Just In
- 10 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 12 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 13 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 15 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రన్నింగ్ బైక్పై దంపతుల వెకిలి చేష్టలు.. మండిపడ్డ స్థానికులు.. ఏం జరిగిందో వీడియో చూడండి
ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని వేదాలు ఘోషిస్తున్నాయి. ఇంతటి మహోన్నతమైన వేద భూమిలో ఉన్న ప్రతి ఒక్కరూ అనేక ఆచారాలను విధిగా పాటించాలి. పాచ్యాత్య దేశాలు సైతం మనదేశాన్ని ఎంతగానో కొనియాడుతున్నాయి.
ఇతర దేశాలలోని చాలా అలవాట్లను మనదేశంలో ఆచరించకూడదు. ఒక వేళా ఆచరించదగినవి కానీ సంఘటనలు భారతీయులు తప్పకుండా ఖండిస్తారు. మనదేశంలో బహిరంగగా స్త్రీ, పురుషులు కౌగిలించుకోవడం వంటి వాటికి చోటు లేదు. ఇవన్నీ అనాదిగా నమ్ముతున్న దేశం మనది. అయితే కొంత వరకు సినిమాల ప్రభావం వల్ల వీటి తీరు మారుతోంది.
ఇటీవల బీహార్లోని గయా జిల్లాలో ఒక సంఘటన జరిగింది. దీన్ని చూసిన స్థానికులు వారిపై మండిపడ్డారు. ఈ ఘటనలో దంపతులు పబ్లిక్ రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది. దీనిని మీరు ఇక్కడ చూడవచ్చు.
ఈ వీడియోలో మీరు గమనించినట్లతే బైక్ పై ఉన్న యువతీ బైక్ పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుని, యువకున్ని కౌగిలించుకోవడం వంటివి చేస్తోంది. ఆ యువకుడు చాలా వేగంగా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ఈ సంఘటనను మరో వాహనదారుడు తన మొబైల్ ద్వారా రికార్డ్ చేశాడు.
అయితే, ఈ విధమైన ప్రవర్తనతో వెళ్తున్న దంపతులను స్థానికులు ఆపారు. ఆ తర్వాత ఆ జంటతో సంభాషించాడు. ఈ జంటను మరో బైక్పై వెంబడించి ఆపారు. ఇలా పబ్లిక్ రోడ్డులో ఎందుకు ప్రయాణం చేస్తున్నారని వారిని నిలదీశారు. ఇది వారికీ మాత్రమే కాకూండా రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారులకు కూడా చాలా ప్రమాదం కలిగిస్తుందని హెచ్చరించారు.
ఈ విధంగా చేయడం వాళ్ళ ఆ స్థానికులు పోలీసులకు పిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే ఆ జంట కొంత సమయం తర్వాత అక్కడనుంచి వెళ్లిపోయారు. ఈ జంట సినిమాల ప్రభావంతో ఈ విధంగా చేయడానికి పాల్పడ్డారేమో అనిపిస్తుంది.
2015 లో మధ్యప్రదేశ్కు చెందిన ఒక యువ జంట గోవాలోని పబ్లిక్ రోడ్డులో ప్రయాణించారు. ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసి వీడియోను సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు అప్లోడ్ చేశారు. గోవా పోలీసులు ఈ జంటను వీడియోలో ట్రాక్ చేశారు మరియు వారికి జరిమానా విధించారు. ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు కూడా సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వచ్చాయి.
ఇటువంటి సంఘటనలపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. అయినప్పటికీ ఇటువంటి చర్యలను పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. ఇలా పబ్లిక్ రోడ్డుపై ప్రయాణం చేయడం వలన ఇతర వాహనదారులు దృష్టి మరల్చి ప్రమాదాలకు కారణమవుతారు. ఈ రకమైన ప్రయాణం వారికి మాత్రమే కాకుండా ఇతర ప్రయాణికులకు కూడా ప్రమాదకరంగా ఉంటుంది.
ఈ రకమైన ప్రయాణం చేసి పట్టుబడితే వారికి భారీ జరిమానా విధించబడుతుంది. అంతే కాదు వారికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. ఈ రకమైన కార్యకలాపాలలో పాల్గొనాలనుకునే వారు పబ్లిక్ రహదారుల్లో కాకుండా, ప్రైవేట్ స్థలాలను ఉపయోగించాలి. బైక్ రైడర్ మాత్రమే కాకుండా బ్యాక్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి. కానీ ఈ వీడియోలో పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చున్న యువతి హెల్మెట్ ధరించలేదు.
వీడియోలో ఉన్న యువకుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతున్నాడు. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ లో ఏ రకమైనదనే విషయం ఖచ్చితంగా తెలియదు. ఇది చూడటానికి క్లాసిక్ 350 బైక్ లాగ అనిపిస్తుంది. ఈ బైక్లో డ్యూయల్ సైలెన్సర్ సిస్టమ్ ఉంది. బైక్ ఓనర్ ఈ బైక్ ని చాలా అందంగా తయారుచేసుకున్నాడు. వాహనదారులు ఇటువంటి విపరీతమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలి.