Just In
- 5 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 7 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 10 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 11 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లాక్డౌన్ లో బయటికి వచ్చిన పిల్లలను పోలీసులు పట్టుకోగానే ఏం చేసారో తెలుసా.. ?
చైనాలో పుట్టిన కరోనా నేడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ కారణంగా ప్రపంచంలో చాల దేశాలు లాక్ డౌన్ లో ఉన్నాయి. భారతదేశం కూడా ఈ కరోనా వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతుండటం వల్ల 21 రోజుల లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ లో ప్రజలు బయటకి రాకూడదని అధికారులు ఆంక్షలు విధించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటికి రాకూడదు. కాని కొంతమంది లాక్ డౌన్ ఉన్నప్పటికీ బయట తిరుగుతున్నారు.
భారత్ లాక్ డౌన్ కారణంగా ప్రజలెవరూ బయటికి రాకూడదు అని అధికారులు ప్రకటించారు. కానీ కొంత మంది నిబంధనలకు వ్యతిరేఖంగా బయట విచ్చల విడిగా తిరుగుతున్నారు. ఈ విధంగా నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు కఠినంగా శిక్షిస్తున్నారు. అంతే కాకుండా వాహనాలను స్వాధీనం చేసుకోవడం మరియు వాహనదారులపై కేసులు కూడా బుక్ చేయడం కూడా జరిగింది.
లాక్ డౌన్ సమయంలో ఇద్దరు పిల్లలు చిన్న బైకులపై బయటికి రావడం మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు. కానీ పోలీసులు ఇంటి నుంచి వెళ్లిన వెంటనే ఇద్దరినీ పట్టుకున్నారు. పోలీసులు పిల్లలను ఇద్దరినీ ఆపి ఇంటి నుండి బయటకు రావడానికి కారణాలు అడిగారు. వారిని పోలీసులు తిరిగి ఇంటికి వెళ్లాలని, ఇలా బయటకు రాకూడదని సలహా ఇచ్చారు.
ఆ పిల్లలు ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారం ఇవ్వడానికి డబ్బును ఉపయోగించుకునేలా పోలీసులకు రూ. 5 వేలు విరాళంగా ఇచ్చారు. ఆ విరాళాలు ఇచ్చిన వీడియో కూడా యూట్యూబ్లో ఉంచాలని కోరుకున్నారు. అందుకే వారు తమ బైక్లపై బయటకు వచ్చారని తెలిపారు.
వీడియోలో కనిపించే పిల్లలు వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లో బాగా ప్రాచుర్యం పొందారు మరియు భారీ ఫాలోయింగ్ కూడా కలిగి ఉన్నారు. ఆన్లైన్లో వైరల్ వీడియోలను రూపొందించడానికి వారు బైక్లను వివిధ ప్రదేశాలకు మరియు ఆఫ్-రోడింగ్కు తీసుకువెళతారు.
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా, దేశం మొత్తం లాక్డౌన్లో ఉంది. కరోనా వైరస్ ఆరోగ్యకరమైన ప్రజలను ప్రభావితం చేయకుండా ఉండటానికి తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతోంది. దీనికి మద్దతుగా ప్రజలు ఇంటివద్దనే ఉండాలని కూడా వారు సూచించారు.
పిల్లడు తమ వాహనాలపై బయటికి వచ్చి విరాళం ఇచ్చే వీడియోలు వైరల్గా మారితే, ఎక్కువ మంది ఇలాంటి పనులు చేసి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఇది లాక్డౌన్ ప్రయోజనాన్ని మొత్తం దెబ్బతీస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి చర్యలను కూడా పూర్తిగా నివారించడానికి పోలీసులు ఇంకా తగిన్ని చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండటమే కొంత వరకు ఇప్పటి పరిస్థితులకు మంచిది.