Just In
- 19 min ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 14 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 17 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 19 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
Don't Miss
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Movies Karthika Deepam 2 April 20th: దీపపై పగతో రగిలిపోతున్న నర్సింహ.. శౌర్యని ఇక్కడే చదివిస్తానంటున్న దశరద్!
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
రన్నింగ్ బైక్పై దంపతుల వెకిలి చేష్టలు.. మండిపడ్డ స్థానికులు.. ఏం జరిగిందో వీడియో చూడండి
ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని వేదాలు ఘోషిస్తున్నాయి. ఇంతటి మహోన్నతమైన వేద భూమిలో ఉన్న ప్రతి ఒక్కరూ అనేక ఆచారాలను విధిగా పాటించాలి. పాచ్యాత్య దేశాలు సైతం మనదేశాన్ని ఎంతగానో కొనియాడుతున్నాయి.
ఇతర దేశాలలోని చాలా అలవాట్లను మనదేశంలో ఆచరించకూడదు. ఒక వేళా ఆచరించదగినవి కానీ సంఘటనలు భారతీయులు తప్పకుండా ఖండిస్తారు. మనదేశంలో బహిరంగగా స్త్రీ, పురుషులు కౌగిలించుకోవడం వంటి వాటికి చోటు లేదు. ఇవన్నీ అనాదిగా నమ్ముతున్న దేశం మనది. అయితే కొంత వరకు సినిమాల ప్రభావం వల్ల వీటి తీరు మారుతోంది.
ఇటీవల బీహార్లోని గయా జిల్లాలో ఒక సంఘటన జరిగింది. దీన్ని చూసిన స్థానికులు వారిపై మండిపడ్డారు. ఈ ఘటనలో దంపతులు పబ్లిక్ రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది. దీనిని మీరు ఇక్కడ చూడవచ్చు.
ఈ వీడియోలో మీరు గమనించినట్లతే బైక్ పై ఉన్న యువతీ బైక్ పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుని, యువకున్ని కౌగిలించుకోవడం వంటివి చేస్తోంది. ఆ యువకుడు చాలా వేగంగా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ఈ సంఘటనను మరో వాహనదారుడు తన మొబైల్ ద్వారా రికార్డ్ చేశాడు.
అయితే, ఈ విధమైన ప్రవర్తనతో వెళ్తున్న దంపతులను స్థానికులు ఆపారు. ఆ తర్వాత ఆ జంటతో సంభాషించాడు. ఈ జంటను మరో బైక్పై వెంబడించి ఆపారు. ఇలా పబ్లిక్ రోడ్డులో ఎందుకు ప్రయాణం చేస్తున్నారని వారిని నిలదీశారు. ఇది వారికీ మాత్రమే కాకూండా రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారులకు కూడా చాలా ప్రమాదం కలిగిస్తుందని హెచ్చరించారు.
ఈ విధంగా చేయడం వాళ్ళ ఆ స్థానికులు పోలీసులకు పిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే ఆ జంట కొంత సమయం తర్వాత అక్కడనుంచి వెళ్లిపోయారు. ఈ జంట సినిమాల ప్రభావంతో ఈ విధంగా చేయడానికి పాల్పడ్డారేమో అనిపిస్తుంది.
2015 లో మధ్యప్రదేశ్కు చెందిన ఒక యువ జంట గోవాలోని పబ్లిక్ రోడ్డులో ప్రయాణించారు. ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసి వీడియోను సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు అప్లోడ్ చేశారు. గోవా పోలీసులు ఈ జంటను వీడియోలో ట్రాక్ చేశారు మరియు వారికి జరిమానా విధించారు. ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు కూడా సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వచ్చాయి.
ఇటువంటి సంఘటనలపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. అయినప్పటికీ ఇటువంటి చర్యలను పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. ఇలా పబ్లిక్ రోడ్డుపై ప్రయాణం చేయడం వలన ఇతర వాహనదారులు దృష్టి మరల్చి ప్రమాదాలకు కారణమవుతారు. ఈ రకమైన ప్రయాణం వారికి మాత్రమే కాకుండా ఇతర ప్రయాణికులకు కూడా ప్రమాదకరంగా ఉంటుంది.
ఈ రకమైన ప్రయాణం చేసి పట్టుబడితే వారికి భారీ జరిమానా విధించబడుతుంది. అంతే కాదు వారికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఈ రకమైన కార్యకలాపాలలో పాల్గొనాలనుకునే వారు పబ్లిక్ రహదారుల్లో కాకుండా, ప్రైవేట్ స్థలాలను ఉపయోగించాలి. బైక్ రైడర్ మాత్రమే కాకుండా బ్యాక్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి. కానీ ఈ వీడియోలో పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చున్న యువతి హెల్మెట్ ధరించలేదు.
వీడియోలో ఉన్న యువకుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతున్నాడు. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ లో ఏ రకమైనదనే విషయం ఖచ్చితంగా తెలియదు. ఇది చూడటానికి క్లాసిక్ 350 బైక్ లాగ అనిపిస్తుంది. ఈ బైక్లో డ్యూయల్ సైలెన్సర్ సిస్టమ్ ఉంది. బైక్ ఓనర్ ఈ బైక్ ని చాలా అందంగా తయారుచేసుకున్నాడు. వాహనదారులు ఇటువంటి విపరీతమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలి.