కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

భారతదేశంలో మోటార్ వాహన చట్టం ప్రకారం వాహనదారులు కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. వాహనదారులు ఈ నియమాలను పాటించకపోతే పోలీసులు భారీ జరిమానాలు విధించడంతో పాటు, డ్రైవింగ్ లైసెన్సులు కూడా రద్దు చేస్తారు. కావున తప్పనిసరిగా వాహనదారులు ఈ నియమాలను పాటించాలి.

కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

వాహన చట్టం ప్రకారం కారు గ్లాసులపై ఏ విధమైన సన్ ఫిల్మ్ లేదా స్క్రీన్ ఉండకూడదు, ఇది నిషేధించబడింది. వాహనాల్లో జరిగే నేరాలను నిరోధించడానికి సుప్రీంకోర్టు సన్ ఫిల్మ్ లేదా స్క్రీన్ ఉండకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికి అక్కడక్కడా కొంతమంది కార్లలో సన్ ఫిల్మ్‌లను ఉపయోగిస్తున్నారు.

కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

వీరిలో ముఖ్యంగా రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు కార్లలో సన్ ఫిల్మ్ ఉపయోగించి సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడరు. ఇటీవల సన్ ఫిల్మ్ కాలిన వాహనాలపై కేరళ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు.

కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

దీనికి సంబంధించిన వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ వీడియోలో, కేరళ పోలీసులు రాజకీయ నాయకుల వాహనాలను ఆపి వాటిని తనిఖీ చేయడం గమనించవచ్చు. ఈ తనిఖీలో వాహనాలకు సన్ ఫిల్మ్ ఉన్నట్లు తేలితే జరిమానా విధించబడుతుంది.

కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

కేరళ మోటారు ట్రాఫిక్ శాఖ సూచనల మేరకు ఈ కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. మంత్రులు మరియు అధికారుల వాహనాలను తనిఖీ చేసి, వాహనాలకు సన్ ఫిల్మ్ ఉంటె వెంటనే వాటిని తొలగించాలని రవాణా శాఖ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించింది. ఈ సూచనపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

ఈ నేపథ్యంలో మంత్రులందరికీ తమ వాహనాల్లోని సన్ ఫిల్మ్ తొలగించాలని నోటీసు కొద జారీ చేశారు. ఈ మంత్రుల్లో కొందరు సన్ ఫిల్మ్‌లను తొలగించగా, మరికొందరు వాటిని తొలగించకుండా చట్టాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. జెడ్-ప్లస్ భద్రత ఉన్న మంత్రులు మరియు అధికారులు మాత్రమే తమ కార్లలో స్క్రీన్‌లను వ్యవస్థాపించాలి. అంతే కాకుండా ముఖ్యమంత్రి, గవర్నర్ వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తమ వాహనాల్లో ఈ స్క్రీన్‌లను ఉపయోగించవచ్చు.

ఎక్స్ మరియు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వాహనాలు స్క్రీన్‌లను కలిగి ఉంటాయి, కానీ సన్ ఫిల్మ్‌ల కలిగి ఉండవు. అధికారిక వాహనం ముందు మరియు వెనుక భాగంలో క్రాష్ గార్డులను అమర్చడం సాధ్యం కాదు. అధికారిక ప్రభుత్వ వాహనాల్లో సన్ ఫిల్మ్, స్క్రీన్‌లను తొలగించాలని కేరళ మోటారు వాహనాల విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

ఈ ఉత్తర్వు ప్రకారం ప్రత్యేక వాహన తనిఖీ నిర్వహించాలని రవాణా అధికారులను పోలీసు అధికారులను ఆదేశించారు. వాహనాల్లో స్క్రీన్‌లను ఉపయోగించి మహిళపై అత్యాచారాలు మొదలైన అరాచకాలను అరికట్టడానికి సుప్రీం కోర్ట్ ఈ విధమైన ఆదేశాలను జారీ చేసింది.

Image Courtesy: Manorama News

More from DriveSpark

Article Published On: Wednesday, January 20, 2021, 18:29 [IST]
English summary
Kerala Police Launches Special Operation To Remove Sun Film And Curtains. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+