Just In
- 3 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 6 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 8 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 12 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దుబాయ్లో రిజిస్టర్ అయిన కారుకు కేరళలో ఫైన్ వేశారు, ఎందుకో తెలుసా?
దేశంలోని సంపన్నులు కోట్ల రూపాయల ఖరీదు చేసే కార్లను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు కానీ, వాటిపై పన్నులు చెల్లించడానికి మాత్రం ముందుకి రావటం లేదు. అడ్డదారిలో ఖరీదైన లగ్జరీ కార్లను మనదేశంలోకి దిగుమతి చేసుకొని, వాటిపై చెల్లించాల్సిన దిగుమతి సుంఖాన్ని ఎగవేస్తున్నారు.
తాజాగా, ఇలాంటి సంఘటనే కేరళ రాష్ట్రంలో జరిగింది. కేరళలోని తిరువనంతపురంలో దుబాయ్ దేశంలో రిజిస్టర్ అయిన ఓ రోల్స్ రాయిస్ కారును అధికారులు గుర్తించారు. ఈ కారుపై చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ఎగ్గొట్టి, యదేచ్ఛగా దుబాయ్ రిజిస్ట్రేషన్తో తిరుగుతున్న రోల్స్ రాయిస్ కారును కేరళ రాష్ట్ర మోటారు వాహన శాఖ స్వాధీనం చేసుకుంది.
భారతదేశంలోకి ఎంట్రీ టాక్స్ చెల్లించనందుకు సదరు రోల్స్ రాయిస్ కారు యజమానికి కేరళ మోటారు వాహన శాఖ జరిమానా కూడా విధించినట్లు నివేదికలు చెబుతున్నాయి. విదేశీ రిజిస్ట్రేషన్తో ఉన్న వాహనాలు భారతదేశంలోకి ప్రవేశించడానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో, దుబాయ్ రిజిస్ట్రేషన్తో కూడిన సదరు రోల్స్ రాయిస్ కారు యజమాని, ఆ కారుని మనదేశంలో ఉపయోగించడానికి ఎంట్రీ టాక్స్ చెల్లించడంలో విఫలమైనట్లుగా తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అతనికి రూ.35,000 జరిమానా విధించారు. భారతదేశంలోకి ప్రవేశించే విదేశీ రిజిస్టర్డ్ వాహనాలపై ఎంత మేర పన్ను విధిస్తారనేది స్పష్టంగా తెలియదు.
కానీ, పూర్తిగా విదేశాల్లో తయారై మనదేశంలోకి దిగుమతి అయ్యే కొత్త వాహనాల విషయంలో మాత్రం దిగుమతి సుంఖాలు 100 శాతానికి పైగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో, కొందరు ఈ అధిక దిగుమతి సుంఖాల నుండి తప్పించుకునేందుకు, కొత్త కార్లను ముందుగా విదేశాల్లోనే కొనుగోలు చేసి, అక్కడే రిజిస్టర్ చేయించుకొని అక్కడి నుండి ఇక్కడికి సెకండ్ హ్యాండ్ కారుగా దిగుమతి చేసుకుంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో వాడిన (ప్రీ-ఓన్డ్) కార్లపై దిగుమతి సుంకాలు వేరుగా ఉంటాయి. ఆ అవకాశాన్ని వినియోగించుకునేందుకు కొందరు ఈ మార్గాన్ని ఎంచుకుంటుంటారు. తాజా కేసు విషయంలో కూడా ఇదే జరిగినట్లు అనుమానిస్తున్నారు.
వాస్తవానికి చాలా మంది ప్రవాస భారతీయులు తమ విదేశీ రిజిస్టర్డ్ లగ్జరీ కార్లను భారతదేశంలో గార్నెట్ ద్వారా దిగుమతి చేసుకుని ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ విధంగా తీసుకువచ్చిన వాహనాలను కొన్ని రోజులు లేదా కొన్ని వారాల పాటు మాత్రమే ఇక్కడ ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది.
ఒకవేళ ఎక్కువ కాలం పాటు విదేశీ రిజిస్టర్డ్ వాహనాలను మనదేశంలో ఉపయోగించాలనుకుంటే, సదరు వాహన యజమానులు సంబంధిత అధికారులను సంప్రదించి, తగిన అనుమతులను పొందడం ద్వారా వాటి చెల్లుబాటు వ్యవధిని పెంచకోవచ్చు. గార్నెట్ వాహనాలకు పాస్పోర్ట్ లాంటి, ఇది వాహనాలను ఒక దేశం నుండి మరొక దేశానికి బదిలీ చేయడానికి సహాయపడుతుంది.
కేరళ పోలీసులు జరిమానా విధించిన కారు రోల్స్ రాయిస్ కారును ఘోస్ట్ మోడల్గా గుర్తించారు. భారత మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ.6.95 కోట్ల వరకూ ఉంటోంది. ఈ కారు మొత్తం బరువు సుమారు 2.5 టన్నులు. ఐకానిక్ రోల్స్ రాయిస్ డిజైన్ మరియు లగ్జరీ సౌకర్యాలతో ఈ కారు రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరి చూపును తనవైపుకు తిప్పుకుంటుంది.