Just In
- 1 hr ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 2 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 4 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
- 5 hrs ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
Don't Miss
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
అక్కడ కరోనా లాక్డౌన్ మరింత పొడిగింపు.. ఈ సర్వీసులకు మాత్రం మినహాయింపు
భారతదేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి ఎక్కువగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి వల్ల ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు. ఈ నేసథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ విధించబడింది.
అయితే ఈ మహమ్మారి మరింత వినాశనాన్ని సృష్టిస్తున్న కారణంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ ని మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ లాక్ డౌన్ లో చాలా ఆంక్షలు విధించడం జరుగుతుంది. కావున ఈ లాక్ డౌన్ 2021 మే 10 ఉదయం 7 గంటల వరకు ఉత్తర ప్రదేశ్లో ఉంటుంది.
ఈ లాక్ డౌన్ లో ఏ సర్వీసులకు మినహాయింపు కల్పించబడుతుంది వంటివాటిని గురించి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక నోటీసులో జరీ చేసింది. దీని ప్రకారం లాక్ డౌన్ సమయంలో కూడా ఈ పాస్ తో సంబంధం లేకుండా కొంతమంది వ్యక్తులు మరియు వాహనాలకు మినహాయింపు కల్పించడం జరుగుతుంది.
MOST READ:నదిలో చెత్తవేసిన మహిళకు సరైన గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఇంతకీ ఏం చేసారంటే?
కరోనా లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన వాటి విషయానికి వస్తే, అవి
- నిర్మాణ పరిశ్రమ మరియు అవసరమైన సేవలతో సంబంధం ఉన్న వ్యక్తులు.
- ఆరోగ్య మరియు వైద్య సేవలకు సంబంధించిన వ్యక్తులు మరియు వాహనాలు.
- మెడికల్ ఎమర్జెన్సీ మరియు టీకాలు వేసిన వారిని సందర్శించడానికి అనుమతించారు.
- పోస్ట్ ఆఫీస్, మీడియా మరియు ఇంటర్నెట్ వంటి సేవలతో సంబంధం ఉన్న ఉద్యోగులు.
పైన తెలిపిన ఈ సర్వీసులు తప్ప మిగిలిన ప్రజలకు గాని రవాణాగాని ఎట్టిపరిస్థితుల్లో అనుమతి కల్పించబడదు. అత్యవసర సమయంలో కావాలంటే ఈ పాస్ పొందవచ్చు. ఈ ఈ పాస్ ద్వారా ప్రజలు బయట తిరగవచ్చు. కరోనా సమయంలో ఈ పాస్ పొందాలనుకునే వారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ యొక్క అధికారిక ఆన్లైన్ పోర్టల్ను సందర్శించడం పొందవచ్చు.
MOST READ:పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే
ఈ-పాస్ అనేది అత్యవసర సమయంలో ప్రజలు బయట తిరగటానికి అనుమతి కల్పించబడుతుంది. దీని కోసం అప్లై చేసుకోవాలంటే మీ వద్ద ఆధార్ కార్డు, పాన్ వంటి డాక్యుమెంట్స్ కచ్చితంగా ఉండాలి. అప్పుడే కరోనా ఈ పాస్ పొందటానికి అర్హులుగా ఉంటారు.
ఉత్తరప్రదేశ్ లో గడిచిన కేవలం 24 గంటల్లో దాదాపుగా 25,858 కొత్త కరోనా సంక్రమణ కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 352 మంది ప్రజలు మరణించారు. దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ సమాచారం ఇచ్చింది. ఆరోగ్య శాఖ ప్రకారం, రాష్ట్రంలో యాక్టీవ్ రోగుల సంఖ్య 2,72,568 కు పెరిగింది.
MOST READ:ఆక్సిజెన్ ట్యాంకర్లను దొంగిలిస్తున్నారు.. జిపిఎస్ ట్రాకర్తో అక్రమాలకు చెక్..
ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ లో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,68,183 కు ఉన్నట్లు అధికారిక నివేదిక దావ్రా తెలిసింది. ఇప్పటిదాకా దాదాపు 3,798 కు పెరిగింది. ఏది ఏమైనా ఈ కరోనా మహమ్మరిని నివారించడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలకు ప్రజలు కూడా మద్దతు తెలపాలి, అప్పుడే ఏదైనా సాధించవచ్చు.