప్రపంచ రికార్డును గతంలో నాసిక్ యొక్క 17 ఏళ్ల ఓం మహాజన్ సొంతం చేసుకున్నాడు. ఓం మహాజన్ ఎనిమిది రోజుల, 7 గంటల, 38 నిమిషాల్లో కాశ్మీర్ నుండి కన్యాకుమారికి చేరుకున్నాడు. అయితే ఇప్పుడు ఆదిల్ తేలి ఎనిమిది రోజుల 1 గంట, 37 నిమిషాల్లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి చేరుకొని రికార్డ్ బద్దలుకొట్టాడు.
MOST READ:శరవేగంగా సాగుతున్న నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తి; కేవలం 3 నెలల్లో 10,000 యూనిట్లు
ఈ రికార్డును సొంతం చేసుకోవడానికి ఆదిల్ పంజాబ్లోని అమృత్సర్లో సుమారు ఐదు నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడు. గతేడాది డిసెంబర్లో గిన్నిస్ రికార్డ్స్కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది మార్చిలో దరఖాస్తు ఆమోదించబడింది.
తన ప్రయాణంలో ఆదిల్ ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్, హైదరాబాద్ మరియు మదురైతో సహా పలు నగరాల గుండా వెళ్ళాడు. అతనితో పాటు ఫిజియోథెరపిస్ట్, న్యూట్రిషనిస్ట్, మెకానిక్ మరియు కెమెరా సిబ్బంది ఉన్నారు. ప్రయాణం అంతా మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఆదిల్తో కలిసి ఉన్నారు.
MOST READ:మళ్ళీ పట్టాలెక్కిన 'గాతిమాన్ ఎక్స్ప్రెస్'.. టైమింగ్ & ఫుల్ డీటైల్స్
దీనికి సంబంధించి సమాచారం ప్రకారం, కాశ్మీర్ నుండి కన్యాకుమారికి ఆదిల్ ప్రయాణాన్ని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ స్టోరేజ్ కంపెనీ, కాశ్మీర్ యొక్క అబ్రా అగ్రో స్పాన్సర్ చేసింది. ఆదిల్ తేలి సైకిల్తో రికార్డు సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, అతను 2019 లో అత్యంత వేగవంతమైన సైక్లిస్ట్గా కొత్త రికార్డు సృష్టించాడు, శ్రీనగర్ నుండి లేహ్కు కేవలం 26 గంటల 30 నిమిషాల్లో 440 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించాడు
ఈ రికార్డు మరిన్ని కొత్త రికార్డులు సృష్టించడానికి అతన్ని మరింత ప్రేరేపించింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు గిన్నిస్ రికార్డ్స్లో తన పేరు నిలిపాడు. ఏది ఏమైనా అంత దూరం ప్రయాణం 8 రోజుల్లో అంటే నిజంగా అనన్యసామాన్యమనే చెప్పాలి. ఆదిల్ తేలి మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.
MOST READ:భారత్లో 6 కొత్త బైకులను విడుదల చేసిన ట్రయంఫ్, పూర్తి వివరాలు
Image Courtesy: Adil Teli