Just In
- 6 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 7 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 8 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 9 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రోడ్డుపై స్కూటర్ రైడ్ చేస్తూ పట్టుబడ్డ మైనర్స్; వారి సమాధానాలకు షాక్ తిన్న పోలీసులు.. చివరకు ఏమైందంటే
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు తీవ్ర స్థాయిలో జరుగుతాయి. ఈ కారణంగానే దేశంలో ప్రతి ఏటా కొన్ని లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. వీటన్నింటిని రూపు మాపడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ట్రాఫిక్ రూల్స్ చాలా వరకు కఠినతరం చేయబడ్డాయి.
భారతదేశంలోని రోడ్డు నిబంధనల ప్రకారం వాహనదారులు రోడ్డుపైకి రావాలంటే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అంతే కాకూండా హెల్మెట్ కూడా తప్పనిసరిగా ధరించి ఉండాలి. ఇలాంటి నియమాలను ఉల్లంగించినట్లతే భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
18 సంవత్సరాలంకంటే తక్కువ వయసున్న వారు ప్రజా రహదారులపైకి వాహనాన్ని తీసుకురావడం చట్ట విరుద్ధం. అయితే తక్కువ వయసున్న పిల్లలు కూడా వాహనాలను డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇదే తరహాలో ఇప్పుడు మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.
నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరిగింది అనే విషయం ఖచ్చితంగా తెలియదు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఇక్కడ మీరు గమనించవచ్చు.
ఈ వీడియోలో మీరు గమనించినట్లతే ఒక స్కూటర్పై ఇద్దరు పిల్లలు పబ్లిక్ రోడ్లపై పోలీసులకు పట్టుబడ్డారు. ఈ స్కూటర్ పై ఉన్న పిల్లలకు హెల్మెట్ లేదు. పోలీసులు వారిని అడ్డగించి హెల్మెట్ లేకుండా ప్రయాణించడమే కాకూండా, ఆ వెహికల్ కి డ్రైవింగ్ లైసెన్స్ గాని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గాని లేదని తెలుసుకున్నారు.
పోలీసులు ఆ పిల్లలను ప్రశ్నించినప్పుడు అది ఎలక్ట్రిక్ స్కూటర్ కావున దీనికి డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ నంబర్ అవసరం లేదని ధైర్యంగా పోలీసులకు చెప్పాడు. అంతే కాకుండా తమ వద్ద గ్రీన్ కార్డు ఉందని కావాలంటే దానిని చూపిస్తామని చెప్పారు.
అయితే కొంత సేపటి తరువాత ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కి లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ ఆవాసం లేదని గ్రహించి, హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి రాకూడని మరియు హెల్మెట్ ధరాయించకుండా రోడ్డుపైకి వస్తే ప్రమాదాలు జరుగుతాయని వారిని హెచ్చరించి అక్కడ నుంచి పంపించేశారు.
భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్న కారణంగా ఎక్కువమంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది మాత్రమే కాకూండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులను పెంచడానికి అనేక రాయితీలు కూడా కల్పిస్తున్నారు. అంతే కాకుండా 250 వాట్ లేదా తక్కువ మోటార్తో నడిచే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రిజిస్ట్రేషన్ మరియు హెల్మెట్ అవసరం లేదని ప్రభుత్వం ఒక నియమాన్ని కూడా అమలు చేసింది.
ఇలాంటి తక్కువ కెపాసిటీ ఉన్న స్కూటర్లను నడపడానికి వయోపరిమితి కూడా లేదు మరియు అందుకే లైసెన్స్ లేని ఎవరైనా వాటిని చట్టపరంగా రోడ్లపై నడపవచ్చు. అయితే ప్రభుత్వం నిర్దేశించినప్పటికీ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్స్ వాహనదారుల జీవితాలను కాపాడతాయి.
గతంలో కూడా హెల్మెట్లు లేని కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. హెల్మెట్లు తలను గాయాల నుండి సురక్షితంగా ఉంచుతాయి, లేకపోతే ప్రాణాలే పోయే ప్రమాదం ఉంటుంది. గంటకు 20 నుంచి 30 కిమీ వేగంతో జరిగే ప్రమాదాలు కూడా తీవ్రంగా గాయపరుస్తాయి.
చట్టబద్ధంగా మైనర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పెట్రోల్ తో నడిచే వాహనాలను రైడ్ చేయకూడదు. నిర్దేశిత వయసున్నవారు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ పొంది వాహనాలను రైడ్ చేయాలి. గతంలో కూడా పోలీసులు భారతదేశంలో తక్కువ వయస్సు గల పిల్లలు రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిది ఆ పిల్లల తల్లిదండ్రులను కూడా అరెస్టు చేస్తారు. తల్లిదండ్రులు దీనిని గుర్తుంచుకుని తమ పిల్లలకు వీలైనంతవరకు వాహనాలతో రోడ్డుపైకి వెళ్లకుండా చూడాలి.
Image Courtesy: ABN Telugu