Just In
- 10 hrs ago
బిఎమ్డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 12 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 14 hrs ago
భారత్లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్బర్డ్; ధర & వివరాలు
- 15 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులు అకస్మాత్తుగా ప్రయాణం చేయొచ్చు...!
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్ఐ [వీడియో]
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు పోలీసులు కఠినంగా శిక్షించడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల రోజురోజుకి రోడ్డుప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి.
![నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్ఐ [వీడియో]](/img/2021/03/xpsui-vs-normal-girl-war2-1615434801.jpg.pagespeed.ic.dgdmUlp9rS.jpg)
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలను పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, జరిమానా కూడా విధిస్తారు. వాహనాలను పోలీసులు తనిఖీ చేసేటప్పుడు కొన్నిసార్లు వాహనదారులకు మరియు పోలీసుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈ విధమైన గొడవల కారణంగా పోలీసులు అప్పుడప్పుడు వాహనదారులపై పోలీసులు దాడిచేయడం వంటివి కూడా ఇది వరకు చాలా వెలుగులోకి వచ్చాయి.
![నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్ఐ [వీడియో]](/img/2021/03/xpsui-vs-normal-girl-war1-1615434793.jpg.pagespeed.ic.FoWwE6yqNG.jpg)
ఇలాంటి మరో సంఘటన మాండ్యంలో జరిగింది. స్కూటర్స్ తనిఖీ సందర్భంగా తనతో వాదించిన యువతిపై మహిళ పిఎస్ఐ దాడి చేసింది. ఒక మహిళ పిఎస్ఐ ఆ యువతిని చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్గా మారింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులపై ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MOST READ:లంబోర్ఘిని ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్ ఎడిషన్ ఫస్ట్ లుక్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
![నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్ఐ [వీడియో]](/img/2021/03/xpsui-vs-normal-girl-war4-1615434815.jpg.pagespeed.ic.vZtlnukjw5.jpg)
మాండ్యలోని బెజరాగహళ్లి రామన్న సర్కిల్లో పోలీసులు వాహనదారుల రికార్డులను తనిఖీ చేస్తున్నప్పుడు, ఆ యువతిని స్కూటర్ యొక్క డాక్యుమెంట్స్ చూపించమని కోరారు. ఆ సమయంలో ఆ యువతి పోలీసులతో వాదించడం వల్ల, కోపంతో ఉన్న మహిళ పిఎస్ఐ సవితా గౌడ పాటిల్ బాలికను చెంపదెబ్బ కొట్టింది.
![నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్ఐ [వీడియో]](/img/2021/03/xpsui-vs-normal-girl-war6-1615434829.jpg.pagespeed.ic.i9Aaujm6xd.jpg)
అప్పుడు ఆ స్కూటరిస్ట్ మరియు పిఎస్ఐ మధ్య మాటల వాగ్వాదం జరిగింది. మీరు నన్ను ఎవరు కొట్టారని యువతి ప్రశ్నిస్తున్నట్లు మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఆ యువతీ యొక్క స్కూటర్ను ఒక వ్యక్తి నెట్టడం కూడా వీడియోలో ఉంది.
MOST READ:బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా బుక్ చేయండి
ఈ సంఘటన తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళ, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు క్షమాపణలు చెప్పారు. అంతే కాకుండా వీరికి 500 రూపాయల జరిమానా కూడా విధించినట్లు సమాచారం. ఈ సంఘటనపై నివేదిక సమర్పించాలని మాండ్యా జిల్లా ఎస్పీ డిఎస్పికి సూచించారు.
![నడి రోడ్డుపై మహిళా స్కూటరిస్ట్ చెంప చెళ్లుమనిపించిన పిఎస్ఐ [వీడియో]](/img/2021/03/xpsui-vs-normal-girl-war7-1615434837.jpg.pagespeed.ic.OsG3yXe_Dd.jpg)
అంతే కాకుండా పోలీసు సిబ్బంది అందరూ ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసులు కూడా పబ్లిక్ తో మంచిగా ఉండాలని తెలిపారు. వాహనదారులు పోలీసులకు సహరించాలని, అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయని వారు తెలిపారు.
MOST READ:ఢిల్లీలో భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. కారణం మాత్రం ఇదే
Image Courtesy: TV5 Kannada