మొబైల్ క్లినిక్‌లుగా మారిన KSRTC బస్సులు

భారతదేశంలో కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 75,000 పైగా కరోనా రోగులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య పెరగడంతో వైద్య పరికరాల కొరత కూడా పెరిగింది.

మొబైల్ క్లినిక్‌లుగా మారిన KSRTC బస్సులు

కరోనా రోగులకు సరైన చికిత్స చేయడానికి కేవలం వైద్య పరికరాలు మాత్రమే కాదు, ఆసుపత్రుల కొరత కూడా పెరిగింది. ఈ కొరతను అధిగమించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. రైలు బోగీలను ప్రత్యేక వార్డులగా తయారు చేశారు. ఇప్పుడు బస్సులను కూడా మొబైల్ క్లినిక్‌లుగా మారుస్తున్నారు.

మొబైల్ క్లినిక్‌లుగా మారిన KSRTC బస్సులు

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రవాణా బస్సులను తాత్కాలిక ఆసుపత్రులుగా మారుస్తున్నాయి. కరోనా వైరస్ ప్రారంభ రోజుల్లో చైనా కరోనా కోసం ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించింది.

మొబైల్ క్లినిక్‌లుగా మారిన KSRTC బస్సులు

భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి వేగంగా ఆసుపత్రిని నిర్మించే అవకాశం లేదు. ఈ కారణంగా ప్రజా రవాణా వాహనాలు మరియు పాఠశాలలను తాత్కాలిక ఆసుపత్రులుగా మారుస్తున్నారు.

మొబైల్ క్లినిక్‌లుగా మారిన KSRTC బస్సులు

ప్రారంభంలో ఇది ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో మాత్రమే జరిగింది. ఇప్పుడు ఇది దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో చేపడుతోంది. గతంలో కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి ప్రభుత్వ బస్సులను తాత్కాలిక ఆసుపత్రులు మరియు కోవిడ్ -19 పరీక్షా కేంద్రాలుగా మార్చారు.

మొబైల్ క్లినిక్‌లుగా మారిన KSRTC బస్సులు

ఇప్పుడు, కర్ణాటక ప్రభుత్వం ఇలాంటి మార్గంలోనే అడుగులు ముందుకు వేస్తోంది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కెఎస్‌ఆర్‌టిసి రవాణా బస్సులను కరోనా రోగుల కోసం ఆసుపత్రులుగా మార్చారు.

మొబైల్ క్లినిక్‌లుగా మారిన KSRTC బస్సులు

కరోనా వైరస్ ఎక్కువగా ఉండే రెడ్ జోన్లలో ఈ బస్సులు ఈ నడుస్తాయని అధికారులు చెబుతారు. ఏదైనా జ్వరం ఉంటే, బ్లడ్ శాంపిల్ సేకరించి తగిన చికిత్స ఇవ్వబడుతుంది.

మొబైల్ క్లినిక్‌లుగా మారిన KSRTC బస్సులు

ప్రత్యేకంగా తయారుచేసిన ఈ బస్ ఆస్పత్రులను ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ప్రజల ఉపయోగం కోసం ప్రారంభించారు. ఈ బస్సు ఆస్పత్రులు ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులతో పనిచేస్తాయి.

మొబైల్ క్లినిక్‌లుగా మారిన KSRTC బస్సులు

ఈ బస్సులలో ప్రత్యేక వార్డు మరియు ట్రీట్మెంట్ రూమ్ తో సహా వివిధ సౌకర్యాలు ఉన్నాయి. అదనంగా ప్రతి బస్సులో వైద్యులు, ముగ్గురు నర్సులు మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడు.

మొబైల్ క్లినిక్‌లుగా మారిన KSRTC బస్సులు

దీని కోసం ప్రత్యేక వాలంటీర్లను కూడా ఉపయోగిస్తారని చెబుతారు. సామాజిక దూరాన్ని పాటిస్తూనే రోగులకు చికిత్స చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారు ఆదేశించారు. కరోనా నివారించడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు కష్టపడుతున్నాయి. దీనికి ప్రజలు కూడా తమ మద్దతుని ప్రకటించాలి.

More from DriveSpark

Article Published On: Thursday, May 14, 2020, 16:16 [IST]
English summary
KSRTC buses converted as mobile fever clinics and Covid 19 testing lab. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+